మిత్తుల అయ్యవార్లనీ, దాసరులనీ పిలువబడే వీరు, ఈ కడ్డీ వాయిద్యంలో ప్రవీణులు. ఈ వాయిద్యం వీణ మాదిరిగా ఉంటుందట. వీణ మాదిరే దీనిని కూడా చేతి వ్రేళ్ళతోనే వాయిస్తారు. వీరు ముఖ్యంగా ఈ వాయిద్యం మీద భగవన్నామ సంకీర్తనలు వాయిస్తూ వుంటారు.

ఈ కడ్డీ వాయిద్యాన్ని ముందు నిల బెట్టుకుని రెండు సన్నని పుల్లలతో జలతరంగ్ వాయిద్యాన్ని వాయించినట్లు వాయిస్తారు. ఈ స్వర మాధుర్యం ఎంతో మధురంగా వుంటుంది. వీరి వృత్తికి ప్రాణప్రదమైంది ఈ వాయిద్యమే. అయితే ఈ వాయిద్యాన్ని అందరూ వాయించలేరు. దీనికి ప్రత్యేకమైన శిక్షణ తోనూ, సాధన తోనూ సాధించ వలసిందే. అందువల్లనే ఈ వాద్య కాండ్రలో ప్రవీణులు చాల తక్కువ. తెలంగాణలో ఈ వాయిద్యంలో ప్రసిద్ధు లైన వారు కరీంనగర్ జిల్లా మెట్టుపల్లి తాలూకాలో ఉన్నారు. ఈ కళా రూపాన్ని శిథిలం కాక ముందే రక్షించు కోవడం అవసరం.

సూచికలు మార్చు

యితర లింకులు మార్చు