కొవ్వూరు మండలం
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం
కొవ్వూరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.[4]ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి,అందులో ఒకటి నిర్జన గ్రామం. గోదావరి నదీ తీరాన నెలకొన్న సుందరమైన ఆధ్యాత్మిక పట్టణం, కొవ్వూరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణాలలో ఒకటి. చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రి (రాజమండ్రి) గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. మండలవ్యవస్థ రావడానికి పూర్వం కొవ్వూరు ఒక తాలూకా కేంద్రంగా ఉండేది. గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి.OSM గతిశీల పటం
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°01′01″N 81°43′55″E / 17.017°N 81.732°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
మండల కేంద్రం | కొవ్వూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 112 km2 (43 sq mi) |
జనాభా వివరాలు (2011)[3] | |
• మొత్తం | 1,08,445 |
• సాంద్రత | 970/km2 (2,500/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1031 |
మండలం లోని పట్టణాలు సవరించు
మండలం లోని గ్రామాలు సవరించు
రెవెన్యూ గ్రామాలు సవరించు
మూలాలు సవరించు
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Villages & Towns in Kovvur Mandal of West Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-03-18.