ఆంధ్ర జానపద గేయ సాహిత్యంలో హరి హరీ పదాలు కూడా ప్రముఖ స్థానాన్ని అలంకరిస్తున్నాయి.

అందర్నీ ఆనంద పర్చిన హరి హరీ పదాలు. మార్చు

హరి హరీ నారాయణ ఆది నారాయణా కరుణించి మమ్మేలు - కమల లోచనుడ ........ || హరి ||

హరి హరీ పదాలన్నీ ఈ పల్లవితోనే నడుస్తాయి. ఒకో ప్రాంతంలో, ఒకో పాటా, ఒకో ఆటా, ఒకో కథా, బహుళ ప్రచారంలో వున్నట్లే ఈ హరి హరీ పదాలు కూడా విశాఖపట్టణం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో విశేష ప్రచారాన్ని కలిగి ఉన్నాయి. ఈ పేరుతోనే అనేక కథలూ, సుద్దుల రూపంలోనూ చెపుతూ వుంటారు.

వీటినే జంపెలని కూడా అంటారు. హరిహరీ పదాల్లాంటి పాటలే మన యక్ష గానాల్లో కూడా చాల వరకు వ్రాయ బడి ఉన్నాయి. పదాల ల్నడక ప్రారంభం నుంచీ చివరి వరకూ ఒకే వరుసలో నడుస్తుంది. మధ్య మధ్య కథా గమనాన్ననుసరించి వచనంలో తేట తెల్లంగా కథ యొక్క అర్థాన్ని చెపుతారు. సన్ని వేశాలను బట్టి ఇంకా కీర్తనలు కూడా పాడుతూ వుంటారు. కథకుడు పదం పాడితే, ప్రక్కనున్న వంత దారులు ఆ.............. అంటూ శ్రుతిలో దీర్ఘంగా సాగ దీసి శ్రుతి పక్వంగా ఒక గమకాన్ని జత కలుపు తారు. హరి హరీ పదాలు కేవలం ఎవో జానపద గేయాల్లాగా కాకుండా మన కళా రూపాల్లో అదీ ఒక కళా రూపంగా వెలుగొందుతూ ఉంది. వీటి కథల్లో చాలవరకు రామాయణ, భారత కథలే ఎక్కువగా ఉన్నాయి. భారతం నుంచి నలచరిత్ర, శశి రేఖా పరిణయం, విరాట పర్వం; ఉత్తర గోగ్రహణం మొదలైనవే కాక పాతాళ హోమం శతకంఠ రామాయణం, కుశలాయకం మొదలైనవీ, శివ గాతలూ, గంగా వివాహం, సారంగధర చరిత్రా రాణిస్తూ వుంటాయి.

ప్రాంతీయ కళా రూపం మార్చు

హరి హరీ పదాలు ఎక్కువగా విశాఖ జిల్లాలోనే ప్రచారం పొందాయి. ఇతర జిల్లాలకు ఏమాత్రం వ్వాపించలేదు. అందుకు కారణం కూడా లేక పోలేదు. విశాఖ మండల ప్రాంతీయ భాష మనలకు చాల భిన్నంగా వుంటుంది. వారి మాట తీరు ప్రత్యేకంగా అదోలా వుంటుంది. మాండలిక మైంది. అందువల్ల ఆ పదాలు ఇతరులు వ్రాయడం కూడా కష్టమే అందువల్ల ఆ మండలం వారే వారి ప్రజలకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే శైలిలో వ్రాస్తారు. ఇప్పటికీ వ్రాయబడిన పదాలన్నీ కూడా అటువంటివే. చీపురు పల్లి -- రాజా - పాలకొండ - వీరఘట్టం ఆముదాల వలస, శ్రీకూర్మం, విజయనగరం, శ్రీకాకుళం, మొదలైన ప్రాంతాల్లో ఈ కథలను రకరకాలుగా చెపుతారు. అన్ని కళా రూపాల కన్న ఈ హరి హరీ పదాలు - జముకుల కథలు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. 1862 ప్రాంతంలో పూరి రామ చంద్ర రాజు కుశలాయక పదాన్ని రచించాడు. అలాగే 1874 ప్రాంతంలో పూరి నారాయణ రాజు ధర్మాంగద చరిత్రను రచించాడు. 1922 లో మంధా సుబ్బరాయ శాశ్రీ పాతాళ హోమం అనే పదాన్ని 1925 లో పొడుగు రామ బ్రహ్మ కవి గయోపాఖ్యానం వైకుంఠ మహాత్యం రచించాడు. అయ్యగారి కూర్మనాథం 20 వ శతాబ్దంలో విరాట పర్వాన్ని పదంగా రచించాడు.

