వీరనాట్యమే వీరుల కొలువు

(వీర నాట్యం నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర దేశంలో వీర శైవ మతం విరివిగా ప్రచారంలో వున్న రోజుల్లో ఆలయాల్లో శైవ మతానికి చెందిన దాసీల నృత్యాద్రాధన చేయటమే కాక, శివ భక్తులు తాండవ పద్ధతికి చెందిన వీరా వేశాన్ని కలిగించే నాట్య కూడా చేసే వారని నటరాజ రామకృష్ణ గారు జానపద కళల ప్రత్యేక సంచికలో వివరించారు. వీర రస ప్రధానలైన అరచనలైన ఖడ్గాలను చదువుతూ ఒక చేత ఖడ్గాన్ని, మరొక చేతిలో డాలును ధరించి నాట్యం చేసేవారు. ఈ నాట్యం వీర నాట్యంగా పిలువ బడింది. వీరు చేసే నర్త్గనాలన్నిటిలో ఊర్ధ తాందావం అతి ముఖ్యమైంది. ఈ నర్తనాన్ని శివరాత్రి నాడు, రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోద్భవ సమయంలో సమయంలో ప్రదర్శించేవారట. శైవ సంప్రదాయానికి సంబంధించిన అన్ని నృత్యాలలోకి ఈ నృత్యం అతి ముఖ్యమైన దంటారు. పల్నాటి యుద్ధంలో ప్రాణాలు వదిలిన వీర యోధుల సంస్మరణార్థం వీరుల కొలువులు ప్రారంభమయ్యే ఆరాధన నృత్యాలు కూడా తాండవ పద్ధతికి చెందినట్టివే, కారెంపూడు, గురుజాల, మాచెర్ల మొదలైన పలనాటి ప్రాంతంలో ఈ నర్తనాలు ప్రదర్శింప బడుతూ ఉన్నాయి.మహబూబాబాద్ జిల్లాలోని కొరవి, కొత్తకొండ ప్రాంతాల్లో ఉన్న వీరభద్ర ఆలయాల్లో ఈ నృత్యం చేస్తారు. ఒక చేతితో కత్తి, మరొక చేతిలో డోలును ధరించి వీరణమనే పెద్ద డప్పు వంటి చర్మవాయిద్యం మోగుతుండగా భక్తులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సాధారణంగా శివాలయంలో జరిగే దూపదీప నైవేద్యం సందర్భంగా ఆలయం ముందు వీధుల మధ్యలో వీరనాట్య కార్యక్రమాలు జరుగుతాయి.[1]

వీరంగం మార్చు

వీర నాట్యంలో, వీరణమనే వాయిద్యం వాయించ బడుతూ వుంటుంది. అందు వల్లనే ఈ నాట్యానికి వీరంగం అంటారు. ఇందులో ముఖ్యంగా అయిదు అక్షరాల ఖండం ఏక తాళ గతి ఎక్కువగా ప్రదర్శింప బడుతుంది.

తత్తదిక తడిక
తజ్జనుత తడిక

వీరుల కొలువులో ముఖ్యంగా వాడబడే వాయిద్యం పంబజోడు :" ఇందులో ముఖ్యంగా చతురశ్ర గతి ప్రయోగింప బడుతూ ఉంది.

జం జం జం జం
సం త రుం త రుం
జం జం జం జం
తరుం త రుం త రుం.

కాకతీయులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన కాలంలో, వీర శైవమూ అందు లోనూ పశుపతి సాంప్రాదాయం వివిరిగా ప్రచారంలో ఉంది.

ఇంటి కొక వీర పుత్రుడు మార్చు

ఆ కాలంలో ప్రతి తల్లీ తండ్రీ తమ యింట పుట్టిన పుత్రుల్లో ఒకణ్ణి వీరునిగా దేశానికి అర్పించే వాడుక వుండేదట. వారినే పసుపతులని కూడా పిలిచేవారు. ఈ వీరులు అవివాహితులై దేశా రక్షణ కోసం ప్రాణాలు అర్పించేవారట. వీరు ప్రతి రోజూ ఆరు పర్యాయాలు శివార్చన చేసేవారట. ఆ పూజల్లో భక్తి భావంతో కూడు కున్న నృత్యం ఒక భాగంగా వుండేదట. ఆ నృత్యాలే వీర నాట్యాలుగా ప్రచారం లోకి వచ్చాయంటారు రామ కృష్ణగారు. ఈ నృత్యాలలో ఈ రస భావం లేని హస్త పాద విన్యాసాలు మాత్రం ప్రదర్శిత మౌతాయి. శివునిచే ప్రదర్శింప బడిన 108 కరణములు అందుకు తగిన చారి భేదాలు కొన్ని ఈ నర్తనంలో ప్రదర్శింప బడుతూ ఉన్నాయి. అలాగే ఆయా ప్రాంతాల్లో వీర శైవ మతానికి చెందిన వారు. వీర శైవులు వీర భద్ర విన్యాసాలు చేయడం, వీరావేశంతో ఖడ్గాలు చదవడం, ఆవేశంతో నారసాలు పొడుచుకోవడం, వీరా వేశంతో తాండవ పద్ధతిలో నృత్యాలు చేయటం పరిపాటి. ఒకో ప్రాంతంలో, ఒకో పేరుతో అవి జరుగుతూ వుంటాయి. అలా కోన సీమలో అమలా పురం ప్రాంతంలో వీర నాట్యం చేయడంలో నిపుణు లున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోన సీమలో వీర నాట్యం చేసే కళాకారు లున్నారు. వీర నాట్యానికి ఒక ప్రత్యేకత, జనాకార్షణా ఉంది. వీర నాట్యం దేశవ్వాప్తంగా ప్రసిద్ధి చెందింది.

