కలగర సాయి లక్ష్మణరావు

భారతీయ రాజకీయ నాయకుడు

కలగర సాయి లక్ష్మణరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం కృష్ణా జిల్లా -గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

కె.ఎస్. లక్ష్మణ రావు
కలగర సాయి లక్ష్మణరావు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2019 - 29 మార్చి 2025
నియోజకవర్గం కృష్ణా జిల్లా -గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం

2007 - 2010
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
ఎమ్మెల్సీ
నియోజకవర్గం కృష్ణా జిల్లా -గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 18 ఆగష్టు 1956
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్
తల్లిదండ్రులు వెంకటేశ్వర రావు, జయలక్ష్మి
జీవిత భాగస్వామి విజయ కుమారి
పూర్వ విద్యార్థి సి.ఆర్.రెడ్డి కళాశాల

రాజకీయ జీవితం మార్చు

కె.ఎస్‌.లక్ష్మణరావు మొదటిసారి 2007లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[2]ఆయన తిరిగి 2014లో పోటీ చేసి ఓడిపోయాడు. లక్ష్మణరావు మార్చి 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నూతలపాటి అంజయ్యపై ఎమ్మెల్సీగా గెలిచాడు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం1,49,319 ఓట్లు పోలైతే లక్ష్మణ రావుకు 80,670 ఓట్లు రాగా, నూతలపాటి అంజయ్య 12,550 ఓట్ల వచ్చాయి దీనితో ఆయన 68,120 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికయ్యాడు.[3]

మూలాలు మార్చు

  1. The Hindu (29 March 2019). "Lakshmana Rao wins council poll" (in Indian English). Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.
  2. "Lakshmana Rao is winner in teachers' constituency". The Hindu. 26 March 2007. Archived from the original on 4 November 2012. Retrieved 12 June 2021.
  3. The Hans India (28 March 2019). "K.S.Lakshmana Rao elected from Guntur-Krishna districts Graduates MLC constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.