విధాన్‌భవన్ (నాగ్‌పూర్)

మహారాష్ట్ర శాసనసభ భవనం

విధాన్‌భవన్ (నాగ్‌పూర్) అనేది భారతదేశంలోని మహారాష్ట్ర రెండవ రాజధాని. ఈభవనం నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలోఉంది. ఇక్కడ మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. భవన పునాది రాయి 1912లో వేయబడింది. ఇది నాగ్‌పూర్ రాజధానిగా ఉన్న సెంట్రల్ ప్రావిన్సెస్, బేరార్ పరిపాలనను నిర్వహించడానికి అప్పటి బ్రిటిష్ కమాండ్ ద్వారా నిర్మించబడింది. తరువాత, 1952లో, సెంట్రల్ ప్రావిన్సెస్ & బేరార్ ప్రస్తుత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాలను కలిగి ఉన్న పెద్ద మధ్య భారత రాష్ట్రమైన మధ్య ప్రదేశ్‌గా విభజించబడింది. ఈ రాష్ట్రానికి నాగ్‌పూర్‌ రాజధాని. 1960లో, ఈ రాష్ట్రం మరింతగా విభజించబడింది. విదర్భ ప్రాంతం మహారాష్ట్ర రాష్ట్రంలో విలీనమైంది ఆ విధంగా, నాగ్‌పూర్ తన రాజధాని హోదాను కోల్పోయింది. కానీ, విదర్భ ప్రాంత ప్రయోజనాలను, సమాన అభివృద్ధిని పరిరక్షించడానికి యశ్వంతరావు చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నాగ్‌పూర్ ఒప్పందంపై సంతకం చేసింది. దీని ప్రకారం, నాగ్‌పూర్ మహారాష్ట్ర రెండవ రాజధానిగా చేయబడింది. మహారాష్ట్ర శాసనసభ, రాష్ట్ర శాసన మండలి శీతాకాల సమావేశాలు నాగ్‌పూర్‌లో జరగాల్సి ఉంది.[1]

విధాన్‌భవన్ (నాగ్‌పూర్)

సూచనలు

మార్చు
  1. "Archived copy". Archived from the original on 25 October 2012. Retrieved 19 October 2012.{{cite web}}: CS1 maint: archived copy as title (link)