వీరభద్ర రాజు బహదూర్

రాజా వైరిచెర్ల వీరభద్ర రాజు బహదూర్ (జననం 6 సెప్టెంబర్ 1877) ఒక భారతీయ రాజవంశీకుడు, రాజకీయవేత్త. ఈయన 1891 సెప్టెంబరు నుండి కురుపాం వంశపారంపర్య జమీందారుగా, మద్రాసు శాసన మండలి సభ్యుడిగా పనిచేశాడు.

రాజా వైరిచెర్ల వీరభద్ర రాజు బహదూర్
వీరభద్ర రాజు బహదూర్ చిత్రము
జననం6 సెప్టెంబర్ 1877
వృత్తిరాజకీయవేత్త, జమీందారు
జీవిత భాగస్వామిలక్ష్మీ నరసాయమ్మ
పిల్లలువైరిచెర్ల నరసింహ సూర్యనారాయణ రాజు బహదూర్ (1898-1926),
వైరిచెర్ల నారాయణ గజపతి రాజు బహదూర్ (జ. 1900),
రాణీ జానకి రత్నాయమ్మ

ప్రారంభ జీవితం మరియు విద్య

మార్చు

వీరభద్ర రాజా బహదూర్ 1877 సెప్టెంబరు 6న విజయనగరం జిల్లాలో అప్పటి కురుపాం జమీందారు సూర్యనారాయణ రాజాకు జన్మించాడు.[1] ఆయన విద్యాభ్యాసమంతా ఎఫ్. ఎ. మాస్ అనే ఆంగ్లేయుడి వ్యక్తిగత పర్యవేక్షణలో జరిగింది

రాజకీయ జీవితం

మార్చు

1891 సెప్టెంబరులో తన తండ్రి మరణించిన తరువాత "రాజా" అనే బిరుదుతో వీరభద్ర రాజు కురుపాం జమీందారు అయ్యాడు. ఆ తరువాత 1900ల ప్రారంభంలో రాజకీయాల్లోకి ప్రవేశించి, 1905లో మద్రాసు న్యూయింగ్టన్ సలహా మండలిలో సభ్యుడిగా నియమితుడయ్యాడు. 1906లో ఈయన మద్రాసు శాసన మండలికి సంస్థానాల ప్రతినిధిగా, అదనపు సభ్యుడిగా నామినేట్ అయ్యాడు.

కుటుంబం

మార్చు
 
కురుపాం రాజు వీరభద్ర రాజు బహదూర్, రాణి సాహిబా లక్ష్మీ నరసాయమ్మ చిత్రపటం, రాజా రవివర్మ గీసింది

1897 మే 19న, అనకాపల్లి జమీందారు సర్ గోడే నారాయణ గజపతిరావు రెండవ కుమార్తె రాణి సాహిబా లక్ష్మీ నరసాయమ్మ పట్ట మహాదేవిని వీరభద్ర రాజు వివాహం చేసుకున్నాడు.[2] ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

  • రాజా వైరిచెర్ల నరసింహ సూర్యనారాయణ రాజు బహదూర్ (1898-1926)
  • వైరిచెర్ల నారాయణ గజపతి రాజు బహదూర్ (జ. 1900)
  • రాణీ జానకి రత్నాయమ్మ (1899-1944)

మూలాలు

మార్చు
  • Vadivelu, A. (1903). The Aristocracy of South India. Madras: Vest & Co. pp. 112–122.
  • "Kurupam zamindari". 19 November 2018.
  • C. Hayavadana Rao (1915). The Indian Biographical Dictionary. Madras: Pillar & Co. pp. 181–182.
  1. (in English)   Page:The Aristocracy of Southern India.djvu/156. వికీసోర్స్. 
  2. లక్కోజు, శ్రీనివాస్ (14 ఫిబ్రవరి 2022). "వాలెంటైన్స్ డే: 'వైజాగ్ తాజ్‌మహల్' వెనుక దాగిన ప్రేమకథ తెలుసా". బీబీసీ. Retrieved 1 October 2024.