గంటి ప్రసాదం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గంటి ప్రసాదం కార్మికోద్యమ నాయకుడు.
గంటి ప్రసాదం | |
---|---|
జననం | గంటి ప్రసాదం 1947 ఏప్రిల్ 28 ![]() |
నివాస ప్రాంతం | బొబ్బిలి ,ఆంధ్రప్రదేశ్ , ఇండియా |
ఇతర పేర్లు | గంటి ప్రసాదం |
వృత్తి | నక్సలైట్ |
మతం | హిందూ |
జీవిత విశేషాలు
మార్చుగంటి ప్రసాదం 1947, ఏప్రిల్ 28న విజయనగరం జిల్లా, బొబ్బిలిలో జన్మించాడు. 2011 సంవత్సరంలో మావోయిస్టులు ఒడిషా రాష్ట్రం లోని మల్కాన్గిరి జిల్లా కలెక్టరును బంధించినపుడు ప్రభుత్వం విడుదల చేసిన ఖైదీలలో గంటి ప్రసాదం ఒకరు. అతనికి భార్య కామేశ్వరమ్మ, కుమారుడు సుధీర్ ఉన్నారు.
మరణం
మార్చుజూలై 4, 2013 న, నెల్లూరులో 65 సంవత్సరాల వయస్సులో ఇతను హత్యకు గురయ్యాడు.[1] దుండగులు అతి పాశవికంగా ఇతడిని కాల్చి ఆపైన కత్తితో మెడపై నరకడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
అమరవీరుల స్మారక దినం సందర్భంగా నెల్లూరు నగరంలోని టౌన్హాల్లో జూలై 4, 2013 న గురువారం అమరవీరుల సంస్మరణ సభను బంధుమిత్రుల కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సభకు గంటి ప్రసాదంతో పాటుగా ఆ కమిటీ అధ్యక్షురాలు బి.అంజనమ్మ, కమిటీ సభ్యులు నరసన్న తదితరులు హాజరయ్యారు. సభ అనంతరం ఆరవింద్ నగర్ లోని ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న దివంగత మావోయిస్ట్ నేత సోదరిని పరామర్శించారు. అనంతరం ఆయన తిరిగి వెళ్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో ఆయన్ని నెల్లూరులోని నారాయణ సూపర్ స్పెషాలటీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అక్కడ చికిత్స పొందుతూ 2013 జూలై 5 అర్థరాత్రి 1:30 నిమిషాలకు మృతి చెందాడు. తదనంతరం ఆయన పార్థివ దేహానికి ఆయన జన్మస్థలమైన బొబ్బిలిలో జూలై 6న విప్లవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం గంటి ప్రసాదం స్మారక మందిరంలో జూలై 6న సంస్మరణ సభ జరుగుతూ ఉంది.