వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 13వ వారం

పైడిమర్రి సుబ్బారావు

పైడిమర్రి సుబ్బారావు బహు భాషావేత్త, మంచి రచయిత. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, పారసీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం ఉంది. జనగణమన, వందేమాతరం తర్వాత అంతే సంఖ్యలో రోజూ లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్న ‘ప్రతిజ్ఞ’ ను రచించింది ఈయనే. ఈయన నల్గొండ జిల్లా , అన్నెపర్తి లో రాంబాయమ్మ, రామయ్యలకు జూన్ 10 , 1916 లో జన్మించారు.1962 చైనా యుద్ధ సమయంలో విశాఖపట్నం డిటివొగా పనిచేశారు.మన విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో పైడిమర్రి ‘ప్రతిజ్ఞ’కు రూపకల్పన చేసి తను రాసిన దానిని తెన్నేటి విశ్వనాథానికి చూపించారు.ఆయన అప్పటి విద్యాశాఖమంత్రి పి.వి.రాజుకు చూపించగా ఆయన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి తో చర్చించి 1965 , జనవరి 26 వ తేదీనుండి ప్రతి పాఠశాలలో ఉదయాన్నే విద్యార్ధుల అసెంబ్లీ సమయంలో ఈ ప్రతిజ్ఞ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయించారు..క్రమంగా ఇది అన్ని భాషల్లోను అనువదించబడింది. వీరి విద్యాభ్యాసం నల్లగొండలోనే జరిగింది. వీరి కుటుంబీకులు ఇప్పటికీ నల్లగొండ లోనే వున్నారు. వీరి సతీమణి వెంకట రత్నమ్మ ఇటీవలే చనిపోయారు. పైడిమర్రి సుబ్బారావు బహు భాషావేత్త, మంచి రచయిత. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, పారసీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం ఉంది. ఆయన తన 18వ ఏటనే ‘కాలభైరవుడు’ (1936) పేరున చిన్న నవల రాశారు.

(ఇంకా…)