కర్ణాటక

భారతదేశంలోని రాష్ట్రం
(కర్నాటక నుండి దారిమార్పు చెందింది)

కర్ణాటక (కన్నడ: ಕರ್ನಾಟಕ) భారతదేశంలోని నైరుతి ప్రాంతంలో ఉన్న రాష్ట్రం. విస్తీర్ణ ప్రకారం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద, భారతదేశంలో ఆరవ అతిపెద్ద రాష్ట్రం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదంతో ఇది 1956 నవంబరు 1న ఏర్పడింది. నిజానికి మైసూర్ రాష్ట్రంగా తొలిగా పిలిచినా,1973లో కర్ణాటకగా పేరు మార్చారు. దీని రాజధాని, అతిపెద్ద నగరం బెంగళూరు.

కర్ణాటక
Mysore Palace Morning.jpg
7th - 9th century Hindu and Jain temples, Pattadakal monuments Karnataka 5.jpgShravanabelagola Bahubali wideframe.jpg
DGTF2318.jpg
Hoysala emblem.jpgYakshagana new.jpg
Hampi virupaksha temple.jpg
Coat of arms of కర్ణాటక
Coat of arms
కర్ణాటక పటం
కర్ణాటక పటం
నిర్దేశాంకాలు (బెంగళూరు): 12°58′N 77°30′E / 12.97°N 77.50°E / 12.97; 77.50Coordinates: 12°58′N 77°30′E / 12.97°N 77.50°E / 12.97; 77.50
దేశం India
రాజధానిబెంగళూరు
జిల్లాల పేర్లు
ప్రభుత్వం
 • నిర్వహణకర్ణాటక ప్రభుత్వం
 • కర్ణాటక గవర్నర్వాజుభాయ్ వాలా
 • ముఖ్యమంత్రిసిద్ధరామయ్య ([[ భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress) ]])
విస్తీర్ణం
 • మొత్తం1,91,791 km2 (74,051 sq mi)
విస్తీర్ణపు ర్యాంకు6వ
అత్యధిక ఎత్తు
1,925 మీ (6,316 అ.)
కనిష్ట ఎత్తు
0 మీ (0 అ.)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం61,130,704
 • ర్యాంకు8th
 • సాంద్రత320/km2 (830/sq mi)
పిలువబడువిధం (ఏక)కన్నడిగులు
GDP (2018-19)
 • Total14.08 లక్ష కోట్లు (US$180 billion)
 • Per capita1,46,416 (US$1,800)
కాలమానంUTC+05:30 (IST)
ISO 3166 కోడ్IN-KA
Official languagesకన్నడ[4]
అక్షరాస్యత75.60% (2011 census)[5]
HDIIncrease 0.6176 (medium)
HDI rank8th (2015)[6]
Symbols of కర్ణాటక
Emblemగండభేరుండ[7]
Songజయభారత జననియ తనుజాతే[8]
BirdIndian Roller[9]
Flowerకలువ[9]
Treeశ్రీగంధం[9]

కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యాన గోవా, ఉత్తరాన మహారాష్ట్ర, ఈశాన్యాన తెలంగాణ, తూర్పున ఆంధ్రప్రదేశ్, ఆగ్నేయాన తమిళనాడు, దక్షిణాన కేరళ సరిహద్దులుగా ఉన్నాయి. మిగతా 4 దక్షిణ భారత సోదరి రాష్ట్రాలతో భూ సరిహద్దులు ఉన్న ఏకైక దక్షిణాది రాష్ట్రం ఇది. రాష్ట్రం 191,791 చదరపు కిలోమీటర్లు (74,051 చ. మై.). ఇది భారతదేశం మొత్తం భౌగోళిక ప్రాంతంలో 5.83 శాతంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 61,130,704 మంది నివాసితులతో, జనాభా ప్రకారం ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం. భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటైన కన్నడ, రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడే అధికారిక భాష. అల్పసంఖ్యాకులు మాట్లాడే ఇతర భాషలలో ఉర్దూ, కొంకణి, మరాఠీ, తులు, తమిళం, తెలుగు, మలయాళం, కొడవ, బేరీ ఉన్నాయి . కర్ణాటకలో భారతదేశంలో సంస్కృతం ప్రధానంగా మాట్లాడే కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి.[10][11][12]

