ఆంధ్రప్రభ

తెలుగు దినపత్రిక

ఆంధ్రప్రభ ఒక తెలుగు దిన పత్రిక. దీనిని 1938 ఆగష్టు 15న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని రామనాథ్ గోయంకా మద్రాసులో ప్రారంభించాడు.[1] అప్పుడు ఖాసా సుబ్బారావు సంపాదకుడిగా ఉన్నాడు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకుడైనాడు. 1942లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించి సుమారు 16 సంవత్సరాలు పనిచేశాడు. కొంతకాలం విద్వాన్ విశ్వం సంపాదకునిగా వున్నాడు. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల వెంకటేశ్వర రావు సంపాదకత్వానికి రాజీనామా చేశాడు. యాజమాన్యం మారడానికి ముందు సుమారు దశాబ్దకాలం వి. వాసుదేవ దీక్షితులు సంపాదకుడిగా పనిచేశాడు. పొత్తూరి వేంకటేశ్వరరావు 1977 మే 5 న హైదరాబాదు సంచిక స్థానిక ముద్రణ ప్రారంభపు తొలి స్థానిక సంపాదకుడుగా చేరి 1980 వరకు పనిచేశాడు. ఆ తరువాత కొంతకాలం ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ఎడిటర్ గా పనిచేసి మరల 1983 లో మరల దినపత్రిక ఎడిటర్ పదవి చేపట్టి, 1991 జూన్ 6 న పదవీ విరమణ చేశాడు. [2]

ఆంధ్రప్రభ
2020-11-02 నాడు పేపర్ తొలిపేజీ
రకంప్రతిదినం
రూపం తీరుబ్రాడ్షీట్
యాజమాన్యంది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్
ప్రచురణకర్తది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్
స్థాపించినదిఆగస్టు 15, 1938; 85 సంవత్సరాల క్రితం (1938-08-15)
మద్రాసు,[1]
ముద్రణ నిలిపివేసినది1958-59
జాలస్థలిhttp://www.prabhanews.com/home

మూలాలు మార్చు

  1. 1.0 1.1 బెందాళం, క్రిష్ణారావు (2006). "మేటి పత్రికలు-ఆంధ్రప్రభ", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 418–419.
  2. పొత్తూరి, వేంకటేశ్వరరావు (2015). విధి నా సారథి. ఎమెస్కో. pp. 167–168. ISBN 978-93-85231-06-3.

బయటి లింకులు మార్చు