వికీపీడియా:సమావేశం/హైదరాబాద్/సెప్టెంబర్, 2016 గ్రామ వ్యాసాల అభివృద్ధిపై సమావేశం

తెలుగు వికీపీడియాలో సాగుతున్న గ్రామ వ్యాసాల అభివృద్ధికి సంబంధించిన కొత్త ఆకరాల గురించి ఆ ఆకరాలను 2011 జనగణన సమాచారంతో సృష్టిస్తున్న పర్యావరణవేత్తతో వికీపీడియన్లకు సమావేశం.

వివరాలు మార్చు

 
గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

ముఖ్యాంశాలు మార్చు

  • 2011 జనగణన ఆధారంగా ప్రముఖ పర్యావరణవేత్తలు మాధవ్ గాడ్గిల్, సుబోధ్ కులకర్ణి, ప్రశాంత్ పవార్ తయారుచేస్తున్న సమాచారంపై చర్చ.
  • ప్రాజెక్టును తయారుచేస్తున్న టీంలోని సుబోధ్ కులకర్ణిని ప్రాజెక్టు అంశమై ప్రశ్నోత్తరాల కార్యక్రమం.
  • ఈ సమాచారం విషయమై ఆన్-వికీ జరిగిన చర్చను, తెవికీలో జరిగిన పురోగతిని క్రోడీకరించి సభ్యులకు అవగాహన కల్పించడం.
  • ఆన్-వికీలో సభ్యులు చేసిన చర్చలు, సూచనల ఆధారంగా చేయదగ్గ మార్పులు చేర్పుల విషయమై సుబోధ్ తో చర్చ.
  • గ్రామ వ్యాసాల్లో ఫోటోలు చేర్చే వివిధ ప్రయత్నాల గురించి అవగాహన, ఆ అంశంలో నిపుణులైన ఇతరుల (తెలుగు రాని వారు కానీ, వికీపీడియాకు వెలుపలి నిపుణులు కానీ) సూచనలు స్వీకరించి దాన్ని తెవికీలో చర్చిండం ద్వారా పురోగతి.

సమావేశం నిర్వాహకులు మార్చు

ప్రధాన వక్త మార్చు

  • సుబోధ్ కులకర్ణి, పర్యావరణవేత్త, మరాఠీ వికీపీడియన్

సమావేశానికి ముందస్తు నమోదు మార్చు

ప్రత్యక్షంగా మార్చు

స్కైప్/హ్యాంగవుట్స్/ఫోన్ ద్వారా మార్చు

హాజరైనవారు మార్చు

అభినందనలు, సూచనలు మార్చు

నివేదిక మార్చు

కార్యక్రమంలో భాగంగా సభ్యులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూలాలతో గ్రామ వ్యాసాలు అభివృద్ధి చేయడం ఎలా అన్న అంశంపైనా, ఫోటోల చేర్పు కోసం చేపడుతున్న వివిధ ప్రయత్నాల పైనా విహంగ వీక్షణంగా చర్చించారు. ఆపైన ప్రత్యేకించి Githubలో లభ్యమవుతున్న మూలాల విషయమై మాట్లాడి, గ్రామ వ్యాసాల అభివృద్ధి 2016 ప్రణాళిక అన్న ప్రాజెక్టు ఉప పేజీని తయారుచేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఆసక్తి కలిగిన సభ్యులు ఒక్కో మండలాన్నీ స్వీకరించి అభివృద్ధి చేసుకుంటూ పోవచ్చు, ఆ అభివృద్ధిని అక్కడ నమోదు చేయవచ్చు ఐతే అభివృద్ధి చేసేవారంతా అక్కడ రాయాల్సిన అవసరం లేదనీ కూడా చర్చించారు. గ్రామవ్యాసాల విస్తరణకు ఇప్పటివరకూ జరిగిన చర్చలకు అనుగుణంగా ఓ టెంప్లెట్ వ్యాసం లాంటిది తయారుచేస్తే బావుంటుందని సభ్యులు భావించగా తాను ఆ ప్రయత్నం చేస్తానని పవన్ సంతోష్ అన్నారు. ఆ శైలిలోనే కొంత వరకూ వ్యాసాన్ని ప్రణయ్ అభివృద్ధి చేశారు. కార్యక్రమం జరిగిన రోజునే భారత్ బంద్ విజయవంతంగా జరగడంతో పబ్లిక్, ప్రైవేట్ రవాణా సౌకర్యాలు తక్కువగా నడవడంతో కార్యక్రమానికి అతిథి, ముందుగా వద్దామనుకున్న వినయ్, సంతోష్ పంజాల వంటి సభ్యులు హాజరు కాలేకపోయారు.