స. వెం. రమేశ్ తెలుగు భాషాభిమాని, తెలుగు ఉపాధ్యాయులు, తెలుగు భాషా పరిరక్షణ సమితిలో చుఱుకైన సభ్యులు. వీరు వ్రాసిన ప్రళయ కావేరీ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా వ్యవహరింపబడుతున్న ప్రళయకావేరీ తీరాన రచయిత గడిపిన బాల్యంలోని కొన్ని సన్నివేశాలను రచయిత కథలుగా మలిచి చదువరులకు అందించారు.ఈయన శ్రీలంకలోని తెలుగు వారి తెలుగు భాషా భివృద్దికి అధ్భుతంగా కృషిచేస్తున్నారు. తెలుగు భాషాలోకంలో అచ్చ తెలుగు పదాల వేట కొనసాగిస్తున్న అన్వేషకుడు, అలుపెరగని భాషాభిమాని. తెలుగులో ఇతర భాషా పదాలకు బదులుగా ఎంత అందమైన మధురమైన తెలుగు పదాలున్నయో తనరచనలో ఉపయోగించి తెలుగు పాఠకులను, చదువరులను అబ్బురపరచాడు.

శ్రీ

స. వెం. రమేశ్

తెలుగు రచయిత

తెలుగు భాషలో ఒక మాండలికం పై మీ పట్టు ఎలా అబ్బింది? అని అడిగిన ప్రశ్నకు స.వెం. రమేష్ సమాదానం చూడండి. మార్చు

అది నాకు ఆ భాష మీద, ప్రాంతం మీద అభిమానం. అమ్మ ప్రేమలో తీపి, అమ్మ భాషలో తీపి మరచిపోగలిగినవి కాదు. అయితే తెలుగు భాషకు సంబంధించి నాకు కొన్ని మనస్థాపాలు ఉన్నాయి. భాషల అభివృద్ధిలో ఆరు మెట్లు ఉన్నాయి. తమిళం ఆరు మెట్లూ ఎక్కేసింది. తెలుగు మూడో మెట్టు దగ్గర ఆగిపోయింది. శ్రీపాద, చలం మొదలైన వారి తరువాత తెలుగు వాక్యం ఆగిపోయింది.

ఇక్కడ భాషా సంసృతులని వెన్నంటి కాపాడుకోవాల్సిన కవులు, మేధావులు ఉదాసీనత వహిస్తున్నారు. మనది కాని దాన్ని మోస్తున్నారు. కవితల్లో కూడా యధేచ్చగా ఆంగ్లాన్ని వాడుతున్నారు. నాకో దళిత స్నేహితుడున్నాడు. అతను బాతిక్, జానపద కళాకారుడు. పేరు పుట్టా పెంచల దాసు. ఎక్కువ చదువుకోలేదు. సాహిత్యం మీద ప్రీతి ఉన్నవాడు. అతను ఈ కవుల కవిత్వాన్ని ఆస్వాదించే అర్హత లేనివాడా? కవి, రచయిత తాను శ్రమించి పాఠకుడికి అర్ధం చేయించగలగాలి. పాఠకుడు శ్రమించాలని కోరుకోకూడదు.

భాష స్థాయి పెరగాలంటే స్థానికీకరణకి ప్రాముఖ్యత పెరగాలి. తెలుగు నాట ఎన్నోమాండలికాలు ఉ న్నాయి. ఈ మాండలికాలు అన్నిటినీ నిర్మూలించి ఒక మాండలికాన్నిమాత్రమే ‘ప్రామాణికం’ చేస్తున్నారు. ప్రపంచీకరణను ఎదిరించాలన్నా స్థానికీకరణ అవసరం ఉంది. ( ఆయా ప్రాంతాల వంటలను రక్షించుకోవటం). దళితులు మూలవాసులు కాబట్టి వారి మాండలికం, వారి జీవనవిధానం, వారి ఆహరపు అలవాట్లు సంరక్షిస్తూ, తెలుగు ప్రజలు దళితీకరణ చెందాలంటాను. ఈ కార్యం తమిళనాడులో చాలా వరకు జరిగింది. ద్రవిడ ఉద్యమం వారికి చాలా సహాయ పడింది.

ప్రళయ కావేరి కథలు గురించి రచయిత .... మార్చు

ప్రళయ కావేరి కథలు నా బాల్యానికి చెందినివి. బాలుడిగా నాకా అనుబంధాలే గుర్తు ఉన్నాయి. కాని ఎదిగిన మనసుతో ఇప్పుడు పరికిస్తే మా కుటుంబం పాటించిన వివక్ష నా జ్ఞానానికి అందింది. సరిదిద్దలేని, క్షమించలేని అణచివేతకి, వివక్షకి కొన్ని తరాలుగా మన పెద్దవాళ్ళు పాల్పడ్డారు. ఈ మధ్య ఒకాయన ఏదో చర్చలో “మా తాతలు చేసిన తప్పులకు మమ్మల్ని ఎందుకు భాధ్యుల్ని చేస్తారు? ” అని అడిగారు. తప్పక బాధ్యత వహించాలి అంటాను నేను . అలా బాధ్యత వహించటానికి మనం సంసిద్ధంగా లేనట్లైతే మనం మారనట్లే. నేను ఎంత సంస్కర్తనైనా ‘బ్రాహ్మిణిజం’ అనే పలుకుకు ఉడుక్కొంటున్ననంటే నాలో ఆ బీజాలు మిగిలి ఉన్నట్లే. ఆధిపత్యానికి పర్యాయపదమే బ్రాహ్మణిజం.

మీకథల్లో స్త్రీ పాత్రలకే ప్రాధాన్యతిచ్చారు. ఎందుకు? .... మార్చు

నాకు 14 మంది అమ్మమ్మలు. వాళ్ళ మధ్య పెరిగాను. స్త్రీల బలాలను, బలహీనతలను దగ్గరగా చూసిన వాడిని. కాబట్టే నా కథలన్నీ స్త్రీల చుట్టే ఎక్కువగా తిరుగుతాయి.

కథలు వ్రాసే రచయితల గురించి సం.వెం. రమేష్..... మార్చు

“కవి, రచయిత తాను శ్రమించి పాఠకుడికి అర్ధం చేయించగలగాలి. పాఠకుడు శ్రమించాలని కోరుకోకూడదు.”

రచనలు మార్చు

  • ప్రళయకావేరి కథలు[1]
  • ఎల్లలు లేని తెలుగు[2]
  • కతల గంప[3]
  • "మొరసునాడు కతలు" (ఇదిస.వెం.రమేశ్, స. రఘునాథ సంపాదకత్వంలో వెలువడిన కథల సంకలనం) [4]
  • సజీవ సంప్రదాయంగా వేమన

మూలాలు మార్చు

  1. "ప్రళయకావేరి కథలు. స.వెం.రమేశ్. స. వెం. రమేశ్". patrika.kinige.com/. Feb 2015. Archived from the original on 2014-07-14. Retrieved 2015-03-01.
  2. "ఇతరములు (02-Feb-2015)". andhrajyothy.com. 2 Feb 2015. Retrieved 2015-03-01.[permanent dead link]
  3. "స.వెం. రమేశ్ 'కతల గంప'". vihanga.com/. 2015-01-01. Retrieved 2015-03-01.
  4. "KinigeFebruary 22, 2013". facebook.com/Kinige/posts. February 22, 2013. Retrieved 2015-03-01.

బయటి లంకెలు మార్చు