ఉప్పులూరి సంజీవరావు
ఉప్పులూరి సంజీవరావు 20వ శతాబ్దపు ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు, గాయకుడు.[1][2]
ఉప్పులూరి సంజీవరావు | |
---|---|
ఉప్పులూరి సంజీవరావు | |
జననం | జూన్, 1889 పామర్రు, కృష్ణాజిల్లా |
మరణం | సెప్టెంబర్ 11, 1957 |
ఇతర పేర్లు | సావిత్రి సంజీవరావు |
ప్రసిద్ధి | రంగస్థల నటుడు, గాయకుడు |
జననంసవరించు
ఉప్పులూరి సంజీవరావు కృష్ణాజిల్లా పామర్రులో 1889 జూన్ లో జన్మించాడు.
రంగస్థల ప్రస్థానంసవరించు
సంజీవరావు చిన్నతనంలో పదమూడవ ఏటనే బందరు బుట్టయ్యపేట కంపెనీలో చేరి బాల పాత్రలో నటించాడు. పదహారవ ఏట స్త్రీ పాత్రలో నటించడం ప్రారంభించాడు. నటుడు, మైలవరం బాలభారతీ సమాజంలో నాయికా పాత్రధారుడైన సంజీవరావు శృంగార, కరుణ రసాభినయంలో దిట్ట. సావిత్రి పాత్రలో రసవత్తరంగా నటించడం వల్ల సావిత్రి సంజీవరావు అనే పేరు వచ్చింది.
సొంతంగా ఒక నాటక సంస్థను స్థాపించాడు. దీంతో సంజీవరావు కీర్తి నలుదిశలకు వ్యాపించింది. మైలవరం రాజా ఆహ్వానంతో నెల జీతం మీద మైలవరం కంపెనీలో చేరాడు.[3] ఈయన నటించిన సావిత్రి, ద్రౌపది పాత్రలు చూడడానికి దూరప్రాంతాల నుంచి జనం వచ్చేవారు. సావిత్రి నాటకంలో ‘‘పోవుచున్నాడె నా విభుని ప్రాణంబులు గొని’’ అని పాడిన పాట ప్రేక్షక హృదయాలను ద్రవీభూతం చేసేది.
నటించిన పాత్రలుసవరించు
సావిత్రి, ద్రౌపది, శకుంతల, కైక, ఊర్వశి, సత్యభామ, మల్లమ్మదేవి, చిత్రాంగి, మోహిని, దమయంతి, లీలావతి, సీత, చంద్రమతి, చింతామణి.
బిరుదులుసవరించు
అపర సావిత్రి, రంగరత్న, రంగరాజహంస.
మరణంసవరించు
1957, సెప్టెంబర్ 11న విజయవాడలో స్వర్గస్థులయ్యారు.
మూలాలుసవరించు
- ↑ ఉప్పులూరి సంజీవరావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 613.
- ↑ "History Of Birth And Growth Of Telugu Cinema (Part 8) - cinigoer.com". Archived from the original on 2016-03-05. Retrieved 2013-07-21.
- ↑ నాటక భిక్షపెట్టిన మైలవరం రాజా! - ఆంధ్రప్రభ - 31 జూలై 2009[permanent dead link]