అమలాపురం గ్రంథాలయం

అమలాపురం గ్రంథాలయం ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణకేంద్రంలోని గ్రంథాలయం.ప్రతీ సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు, సాహితీవేత్తల,జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తూ ఉంటారు.[1]

అమలాపురం గ్రంథాలయం
దేశముభారతదేశం
తరహాప్రధమ శ్రేణి శాఖ గ్రంథాలయం
స్థాపితము1954
ప్రదేశముతూర్పు గోదావరి జిల్లా, అమలాపురం, ముమ్మిడివరం గేట్,గాంధీ బజార్
శాఖఅమలాపురం
గ్రంధ సంగ్రహం / సేకరణ
సేకరించిన అంశాలుపుస్తకాలు, పరిశోధన గ్రంథాలు, దిన-వార-మాసిక-పక్ష-వార్షిక పత్రికలు, చేవ్రాతలు
గ్రంధాల సంఖ్య23,699 పుస్తకాలు/పత్రికలు
చట్టపరమైన జమఔను
ప్రాప్యత, వినియోగం
వినియోగించుటకు అర్హతలుఎవరైనా రావచ్చును
సభ్యులుదరవత్తులు 2467

చరిత్ర మార్చు

అమలాపురం ప్రధమ శ్రేణి శాఖ గ్రంథాలయం తూర్పు గోదావరి జిల్లా,అమలాపురం,ముమ్మిడివరం గేట్ గాంధీ బజార్ వద్ద ఒక ప్రైవేట్ బిల్లింగ్ లో ఉంది.దీనిని 11 అక్టోబర్ 1954 లో స్థాపించారు. ఈ గ్రంథాలయంలో సాంకేతికవిజ్ఞానం,కళలు, వినోదం,సాహిత్యం,చరిత్ర, భూగోళ విజ్ఞానం,బాల సాహిత్యం,సాధారణ గ్రంథాలు, కంప్యూటరు విజ్ఞానం,తత్త్వశాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం, మత గ్రంథాలు,సాంఘిక శాస్త్రాలు,భాష గ్రంథాలు,విజ్ఞాన శాస్త్రాలు చైతన్య స్ఫూర్తిని రగిలించే అనేక పుస్తకాలు ఉన్నాయి.ఈ గ్రంథాలయంలో 23,699 పుస్తకాలు ఉన్నాయి.దరవత్తులు 2467 మంది ఉన్నారు.2012 నుండి ఆంధ్రజ్యోతి దినపత్రికలు అందుబాటులో ఉన్నాయి.గ్రంథాలయంలో ఏటా గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.

పుస్తక ప్రదర్శన మార్చు

54 జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో స్వాతంత్ర గాథలు, చరిత్ర పై పుస్తకాలు ప్రదర్శించారు.వివిధ విభాగాల్లో జరిగిన చిత్రలేఖన పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వి. కృష్ణకామేశ్వర్ నిర్వాహణలో 350 దేశాల నాణేలు, కరెన్సీ నోట్ల ప్రదర్శన జరిగింది.[2][3]

గ్రంథపాలకులు మార్చు

గ్రంథాలయం స్థాపించినప్పటి నుండి 6 మొత్తంగ్రంథపాలకులు పని చేశారు.

  • సిహెచ్ సుబ్బారావు
  • వి.అర్.పి నాగరాజు
  • పి.బుల్లి రామయ్య
  • నల్ల రాధ కృష్ణ మూర్తి
  • జి వర్మ
  • కె.జె. కుమారి

గ్రంథాలయ పని దినాలు మార్చు

ఈ గ్రంథాలయం ఉదయం 8 నుండి సాయంత్రం 8 గంటలు వరకు ఉంటుంది. శుక్రవారం, ప్రతి రెండవ శనివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో సెలవు ఉంటుంది.

నూతన గ్రంథాలయ నిర్మాణం మార్చు

1954 లో స్థాపించిన నేటికి ప్రైవేట్ బిల్లింగ్ లో ఈ గ్రంథాలయ.2021 లో కోటి రూపాయలు గ్రాంట్ తో నాలుగో వార్డు గారపాటి వీధీలో గ్రంథాలయం భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.అమలాపురం పట్టణ ప్రజల కోరిక మేరకు నల్ల సూర్యచంద్రరావు డిజిటల్ గ్రంథాలయంగా పేరు పెడతామని అన్నారు.కానీ ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు.ఈ గ్రందలయనికి వీక్షకులు ఎక్కువగా ఉన్న సదుపాయాలు అరకొర ఉన్నాయి. పార్కింగ్ సకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు.

మూలాలు మార్చు

  1. "గ్రంథాలయాలకు నిర్లక్ష్యపు చెదలు". Sakshi. 2016-11-14. Retrieved 2022-01-04.
  2. "పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం". ఆంధ్రప్రభ. 2021.
  3. "54 గ్రంథాలయ వారోత్సవాలు". వార్తా. 2021.

వెలుపల లింకులు మార్చు