కర్ణాటక అనే పేరు కన్నడ పదాలైన కరు, నాడు నుండి ఉద్భవించింది. కరు అంటే "ఎత్తైన" అనే అర్ధంతో "ఎత్తైన భూమి" అని , "నలుపు" అనే అర్ధంతో "నల్లనిప్రాంతం" (బయలు సీమ ప్రాంతంలో కనిపించే ప్రత్తి పంటకు అనువైన నల్లమట్టి ) అనే అర్ధాలను సూచిస్తుంది. కృష్ణానదికి దక్షిణంగా భారతదేశం రెండు వైపులా వున్న ప్రాంతానికి బ్రిటిష్ పాలకులు కొన్నిసార్లు కర్ణాటక్ అనే పదాన్ని ఉపయోగించారు.[13]

పురాతన పాతరాతియుగం కాలంనాటి చరిత్రతో కర్నాటక ప్రాంతాన్ని అత్యంత శక్తివంతమైన పురాతన, మధ్యయుగ భారతదేశం సామ్రాజ్యాల రాజులు పరిపాలించారు. ఈ సామ్రాజ్యాలు పోషించిన తత్వవేత్తలు, సంగీతకారులు సామాజిక-మత, సాహిత్య ఉద్యమాలను ప్రారంభించారు. ఇవి నేటి వరకు కొనసాగుతున్నాయి. కర్ణాటక, హిందూస్థానీ సంప్రదాయాల భారతీయ శాస్త్రీయ సంగీతానికి కర్ణాటక గణనీయంగా దోహదపడింది.

స్థూల రాష్ట్ర ఉత్పత్తి ₹16.99 ట్రిలియన్ తో, తలసరి రాష్ట్ర ఉత్పత్తి ₹ 231,000 తో కర్ణాటక భారతదేశంలో నాల్గవ అతిపెద్ద రాష్ట్రం. మానవ అభివృద్ధి సూచికలో భారత రాష్ట్రాలలో పంతొమ్మిదవ స్థానంలో ఉంది.రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలు మైసూరు, మంగుళూరు, హుబ్లీ, ధార్వాడ్, బళ్ళారి , బెల్గాం

భౌగోళికంసవరించు

కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యాన గోవా రాష్ట్రం, ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, తూర్పున , ఆగ్నేయాన తమిళనాడు , నైరుతిన కేరళ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి.

భౌగోళికంగా రాష్ట్రం మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించబడింది.

  • సన్నని తీర ప్రాంతం, - పడమటి కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్యన ఉన్న ఈ ప్రాంతం లోతట్టు ప్రాంతము. ఇక్కడ ఓ మోస్తరు నుండి భారి వర్షాలు కురుస్తాయి.
  • పడమటి కనుమలు - ఈ పర్వత శ్రేణులు సగటున 900 మీటర్ల ఎత్తుకు చేరతాయి. వర్షపాతం ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం.
  • దక్కన్ పీఠభూమి - కర్ణాటకలోని చాలా మటుకు భూభాగము ఈ ప్రాంతంలోనే ఉంది. ప్రాంతం పొడిగా వర్షాభావంతో సెం-అరిద్ స్థాయిలో ఉంది.

కర్ణాటక పేరు ఎలా వచ్చినది అనేదానికి చాలా వాదనలున్నాయి. అయితే అన్నిటికంటే తర్కబద్ధమైన వాదన ఏమిటంటే కర్ణాటక పేరు కరు+నాడు = ఎత్తైన భూమి నుండి వచ్చిందని. గమనించవలసిన విషయమేమంటే కర్ణాటక రాష్ట్ర సగటు ఎత్తు 1500 అడుగులు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువే.

రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత 45.6 సెంటీగ్రేడు రాయచూరు వద్ద 1928 మే 23న నమోదైనది. అత్యల్ప ఉష్ణోగ్రత 2.8 డిగ్రీల సెంటీగ్రేడు బీదర్లో 1918 డిసెంబరు 16 న నమోదైనది. [1]

భాషసవరించు

కర్ణాటక, భాష ఆధారితంగా ఏర్పడిన రాష్ట్రం. అందుకే రాష్ట్రం ఉనికిలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులు అధికార భాష కన్నడను మాట్లాడతారు. తెలుగు, తమిళము, కొడవ, తులు , ఇతర భాషలు.