ఇలా పైడిగొండ అప్పన్న సుభద్రా కళ్యాణం చంద్రగిరి తాతయ్య ఉత్తర గోగ్రహణం ముడుంబ లక్ష్మణాచార్యులు శ్రీ రామ కథను 1895 లో రచించాడు. చిత్రాడ కామేశంసోంపుర వాసి - త్రినాథుని చరిత్ర - నడిమింటి రామ యోగి 1864 లో బాణాసుర యుద్ధం కటోజు వీరాచారి భల్లాణ రాయపదం చెర్విరాల బాగయ్య గారి పదం కొమిరెల్లి మల్లకథ ఉన్నాయి. ఈ విధంగా అనేక హరి హరీ పదాలున్నాయి. పైన ఉదహరించిన హరి హరీ పదాల రచనలన్నీ, మన జానపద కళారూపా లైన హరి కథలలోనూ, ల్యక్షగానాలలోనూ, వీధి నాటకాలలోనూ, బుర్ర కథలలోనూ ఉదహరింపబడే ఉన్నాయి. అందు వల్లనే మన జానపదులకు పూర్వ పురాణ గాథలన్నీ తేట తెల్లంగా తెలిసి పోయాయి. ఈ హరి హరీ పదాల విషయంలో టేకు మళ్ళ కామేశ్వర అరావు గారు ఎక్కువ కృషి చేసి వ్రాశారు. కిన్నెర పత్రికలో వారి అనుభవాల నుంచీ సేకరణల నుంచీ కొన్ని ఉదహరిస్తాను.

మనకు దొరికే పదాలన్నీ ఇటీ వలవే కాబట్టి, ఇవన్నీ చాలవరకు ఆధునిక పదాలు. ఈ పదాల వరస లక్షణం ఒకటే. ఈ రకం పదాలలో స్వకపోల కల్పితాలు ఇంచు మించుగా నున్న ఇవన్నీ ఇతర రచనలను చూచి రంచినవేననీ, దీనికి కారణం చదువుక్క వారు పురాణాలను ప్రబంధాలను చదివి ఆనందించ గలరనీ నిరక్షరాస్యుల కది సాధ్యం కాదనీ, కాబట్టి వీరి అంతస్తుకి తగిన రచనలు అవసరమనీ అందువల్ల జానపద కవులు ప్రాకృఅ జనుల కోసం పెద్ద గ్రంథాల లోనికి కథలనూ, భావలనూ అనుసరించి పదాలుగా రచించారనీ, తామూ అలాగే చేస్తున్నామనీ కొందరు కవులు తెలియ చేసారనీ కామేశ్వర రావు గారు అంటు కొందరు కవులను పేర్కొన్నారు. అందుకు వుదాహరణగా పూరు రామ చంద్ర రాజు కుశలాయక పదాన్ని వివరించారు.

