గణేష్ వాసుదేవ్ జోషి

సాంఘిక కార్యకర్త మరియు భారత స్వాతంత్ర్య పోరాటంలో వృద్ధ మార్గదర్శిని తత్వవేత్త

గణేష్ వాసుదేవ్ జోషి (1828 ఏప్రిల్ 9 - 1880 జూలై 25) న్యాయవాది, సంఘ సంస్కర్త, రాజకీయ కార్యకర్త. అతను సార్వజనిక కాకాగా ప్రసిద్ధుడు. అతను పూనా సార్వజనిక సభ వ్యవస్థాపక సభ్యుడు. [1] [2] గౌరవనీయులైన జస్టిస్ మహాదేవ్ గోవింద్ రానడే ప్రారంభించి, విజయవంతంగా నిర్వహించిన గొప్ప పనులకు జోషి గొప్ప సహాయక వ్యవస్థగా ఉండేవాడు. మహారాష్ట్రియన్ పునరుజ్జీవనం ప్రారంభమైనప్పుడు అతను పూనాలో (ఇప్పటి పుణె) ఒక సామాజిక కార్యకర్త. తిలక్ అగార్కర్‌ల తరం భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణ ఇచ్చినప్పుడు వారికి అతను మార్గదర్శకుడు. వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే పై విచారణలో ఫడ్కేకు న్యాయవాదిగా జోషి వాదించాడు. [3]

జోషి, తన కుమార్తెను గోపాల్ కృష్ణ గోఖలేకు ఇచ్చి పెళ్ళి చేసాడు.


1877 లో ఢిల్లీ దర్బార్‌లో, "తెల్లటి ఖద్దరు దుస్తులు" ధరించి, జోషి భారతదేశ వైస్రాయ్ (అప్పుడు లిట్టన్ యొక్క 1 వ ఎర్ల్ ) ను అడగడానికి లేచి, మహారాణి -

బ్రిటిష్ ప్రజలు అనుభవిస్తున్న రాజకీయ, సామాజిక హోదాను భారతదేశానికి మంజూరు చేయాలి.

అని కోరాడు. ఈ డిమాండ్‌తో, స్వేచ్ఛా భారతదేశం కోసం ఉద్యమం లాంఛనంగా మొదలైనట్లైంది, [4] ఇది భారతదేశంలో గొప్ప పరివర్తనకు నాంది అని చెప్పవచ్చు. [5]

జోషి 1880 జూలై 25 న గుండె సమస్యతో మరణించాడు.

మూలాలు మార్చు

  1. Low, Donald Anthony (1968). Soundings in Modern South Asian History. India: University of California Press. p. 391.
  2. Government of Maharashtra. "The Gazetteers Department - SATARA". Retrieved 4 August 2014.
  3. Rao, Parimala V. (24 January 2009). "New Insights into the Debates on Rural Indebtedness in 19th Century Deccan" (PDF). Economic & Political Weekly. Retrieved 11 August 2014.
  4. The Delhi Durbar, Dimdima.com, magazine of Bharatiya Vidya Bhavan,free india
  5. KESAVAN MUKUL (Sunday, 29 May 2005) "STORY OF THE CONGRESS - Three pivotal moments that shaped early nationalism in India", The Telegraph, Calcutta, retrieved 3/19/2007 nationalism