కోడూరు ప్రభాకర రెడ్డి
కోడూరు ప్రభాకర రెడ్డి తెలుగు కవులు. సాహితీ కారులు. వృత్తిపరంగా వైద్యులు[1].
జీవిత విశేషాలు
మార్చుకోడూరు ప్రభాకరరెడ్డి కడపజిల్లా పాలగిరి గ్రామంలో 1947 ఆగస్టు 11న జన్మించారు. ఇతని తండ్రి కోడూరు చెన్నారెడ్డి, తల్లి కోడూరు ఓబులమ్మ. ఇతని విద్యార్హత యం.బి.బి.యస్., యం.డి, వృత్తి -శిశువైద్యం, ఇతని సహధర్మ చారిణి పార్వతి - బి .ఎ. వీరి సంతానం కళ్యాణ చక్రవర్తి, - బి .టెక్., హిమబిందు, బి యస్సీ., నరేంద్ర కుమార్ రెడ్డి, బి. టేక్. ప్రభాకరరెడ్డి వృత్తి రీత్యా శిశు వ్వైద్యులైనప్పటికి ఇతని ప్రవృత్తి మాత్రం సాహిత్యం. రేనాటి పలుకుబడులు- పేరుతో కోడూరు ప్రభాకర రెడ్డి రేనాటి ప్రాంతపు మూడు వేలకు పైగా పదాలను సేకరించి వాటిని ఆకారాది క్రమంలో పేర్చి, వాటి అర్ధం, సమార్ధక ఆంగ్లపదం ఇస్తూ ఆ పదాన్ని ఎలా వాడారో ఉదాహరణగా ఇచ్చారు.
కృతులు
మార్చు- రాగావిపంచి (ఖండ కావ్యం) రెండు ముద్రణలు,
- పల్నాటి భారతం (పద్య కావ్యం) రెండు ముద్రణలు,
- ద్రౌపది (గద్యకృతి) రెండు ముద్రణలు,
- హృదయరాగం (ఖండకావ్యం),
- చాటుకవిసార్వభౌమ "శ్రీనాథుని చాటువులు - రెండు ముద్రణలు ,
- కవికోకిల "దువ్వూరి రామిరెడ్డి కవిత్వం - వ్యక్తిత్వం ,
- కవితారస పానశాల (వ్యాససంకలనం) ,
- శ్రీనాథ విజయం (రేడియో నాటికలు) ,
- దేవర (ఖండకావ్యం),
- బాలగేయాలు (సంకలనం) ,
- శృంగార తిలకం (అనుసృజనం),
- అశ్రుగీతి (అనుసృజనం)
- మీరా గీతామృత ధార (అనుసృజనం)
పురస్కారాలు
మార్చు- ఉండేల విజ్ఞాన పీఠం ( హైదరాబాద్ ) వారిచే "పల్నాటిభారతం " పద్య కావ్యానికి ఉత్తమ కావ్యంగా 25000 రూపాయలు బహుమతి ( 1997 )
- సి.పి.బ్రౌన్ ( కడప ) స్మారక పురస్కారం ( 2001 )
- శ్రీ నన్నయ భట్టారక పీఠం ( తణుకు ) వారిచే "రాగావిపంచి " పద్యకృతికి ఉత్తమ పద్య గ్రంథ పురస్కారం ( 2005 )
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ( హైదరాబాద్ ) ధర్మనిధి పురస్కారం ( 2006 )
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ( హైదరాబాద్ ) సాహిత్య పురస్కారం ( 2009 ) -నాటక ప్రక్రియలో "శ్రీనాథ విజయం " గ్రంథానికి
- బాల శౌరి రెడ్డి సమ్మాన్ పురస్కారం ( 2010 )
- శ్రీ నన్నయభట్టారక పీఠం - తణుకు -డా.జి.యస్వీ.ప్రసాద్ -పురస్కారం ( 23-03-2015).
మూలాలు
మార్చు- ↑ "AUTHOR'S PROFILE". Archived from the original on 2016-03-05. Retrieved 2015-03-28.