గుబ్బి తోటదప్ప
రావు బహదూర్ "ధర్మప్రవర్ధ" గుబ్బి తోటదప్ప (కన్నడ:ರಾವ್ ಬಹದ್ದೂರ್ ಧರ್ಮಪ್ರವರ್ತ ಗುಬ್ಬಿ ತೋಟದಪ್ಪ), (1838-1910) (స్థలం: గుబ్బి), ఒక భారతీయ వ్యాపారవేత్త, పరోపకారి.[1] అతను దేశవ్యాప్తంగా పర్యాటకులకు "తోటదప్ప చత్ర" అని పిలిచే ఉచిత వసతి గృహాన్ని స్థాపించారు.[1] అతనికి బ్రిటిష్ ప్రభుత్వం "రావ్ బహదూర్", మైసూర్ మహారాజు నాలుగవ కృష్ణరాజ ఒడయారు "ధర్మప్రవర్థ" అనే బిరుదుతో గౌరవించారు.[1]
రావు బహదూర్ ధర్మప్రవర్ధ గుబ్బి తోటదప్ప | |||
![]()
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1838 గుబ్బి, తుమకూరు, మైసూర్ రాజ్యం (ఇప్పుడే కర్ణాటక) | ||
మరణం | 1910 బెంగుళూర్ | ||
జాతీయత | భారతీయుడు | ||
జీవిత భాగస్వామి | గౌరమ్మ | ||
వృత్తి | దాత, RBDGTC ట్రస్ట్ వ్యవస్థాపకుడు | ||
వృత్తి | వ్యాపారవేత్త | ||
మతం | హిందూ మతం |
ప్రారంభ సంవత్సరాలుసవరించు
1838సంవత్సరంలో గుబ్బిలోని లింగాయతి కుటుంబంలో తోటదప్ప జన్మించారు. అతని కుటుంబం తరువాతి కాలంలో బెంగుళూరుకు తరలి వెళ్ళింది, అక్కడ మముల్పేటలో తన వ్యాపారాన్ని ప్రారంభించారు.
సామాజిక సేవసవరించు
గుబ్బి తోటదప్పకు సంతానం లేదు, తన ఆస్తిని పర్యాటకులకు, విద్యార్థుల ప్రయోజనాలకు ఉపయోగించాలని అతని ఆశయం. రావు బహదూర్ ధర్మప్రవర్ధ గుబ్బి తోటదప్ప చారిటీస్ (RBDGTC) అనే ట్రస్ట్ ను స్థాపించారు. 1897 లో, ఈ ట్రస్ట్ బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని భూమిని కొనుగోలు చేసింది. 1903 ఫిబ్రవరి 11న, నాలుగవ కృష్ణరాజ ఒడయారు అధికారికంగా ధర్మఛత్రా (పర్యాటకులకు), ఉచిత హాస్టల్ (విద్యార్థులకు) ప్రారంభించారు. .[2] తన చివరి రోజులలో అతను తన ఆస్తి మొత్తాన్ని RBDGTC ట్రస్టుకు విరాళంగా ఇచ్చాడు. కె.పుట్టన్న చెట్టిని ఆ ట్రస్ట్ యొక్క మొదటి అధ్యక్షుడిగా నియమించారు. ఈ ట్రస్ట్ దాని పనిని కొనసాగిస్తోంది. ఈ హాస్టల్ సదుపాయం కర్ణాటకలో విస్తరించి ఉంది. 2005 లో, హాస్టల్ పునర్నిర్మించబడింది. దాని శత జయంతి కోసం ట్రస్ట్ ఆదాయ వనరుగా కెంపెగౌడ బస్స్టేషన్ వద్ద బెల్ హోటల్ నిర్మించింది. బస సౌకర్యాలు నామమాత్రపు రుసుముతో వసతి సదుపాయం ఉంది. మతంతో సంబంధం లేకుండా అందరికీ ప్రవేశం ఉంది.[2] వీరశైవా (లింగాయతి) వర్గానికి చెందిన విద్యార్థులకు హాస్టల్లో ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటి వరకు ప్రభుత్వంవారు హాస్టల్ మంజూరు చేయలేదు. ప్రతి సంవత్సరం లింగాయతి విద్యార్థులకు అర్హత కోసం ట్రస్ట్ స్కాలర్షిప్పులు ఇస్తుంది.[3]
గౌరవాలుసవరించు
- 1905 లో మైసూర్ మహారాజు, నాలుగవ కృష్ణరాజ ఒడయారు తన సామాజిక సేవలకుగుర్తింపుగా "ధర్మప్రవర్థ" అనే ప్రసంశ ఇచ్చారు,
- 1910 లో, జార్జ్ V, అప్పటి భారతదేశం యొక్క చక్రవర్తి, అతనికి "రావు బహదూర్" బిరుదు ఇచ్చి సత్కరించాడు.
మరణంసవరించు
1910 ఫిబ్రవరి 21 లో, 72 సంవత్సరాల వయస్సులో తోటదప్ప మరణించారు.
ప్రభావంసవరించు
- శివకుమార స్వామీజీ 1927-1930 సంవత్సరాల్లో తోటదప్ప హాస్టల్లో విద్యార్థి.
- 1921-1924 సంవత్సరాల్లో కర్నాటక నాలుగో ముఖ్యమంత్రి ఎస్. నిజలింపప్ప, తోటదప్ప హాస్టల్లో విద్యార్థి.
- బెంగుళూరు నగర రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డుకు అతని గౌరవార్ధం "గుబ్బి తోటదప్ప రహదారి"గా పేరుపెట్టారు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 Divya Sreedharan. "For now, this old shelter". Online Edition of the Hindu, dated 2 February 2003. 2003, the Hindu. Retrieved 28 August 2014.
- ↑ 2.0 2.1 Y Maheswara Reddy. "A model for sustainable charity". the Indian express, dated 6 December 2011. 2011, the newindianexpress. Retrieved 28 August 2014.
- ↑ Staff Reporter. "Applications invited". Online Edition of the Hindu, dated 23 September 2012. 2012, The Hindu. Retrieved 28 August 2014.
బాహ్య లింక్లుసవరించు
Wikimedia Commons has media related to Gubbi Thotadappa. |