ఒరేయ్ రిక్షా
ఒరేయ్..రిక్షా! 1995లో విడుదలైన తెలుగు సినిమా. దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఆర్.నారాయణ మూర్తి, రవళి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమాలో గద్దర్ 8 పాటల్లో ఎటువంటి పారితోషికం లేకుండా 6 పాటలు రాశాడు. , వందేమాతరం శ్రీనివాస్ ఉత్తమ గాయకుడు అవార్డును అందుకున్నాడు. "నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" పాటకు నంది పురస్కారం గద్దర్ కు లభించింది. కానీ అతను ఆ పురస్కారాన్ని తిరస్కరించాడు.ఈ సినిమా నవంబర్ 09, 1995న విడుదలైంది.[2]
ఒరేయ్ రిక్షా (1995 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
భాష | తెలుగు |
తారాగణం సవరించు
- ఆర్.నారాయణ మూర్తి (సూర్యం),
- రవళి,
- రఘునాథరెడ్డి (వెంకటరత్నం),
- ముక్కా నరసింగ రావు,
- పురాణం సూర్య,
- నార్రా వెంకటేశ్వరరావు,
- ముక్కురాజు,
- ఎంఎస్ నారాయణ ,
- శివ పార్వతి,
- పూజిత,
- శ్రీదివ్య
సాంకేతిక వర్గం సవరించు
- కథ, చిత్రానువాదం: దాసరి నారాయణరావు
- సంభాషణలు: సంజీవి
- సాహిత్యం: గద్దర్, దాసరి, సి. నారాయణ రెడ్డి (బుర్ర కథ)
- నేపథ్య గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వందేమాతం శ్రీనివాస్, చిత్ర
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: రమణ రాజు
- కూర్పు: కృష్ణంరాజు
- కళ: బి. చలం
- పోరాటాలు: జూడో రత్నం
- నృత్యాలు: ముక్కు రాజు
- కార్యనిర్వాహక నిర్మాత: దాసరి వెంకటేశ్వరరావు
- నిర్మాత, దర్శకుడు: దాసరి నారాయణరావు
- బ్యానర్: దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ
- విడుదల తేదీ: 1995 9 నవంబర్
పాటలు సవరించు
- ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమె నా రిక్షకు పెట్రోలు [3]
- మల్లె తీగకు పందిరి వోలె మస్క చీకటికి వెన్నెల వోలె
- జాగొరె జాగొరె
- ఆపురా రిక్షావోడా
- జాతరెల్లి పోదామె
- రాజ్యాంగం చట్టమంటు
- అమ్మకన్నా
- గణగణగణ
అవార్డులు సవరించు
- ఈ చిత్రంలో పాడిన వందేమాతరం శ్రీనివాస్కు ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది.
మూలాలు సవరించు
- ↑ "Orey Riksha (1995)". Indiancine.ma. Retrieved 2020-08-21.
- ↑ Sakshi (9 November 2020). "ఆర్. నారాయణమూర్తి సినిమాకు 25 ఏళ్లు". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
- ↑ "'నా రక్తంతో నడుపుతాను రిక్షాను' గద్దర్ భావోద్వేగం." Samayam Telugu. Retrieved 2020-08-21.