ఇద్దరు మిత్రులు (1999 సినిమా)

ఇద్దరు మిత్రులు, స్నేహం అనే ఆంశం చుట్టూ అల్లబడిన కథతో 1999లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి, సాక్షి శివానంద్ ఇద్దరు మిత్రులుగా నటించారు.

ఇద్దరు మిత్రులు
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రాఘవేంద్ర రావు
నిర్మాణం అడ్డాల చంటి
రచన దివాకర్ బాబు
చిత్రానువాదం కె. రాఘవేంద్ర రావు
తారాగణం చిరంజీవి,
సాక్షి శివానంద్,
రమ్య కృష్ణ,
సురేష్,
చంద్రమోహన్
సంగీతం మణి శర్మ
నృత్యాలు లారెన్స్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ ఆర్.కె.ఫిల్మ్ ఆసోసియేట్స్
భాష తెలుగు

కథ మార్చు

చిరంజీవి, సాక్షి శివానంద్ ఒకరినొకరు ఏడిపించుకొంటూ సరదాగా సమయం గడిపే మిత్రులు. వారికి పెళ్ళి చేయాలన్న పెద్దవారి భావాన్ని తిరస్కరించి కేవలం మిత్రులుగానే ఉన్నారు. చిరంజీవి రమ్యకృష్ణను చూచి ప్రేమలో పడతాడు. అప్పుడా అమ్మాయిని ఆకర్షించడానికి చిరంజీవికి సాక్షి శివానంద్ సలహాలు ఇస్తుంది. ఎలాగో చిరంజీవికి రమ్యకృష్ణతో పెళ్ళి జరుగుతుంది. కాని చిరు, సాక్షిల మధ్య ఉన్న చనువు పట్ల రమ్యకృష్ణ అనుమానాలు పెంచుకొంటుంది. సాక్షి శివానంద్ పట్ల ఆకర్షితుడైన సురేష్ (ఒక ఫొటోగ్రాఫర్) చిరంజీవి సహకారంతో ఆమెను పెళ్ళి చేసుకొంటాడు. కాని పెళ్ళి తరువాత కూడా సురేష్ తన గర్ల్ ఫ్రెండులతో తిరుగుతూ ఉంటాడు. సురేష్‌కు నచ్చజెప్ప బోయిన చిరంజీవి అవమానం పాలవుతాడు. సాక్షిని నిందించి సురేష్ ఇంటినుండి పంపేస్తాడు. తరువాత జరిగిన సంఘటనలు వారిపట్ల ఇతరుల అపార్ధాలను మరింత పెంచుతాయి.

ఇలా గాయపడిన మనసులు, విచ్ఛిన్నమైన సంసారాలలోని వ్యక్తుల మధ్య సాగే కథ ఇంకా క్లిష్టమౌతుంది. చివరకు కొన్ని సంఘటనలు, ప్రయత్నాలు, ఒక ప్రమాదం కారణంగా ఒక కొలికి రావడమే ఈ సినిమా కథ.

తారాగణం మార్చు

విశేషాలు మార్చు

పాటలు మార్చు

  • ఏడేడు లోకాలలో చూళ్ళేదు ఇలాంటి అమ్మాయి - బాలు, చిత్ర , రచన: చంద్రబోస్
  • దేఖ్ బేబీ దేఖ్ - బాలు, చిత్ర , రచన: చంద్రబోస్
  • చాంగ్ చాంగ్ చాంగ్ రే - ఉదిత్ నారాయణ్ , హరిణి, రచన:చంద్రబోస్
  • మనసా వాచా మనసిస్తే - మనో, చిత్ర , రచన:చంద్రబోస్
  • బంగారం తెచ్చి - పార్ధసారధి , చిత్ర, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • హే రుక్కు రుక్కు మేమ్ (చిరంజీవి, రంభలపై చిత్రీకరించినది) , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, రచన: చంద్రబోస్
  • నూటొక్క జిల్లాల , మనో, చిత్ర ,రచన: చంద్రబోస్ .

మూలాలు మార్చు