వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 11వ వారం

కొమ్మమూరు కాలువ

కొమ్మమూరు కాలువ ఆంధ్రప్రదేశ్‌, గుంటూరు జిల్లాలో దుగ్గిరాల నుండి బాపట్ల జిల్లా, పెదగంజాం వరకు ప్రవహించే పంట కాలువ. దీన్ని ఆంగ్లేయులు, 19 వ శతాబ్దంలో తవ్వించారు. దీని పొడవు 91 కిలోమీటర్లు. ఒకప్పుడు ఇది నౌకా రవాణా మార్గంగా విలసిల్లింది. కాకినాడ నుండి మద్రాసు (చెన్నై) వరకు ఉన్న జల మార్గం లోని కాలువల్లో ఇది ఒకటి. మిగతావి కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, బకింగ్‌హాం కాలువ. భారత ప్రభుత్వం చేపట్టిన జాతీయ జలమార్గాల ప్రాజెక్టు లోని జలమార్గం 4 లో కొమ్మమూరు కాలువ ఒక భాగం. 1855 లో కృష్ణా బ్యారేజిని నిర్మించిన తరువాత ఈ కాలువ నిర్మాణం పూర్తైంది. సాగునీటిని అందించడంతో పాటు, నౌకా రవాణా మార్గంగా కూడా ఇది ఉపయోగపడింది.
(ఇంకా…)