ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర

తెలుగు సంగీత చరిత్ర పుస్తకం


ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర 1986 లో విడుదలైన తెలుగు రచన.[1] దీనికి భూసురపల్లి వెంకటేశ్వర్లు రచించి, సంపాదకత్వం వహించారు. ఈ పుస్తకానికి ముఖచిత్రాన్ని బాపు చిత్రీకరించారు.

ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర
Andhra pradesh nadaswara dolu kalakarula charitra.png
కృతికర్త: భూసురపల్లి వెంకటేశ్వర్లు
అంకితం: పదాల సుబ్బారావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): చరిత్ర
ప్రచురణ:
విడుదల: 1986

దీనికి బెజవాడ గోపాలరెడ్డి, పుట్టపర్తి నారాయణాచార్యులు, సి. నారాయణరెడ్డి, దాశరథి, యం. ఆర్. అప్పారావు, యస్వీ జోగారావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, తుమ్మల సీతారామమూర్తి మొదలైనవారు అభినందించారు.

రచయిత ఈ కృతిని పదాల సుబ్బారావు, లక్ష్మీ సరోజిని దంపతులకు అంకితమిచ్చారు.

నేపధ్యం మార్చు

హిందూ ఆరాధనా సంప్రదాయంలోను, వైవాహిక వ్యవస్థలోను అత్యంత ప్రముఖ్యం కలిగిన మంగళప్రదమైన వాద్యాలు నాదస్వరం, డోలు. ఈ రంగంలో విశేషమైన కృషిచేసిన వారి చరిత్రలను సేకరించి అందరికీ అందించాలని ఈ రచన చేశారు. వారి చరిత్రతో పాటు సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆయా వాద్యాల ప్రస్థానాన్ని కూడా పూర్వభాగంలో అందించారు.

సహాయసహకారాలు మార్చు

ఈ పుస్తక రచనకు తమ అనుభవంతో విలువైన సమాచారాన్ని అందించిన డోలువాద్య పితామహులు ఈమని రాఘవయ్య గారికి, షేక్ చినమౌలానా, వెల్లటూరి నారాయణ మొదలైన వారికి రచయిత కృతజ్ఞతలను అందించారు. గ్రంథముద్రణకు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయాన్ని అందించింది.

మూలాలు మార్చు