సానిపల్లి మంగమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగే ఎన్నికలకు స్థానిక సంస్థల కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1][2] ఎస్.మంగమ్మ మార్చి 17న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైంది.[3]

ఎస్.మంగమ్మ

శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
మార్చి 2023
నియోజకవర్గం స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం డిసెంబర్ 1959
శీబావి గ్రామం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
జీవిత భాగస్వామి సానిపల్లి గంగాధర
వృత్తి రాజకీయ నాయకురాలు

వ్యక్తిగత జీవితం మార్చు

మంగమ్మ శ్రీ సత్య సయి జిల్లా పెనుగొండ మండలం, మునిమడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీ దివంగత ఎస్.గంగాధర్ ను 1979లో వివాహమాడింది. ఆమె కల్యాణదుర్గం మండలం సిబాయి గ్రామంలో జన్మించింది. మంగమ్మ ఏడవ తరగతి వరకు చదివింది. ఈమెకు నలుగురు కుమారులు. ఆమె భర్త గంగాధర్ 1989- 90, 1991 -96, 1998-2000లో హిందూపురం కాంగ్రెస్ ఎంపీగా పని చేసి 2005లో అనారోగ్యంతో మరణించాడు.

రాజకీయ జీవితం మార్చు

ఎస్.మంగమ్మ హిందూపురం మాజీ ఎంపీ దివంగత ఎస్.గంగాధర్ సతీమణి. ఆమె 2014 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన టికెట్ రాలేదు. ఆమె కుమారుడు పెనుగొండ జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  2. Sakshi (21 February 2023). "మంగమ్మకు ఎమ్మెల్సీ!". Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  3. Sakshi (17 March 2023). "'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.