కోయవారిపాలెం, ప్రత్తిపాడు

కోయవారిపాలెం, గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కోయవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కోయవారిపాలెం is located in Andhra Pradesh
కోయవారిపాలెం
కోయవారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°12′49″N 80°21′57″E / 16.213644°N 80.365934°E / 16.213644; 80.365934
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

  1. బండారు ఆంజనేయులు అను విద్యార్థి, ఐదవ మైలు గ్రామం నుండి వచ్చి, కోయవారిపాలెం గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుచున్నాడు. ఇతడు, 2013 నవంబరు 11న జరిగిన జిల్లా స్థాయిలో జరిగిన క్రీడాపోటీలలో ప్రథముడిగా నిలిచాడు. ఇతడు రాష్ట్ర స్థాయిలో వారు నిర్వహించె, 100 మీటర్ల పరుగు పందెం, అండర్-14 లాంగ్ జంప్పోటీలలో జిల్లా తరఫున పాల్గొనడానికి ఎంపికైనాడు.
  2. స్కూల్ గేంస్ ఫెడరేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్వర్యంలో, 2015,నవంబరు-7 నుండి 9 వరకు గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలలో ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న బండారు రమేష్ 3వ స్థానం సాధించి జాతీయపోటీలకు ఎంపికైనాడు.

గ్రామ పంచాయతీ మార్చు

  1. ఈ గ్రామవాసులైన తుమ్మల పెదసుబ్బారావు, దార్శనికుడు.ఇతను తొలిసారి 1981లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో పోటీచేసి సర్పంచిగా ఎన్నికైనాడు. అప్పటినుండి వరసగా మూడుసార్లు ఎన్నికై ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశారు. దాతలు స్థలాన్ని విరాళంగా ఇవ్వగా 1982లో ప్రాథమికోన్నత పాఠశాలకు స్వంతభవనాన్ని నిర్మించారు. దానిలోని విద్యాప్రమాణాలను మెరుగు పరచి, ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దారు. 1986లో శాశ్వత త్రాగునీటిపథకాన్ని నిర్మించారు. రైతులు పొలాలకు వెళ్ళేందుకు వీలుగా వాగుపై చప్టా కట్టించారు. ప్రధాన అంతర్గత రహదారులను సిమెంటు రహదారులుగా చేశారు. 2001, 2006 లలో సర్పంచిగా ఎన్నికైనారు. పదవిలో ఉండగానే 2009,అక్టోబరు 17న అనారోగ్యంతో కన్నుమూశారు.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వాసిమళ్ళ ప్రభుదాసు, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.

గ్రామ ప్రముఖులు మార్చు

ప్రస్తుతం రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబు, చిన్నతనంలో ఈ గ్రామంలో విద్యనభ్యసించారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు