కృష్ణ శతకము

(శ్రీ నృసింహ కవి నుండి దారిమార్పు చెందింది)

కృష్ణ శతకము శ్రీనృసింహకవి రాసిన శతకం. ఇందులో 102 కంద పద్యములు ఉన్నాయి. వీటిని కృష్ణ లీలలు, దశావతారములను వర్ణిస్తూ రాసాడు. ఇది శ్రీకృష్ణునికి అంకితమివ్వబదినది.[1]

కృష్ణ శతకం
కవి పేరుశ్రీ నృసింహ కవి
వాస్తవనామంkrishna sathakam
వ్రాయబడిన సంవత్సరం18వ శతాబ్దం
దేశంభారత దేశము
భాషతెలుగు
మకుటంకృష్ణా!
విషయము(లు)కృష్ణ లీలలు, దశావతారములు
పద్యం/గద్యంపద్యములు
ఛందస్సుకందపద్యాలు
మొత్తం పద్యముల సంఖ్య102
అంతర్జాలం లోవికీసోర్సు లో కృష్ణ శతకం
అంకితంకృష్ణుడు
కీర్తించిన దైవంకృష్ణుడు
శతకం లక్షణంభక్తి శతకం

కవి పరిచయం మార్చు

కృష్ణ శతక కర్త నృసింహ కవి. ఆయన దాదాపు సా.శ. 1760 ప్రాంతమువాడు.[2]

భారద్వాజసగోత్రుడ
గౌరవమున గంగమాంబ కరుణాసుతుడన్
పేరు నృసింహాహ్వయుడన్
శ్రీరమయుత నన్ను గావు సృష్టిని కృష్ణా

అతను రాసిన "తిరిమణి మనుజుడు పరమ పవిత్రుండు" అను పద్యమును బట్టి అతను వైష్ణవ మతానికి చెందిన వాడు కావచ్చు.

శతక విశేషాలు మార్చు

ఈ శతకం చాలా ప్రజాదరణ పొందినది. ఇది భక్తి రస ప్రధానమైనది. ఈ శతకంలో 102 కంద పద్యములలో కృష్ణలీలలు, దశావతారములను వర్ణించడం జరిగింది. సరళమైన భాషలో చిన్నపిల్లలలు కూడా అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. ఈ శతకము లోని మొదటి పద్యం :

శ్రీ రుక్మిణీశ కేశవ

నారద సంగీత లోల నగదర శౌరీ

ద్వారక నిలయ జనార్ధన

కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా||1||

మూలాలు మార్చు

  1. సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "కృష్ణ శతకము : స్తోత్రాలు కీర్తనలు : అలమార : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Archived from the original on 2019-12-02. Retrieved 2020-04-29.
  2. "కృష్ణ శతకము -నృసింహకవి - అచ్చంగా తెలుగు". www.acchamgatelugu.com. Archived from the original on 2019-12-02. Retrieved 2020-04-29.

బాహ్య లంకెలు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: