గుడిపూడి ఇందుమతీదేవి
గుడిపూడి ఇందుమతీదేవి జననం 1890. జన్మస్థలం పాత గుంటూరు. తరవాత విజయవాడలో స్థిరపడ్డారు. పుట్టినింటిపేరు మతుకుమల్లి. వీరి తాత మతుకుమల్లి నృసింహశాస్త్రి బొమ్మిదేవర జమీన్దారుల ఆస్థాన కవి. సోదరుడు నరసింహశాస్త్రి కూడా కవి. భర్త గుడిపూడి రామారావు. ఈమె పదవయేట రచనావ్యాసంగం ప్రారంభించేరు. అనేక సన్మానాలు పొందేరు. విజయవాడలో అనేక సభలలో పాల్గొని, మంచి వక్తగా పేరు పొందారు.
రచనలు సవరించు
- అంబరీష విజయము
- నర్మద నాటకం
- తరుణీ శతకము
- మంగళాద్రి నృసింహ శకతము
- నీతి తారావళి
- లోకావలోకనము
- సోదరి
- లోకావలోకనము
- జన్మ భూమి
- రామకథామంజరి
- రాజరాజేశ్వరీ నక్షత్రమాల
- గోపవిలాపము
- సీతారాముల పాటలు
- గాంధీ పాటలు
- రామాయణ గానసుధ
అనువాదాలు సవరించు
- తిరవాయిమొళి
సత్కారాలు సవరించు
- గృహలక్ష్మి స్వర్ణకంకణము- 1959లో
- సాహిత్య ఎకాడమీ ఉత్తమ రచయిత్రి సత్కారం 1965లో.
వనరులు సవరించు
- కె. రామలక్ష్మి. (కూర్పు). ఆంధ్ర రచయిత్రుల సమాచారసూచిక. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమి, 1968.
- ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ ఆంధ్రకవయిత్రులు. 1980.
- గూడా సుమిత్రాదేవి, పి.హెచ్.డి సిద్ధాంతవ్యాసం "గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీతలు"