కిరాయి రౌడీలు
కిరాయి రౌడీలు (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
---|---|
తారాగణం | చిరంజీవి, రాధిక, మోహన్బాబు |
సంగీతం | కె. చక్రవర్తి |
భాష | తెలుగు |
చిత్రకథ సవరించు
శివుడు (ప్రభాకరరెడ్డి), బాబూరావు(రావు గోపాలరావు), చలపతి(జగ్గారావు ప్రాణస్నేహితులు.[1] బ్యాంకులో కొల్లగొట్టబడిన నగల పెట్టె వీరికి దొరుకుతుంది. బాబూరావు చలపతిని చంపివేసి, శివుడిని చావబాది చలపతిని శివుడే చంపాడని పుకార్లు పుట్టించి నగలను కొట్టివేస్తాడు. కాలక్రమేణా బాబూరావు పెద్ద సారావ్యాపారిగా మారి లక్షలు గడిస్తాడు. చలపతి కొడుకు కోటి (మోహన్ బాబు), శివుడి కొడుకు రాజా (చిరంజీవి) పొట్టకూటి కోసం కిరాయి రౌడీలుగా మారతారు. రాజా, బాబూరావు కుమార్తె జ్యోతి (రాధిక) ఇద్దరూ ప్రేమించుకుంటారు. బాబూరావు అమ్మిన కల్తీ సారా తాగి ఎందరో అమాయకులు మరణిస్తారు. ఇది సహించలేక కోటి బాబూరావు గిడ్డంగులను దగ్ధం చేస్తాడు. అందుకు ప్రతీకారంగా బాబూరావు కోటి గుడ్డి చెల్లెల్ని బలవంతంగా రప్పించి అనుభవిస్తాడు. ఆ గుడ్డి చెల్లెలు మరణించడంతో కోటి బాబూరావుపై పగబడతాడు. ఆ పగను ఎలా సాధిస్తాడు అనేది మిగిలిన సినిమా కథ.
మూలాలు సవరించు
- ↑ వెంకట్రావ్ (1 January 1982). "చిత్రసమీక్ష - కిరాయి రౌడీలు". ఆంధ్రపత్రిక. p. 13. Retrieved 5 October 2016.[permanent dead link]