దక్ష ప్రజాపతి మార్చు

దక్ష ప్రజాపతి తల పెట్టిన యజ్ఞానికి కన్న కూతురుకీ, అల్లునికీ ఆహ్వానం అందలేదు. పిలవని పేరంటానికి వెళ్ళకూడదని, పరమ శ్సివుడు వారిస్తున్నా పార్వతి ఆ యజ్ఞానికి వెళ్ళి అవమానం పాలై అత్మాహుతి చేసుకుంది. ఆ ఘటనకు ఉగ్రుడైన ముక్కంటి జటా జూటాన్ని నేలకు కొట్టి, అట నుంచి వీ కుమారులతో ప్రయాణ మయ్యాడు. శూల ధారుడై ఆగ్రహ జ్వాలలు గ్రక్కుతూ యజ్ఞ వాటికను చిందర వందర చేసిన వీర కుమారుల పద ఘట్టనలే నాట్య మైంది. అదే వీర నాట్యం.

వీరముష్టుల, వీర నాట్యం మార్చు

ఆంధ్ర దేశంలో వీర ముష్టులు చేసే వీర నాట్యం శైవ సంప్రదాయానికి అద్దం పడుతుంది. శివాలయాల్లో జరిగే దూప సేవ సందర్భంగా ఆలయం ముందు నడివీధిలో వీర నాట్య కార్యక్రమాలు జరుగుతూ వుంటాయి. అలాంటి వీర నాట్యాలు అమలాపురం తాలూకా అయిన వల్లి మండలం. వెలవల పల్లికి చెందిన చింతా వెంకటేశ్వర్లు వీర నాట్యం మీద మోజు పెంచుకుని కట్టు దిట్టంగా నేర్చుకుని, దాని నొక కళారూపంగా తీర్చి దిద్ది, వీధుల్లో ప్రజల సమక్షంలో ప్రదర్శించి ప్శంసలందు కున్న ఈ వీర నాట్య కళారూపాన్ని, జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిచటానికి విశేషమైన కృషి చేశాడు.

అయిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న వెంకటేశ్వర్లు ఒక బృందాన్ని తయారు చేసి 1962 నుంచి పలు దేవాలయల ఉత్సవాల్లో ప్రదర్శించాడు. వీర నాట్యం చేసే వారిని వీర కుమారు లంటారు. వీరు మొలకు ఎరుపురంగు గుడ్డలను ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్తి, మెడలోనూ, జబ్బలకు, రుద్రాక్ష మాలలను అలంకరిస్తారు. నుదుట గంభీరంగా విభూతి రేఖలను దిద్దుకుంటారు. చిన్న శూలాలూ, నిలువెత్తు గల పెద్ద శూలాలూ నోటిలో, బుగ్గలకూ, కంఠానికీ ధరిస్తారు. శూలాల చివర నూనె వత్తులు వెలిగిస్తారు. ఆ వెలుగుతో వారు మరింత ఆవేశ పరులౌతారు.

వీర కుమారుల విజృంభణ మార్చు

ఆ విధంగా పది మంది వీర కుమారులు రౌద్ర రసాన్ని పోషిస్తూ............. ఖండ సంకీర్ణంలో విశ్ర జతులపై నాట్యం సాగిస్తారు........వీర కుమారుల నాట్యానికి అనుగుణంగా ............సన్నాయి, డోలు, తంబురా, తాషామార్పాల ధ్వనులు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. దక్ష వాగికలో వీర భద్రుని ఆధ్వర్యంలో నాటి వీర కుమారుల విధ్వంసం ఇతి వృత్తంగా సాగే వీర నాట్యం ప్రేక్షకులకు గగుర్పాటును కలిగిస్తుంది. ప్రజలు కూడా వీరావేశంలో మునిగి పోతారు. వీర నాట్యం ప్రారంభం, చతురస్త్ర జాతి నడకలో..... తకథిమి....... తకథిమి, తకఝణు, తకఝణు, స్వరాలతో ప్రారంభమై దక్షయాగం బెరచి.............. దక్షుని తల ద్రుంచి దక్ష సంహారమై తరలినావు. అనే పదాలతో, శరభా, అశ్శరభా, దశ్శరభా, శరభ, శరభా అనే నినాదాలతో, శూలాలను నాలుకకూ, కంఠాలకూ గుచ్చుకుని భక్తి తన్మయత్వంతో చేసే వీరా నాట్యం ప్రజలను పరవశుల్ని చేస్తుంది. అందరూ ఆవేశంతో ఊగి పోతారు.

చింతా వెంకటేశ్వర్లు 1981 లో రాజమండ్రిలో ప్రదర్శనం ఇచ్చి, ప్రముఖుల ప్రశంస లందుకున్నాడు.నాట్యానికి హైదరాబాదులో రెండు మాసాలు నుంచి శిక్షణ ఇచ్చి దానినొక విశిష్ట కళారూపంగా తయారు చేశారు. ఆ తరువాత రాష్ట్ర వ్వాప్తంగా, అన్ని జిల్లాలలోనూ, ఆకాశవాణి లోనూ, అప్నా వుత్సవం లోనూ, ఇతర రాష్ట్రాల లోనూ వెయ్యి ప్రదర్శనాలకు పైగా ప్రదర్శనల నిచ్చారు. వెంకటేశ్వర్లుకు చదువు లేక పోయినా, పట్టుదలతో వీర నాట్యాన్ని అభివృద్ధి పర్చి, దానికొక మన్నన తీసుకొచ్చారు.

మూలాలు మార్చు

  1. వీర నాట్యం. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.

వెలుపలి లంకెలు మార్చు