తఠినంబు కాంచితే, కాపులకు తెలియది మరుగులుంచుట మాన మాటలుంచితిని

గంగా వివాహం మార్చు

గంగా వివాహ పదాన్ని పనగాడ సయాసి రాజు గారు 1856 వ సంవత్సరంలో రచించాడు. ఇది స్కాంద పురాణం లోని కథ. కాని ఈ పద కవి, ఈ కథను తెలుగు దేశానికి అన్వయింప చేశాడు. ఏలూరులో శంభు దేవుడనే జాలరి పున్నాడస్నీ అతనికి గంగ జన్మించిందనీ శివుడు వచ్చి ఆమెను వలచి వివాహం చేసుకున్నాడనీ వ్రాశారు. గంగ వివాహ కథ, పొంగి పారుతున్న గంగ తుంపరలు ఈశ్వరుని వెండి కొండ మీద పడగా ఈశ్వరుడికి కోపం వచ్చి, గంగను భూమిమీద పుట్టనమి శపించాడు. భూలోకంలో శంభుదేవుడు చక్రమ్మ అనే దంపతులకు గంగ జన్మించింది. కయ్యాల మారి నారథుడు ఎరుకత వేషంలో వచ్చి గంగకి శివుణ్ణి గురించి చెప్పగా ఆమె శివుణ్ణి వలసింది. ఆసంగతి తిరిగి వెళ్ళి శివుడికి చెప్పాడు. శివుడు జంగం వేషం ధరించి వస్తాడు. ఆ విధంగా గంగకూ శివునికి వివాహం జరుగుతుంది. అమె తలను ధరించి వెండి కొండకు వెళ్ళాడు శివుడు. కాని పార్వతికీ విషయం తెలుస్తుందేమో నని భయం. రహస్యం బయట పడించి. పార్వతికి కోపం వ్చింది. శివుడు బ్రతిమాలాడు. అప్పుడు గంగకు కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళింది. ప్రపంచంలో ఎక్కడా నీటి చుక్క లేదు. పార్వతికి ఏ దారి దొరకక గంగను బ్రతిమలాడింది. అందరూ వెండి కొండకు చేరారు సుఖంగా ఉన్నారు. సన్యాసి కవి గంగా వివాహంలో ఎన్నో వర్ణనలు వర్ణించాడు. ఈ కథలో సంభాషణలు అతి సహసంగానూ, సంవాదాలు చాల చమత్కారంగానూ ఉన్నాయి. గంగా గౌరుల సంవాదంలో కవి తెలుగు మాఆటల్ని చాల చమాత్కారంగా వర్ణించాడు.

ఉధారణకు మార్చు

గౌరి|| ఉన్న చోటను నున్న ఉండమన్నందుకు తప్ప కను నీ జిహ్వ తరిగింతు గంగ

గంగ|| నీవు తరిగిన కూర నేను తరిగిన కూర వండి వడ్డింతుమే వనిత గౌరమ్మ

గౌరి|| చెంప కాయలు గొట్టి చెవులూడదీతుగా జగడ పోతుల మారి జాలారి గంగ

గంగ|| నీవు గొట్టిన కాయ నేను గొట్టిన కాయ గంప నింపింతుమే కాంత గౌరమ్మ.

గౌరికి కోపం రాగా శివుడు అర్థ నారీత్వాన్ని చక్కగా తెలియ చేశాడు. గంగకు మంగళ సూత్రం కట్టాడు.

సన్యాసి రాజు రచనలో నిండుగా లోకోక్తులు, నానుళ్ళు, జాతీయాలు ఉన్నాయి. శివుడు భార్య గురించి చెప్పిన వాక్యాలు ఈ నాటి వారికి కూడా ఆదర్శ ప్రాయంగావున్నాయి.

ఎందరో హరి హరీ పదాలను రచించారు

ఈ విధంగా హరి హరీ పదాలను ఎందరెందరో రచించారు. వారిలో కలగర్ల వేంకట కామౌయ్య లక్ష్మణ మూర్ఛనూ 1850 లో పసగాడ సన్యాసి రచించిన పదాలు సారంగధర చరిత్ర శతకంఠ యుద్ధం (శతకంఠ రామాయణం గంగావివాహం మొదలైనవి రచించేడు.

మూలం: మార్చు

తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.