ఎన్.కరుణాకర్ పత్రికా చిత్రకారుడు.[1]

కరుణాకర్ ఎన్.
కరుణాకర్
జననంకరుణాకర్ ఎన్.
జనవరి 22, 1953
విశాఖపట్నం
మరణంసెప్టెంబరు 12, 2013
హైదరాబాద్
ప్రసిద్ధిసుప్రసిద్ద పత్రికా చిత్రకారుడు
పిల్లలుఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
తండ్రిసూర్య ప్రకాశరావు,
తల్లికస్తూరిబాయి,

జీవిత విశేషాలు మార్చు

బాపు, బాలి తరువాత పత్రికా చిత్రకళలో కరుణాకర్ విశేష కృషి చేశాడు. విశాఖపట్నంలో సూర్య ప్రకాశరావు, కస్తూరిబాయి దంపతులకు 1953, ఆగస్ట్ 4 న జన్మించాడు. ఆయన అమీర్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి, ఏపి కాలేజీ నుండి బి.ఎస్.సి., తర్వాత బి.ఎఫ్.ఏ.(ఫోటోగ్రఫీ) డిగ్రీ అందుకున్నాడు. ప్రముఖ పత్రికలలో చిత్రకారుడిగా పనిచేశాడు. సోమాజిగూడలోని క్రాంతిశిఖర అపార్ట్‌మెంట్‌లో ఆధునిక గ్రాఫిక్స్‌ను నడిపాడు. గురుబ్రహ్మ టీ.వీ. సీరియల్ కు 1997 సం. నంది అవార్డు అందుకున్నాడు. ఈయన ఆంధ్రభూమి, స్వాతి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, రచన లాంటి అనేక పత్రికల్లో సుమారు రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు పాఠకులను తన చిత్రాలతో అలరించాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

కరుణాకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. 2013 సెప్టెంబరు 12 గురువారం సాయంత్రం గుండెనొప్పితో మృతి చెందారు.[2]

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు