ఉట్నూరు కోట తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు మండలంలోని ఉట్నూరు గ్రామంలో ఉన్న కోట. చుట్టూ అడవుల మధ్య ఎత్తయిన గుట్టల ప్రాంతంలో ఉన్న ఈ కోట గోండు రాజులకు ప్రధాన స్థావరంగా ఉండేది.[1]

ఉట్నూరు కోట
ఉట్నూరు, ఉట్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ
రకముకోట
స్థల సమాచారం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరంసా.శ. 1309
కట్టించిందిగోండు రాజులు
వాడిన వస్తువులురాతి

కోట చరిత్ర మార్చు

గోండు రాజులు తమ స్థావరాలకోసం సా.శ. 1309లో మూడు ఎకరాల స్థలంలో ఉట్నూరులో కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించారు.[2] ఈ కోటలో ఆత్రం రాజ్‌ గోండుల, సీతాగొంది రాజుల 700 యేండ్ల చరిత్ర దాగివున్నది.

కోట విశేషాలు మార్చు

ఈ కోట చుట్టూ 8 అడుగుల లోతైన కందకం ఏర్పాటుచేశారు. కోటకు తూర్పుభాగంలో ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం పటిష్ఠమైన కలపతో, కోట లోపల ప్రహరీ గోడలు, బురుజులు వంటివి ఇటుక సున్నంతో పటిష్ఠంగా నిర్మించబడ్డాయి. లోపలి ద్వారం పక్కగా ఎత్తయిన వేదికపైనున్న దర్బారు చోటికి చేరుకోవడానికి మెట్లు, ద్వారానికి ఎడమపక్క దిగుడు బావి, ఆనాటి రాజ కుటుంబానికి చెందిన స్త్రీలు స్నానంచేయడానికి స్నాన వాటికలు, దుస్తులు మార్చుకునేందుకు వీలుగా రాతి గదులు మొదలైనవి ఏర్పాటుచేయబడ్డాయి. కోట వివరాలు, అప్పటి చరిత్రకు సంబంధించిన విషయాలన్ని కోటలోలప మోడీ లిపిలో రాయబడ్డాయి. కోటలో ఒక ఫిరంగి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఆదివాసుల ఆధ్వర్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి.

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "గోండు రాజుల కోటలు". ఎడిటర్. Archived from the original on 6 October 2019. Retrieved 6 October 2019.
  2. ఈనాడు, ప్రధానాంశాలు. "గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!". Archived from the original on 6 October 2019. Retrieved 6 October 2019.