ఆర్ధిక రంగంసవరించు

కర్ణాటక భారతదేశంలోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటి. దీని రాజధాని బెంగళూరు దేశంలో సమాచార సాంకేతిక సేవలకు ప్రధాన కేంద్రం. భారతదేశంలోని 90% బంగారం ఉత్పాదన కర్ణాటకలోనే జరుగుతుంది. ఇటీవల మాంగనీసు ముడిఖనిజం వెలికితీత పనులు బళ్ళారి , హోస్పేట జిల్లాలలో ముమ్మరంగా సాగుతున్నాయి.

చరిత్రసవరించు

కర్ణాటక చరిత్ర పురాణ కాలంనాటిది. రామాయణములో వాలి, సుగ్రీవుడు , 'వానర సేన యొక్క రాజధాని ప్రస్తుత బళ్లారి జిల్లాలోని హంపి అని భావిస్తారు. మహాభారతములో పాండవులు తమ తల్లి కుంతితో వనవాసం చేయుచున్న కాలంలో భీమునిచే చంపబడిన కౄర రాక్షసుడు హిడింబాసురుడు ప్రస్తుత చిత్రదుర్గ జిల్లా ప్రాంతంలో నివసించుచుండేవాడని కథనం. అశోకుని కాలంనాటి శిలాశాసనాలు ఇక్కడ లభించిన పురాతన పురావస్తు ఆధారాలు.

సా.శ.పూ. 4వ శతాబ్దంలో శాతవాహనులు ఈ ప్రాంతం అధికారానికి వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించారు. ఈ వంశం క్షీణించడంతో ఉత్తరాన కాదంబులు, దక్షిణాన గాంగులు అధికారానికి వచ్చారు. అత్యంత ఎత్తైన గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహం గాంగుల కాలంనాటి కట్టడమే. బాదామి చాళుక్యులు (500 - 735) వరకు నర్మదా నదీ తీరంనుండి కావేరీ నది వరకు గల విస్తృత ప్రాంతాన్ని రెండవ పులకేశి కాలం (609 - 642) నుండి పరిపాలించారు. రెండవ పులకేశి కనౌజ్ కు చెందిన హర్షవర్ధనున్ని కూడా ఓడించాడు. బాధామీ చాళుక్యులు బాదామి, ఐహోల్ , పట్టడకళ్లో అద్భుతమైన రాతి కట్టడాలను కట్టించారు. ఐహోల్ ను దేశములో ఆలయ శిల్పకళకు మాతృభూములలో ఒకటిగా భావిస్తారు. వీరి తరువాత 753 నుండి 973 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మల్ఖేడ్ కు చెందిన రాష్ట్రకూటులు కనౌజ్ పాలకులపై కప్పం విధించారు. ఈ కాలంలో కన్నడ సాహిత్యం ఎంతగానో అభివృద్ధి చెందింది. జైన పండితులు ఎందరో వీరి ఆస్థానంలో ఉండేవారు. 973 నుండి 1183 వరకు పరిపాలించిన కళ్యాణీ చాళుక్యులు , వీరి సామంతులైన హళేబీడు హొయసలులు అనేక అద్భుతమైన దేవాలయాలను కట్టించి సాహిత్యం మొదలైన కళలను ప్రోత్సహించారు. మితాక్షర గ్రంథం రచించిన న్యాయవేత్త విజ్ఞేశ్వర కళ్యాణీలోనే నివసించాడు. వీరశైవ మతగురువైన బసవేశ్వర కళ్యాణీలోనే మంత్రిగా ఉండేవాడు. విజయనగర సామ్రాజ్యం దేశీయ సంప్రదాయాలకు పెద్దపీట వేసి కళలను, మతం, సంస్కృత, కన్నడ, తెలుగు , తమిళ భాషలలో సాహిత్యంను ప్రోత్సహించారు. ఇతర దేశాలతో వాణిజ్యం అభివృద్ధి చెందింది. గుల్బర్గా బహుమనీ సుల్తానులు , బీజాపూరు ఆదిల్‌షాహీ సుల్తానులు ఇండో-సార్సెనిక్ శైలిలో అనేక కట్టడాలు కట్టించారు , ఉర్దూ, పర్షియన్ సాహిత్యాలను ప్రోత్సహించారు. మరాఠా పీష్వా , టిప్పూ సుల్తాన్ల పతనంతో మైసూరు రాజ్యం (కర్ణాటక) బ్రిటీషు పాలనలోకి వచ్చింది.

 
మైసూరు ప్యాలెస్

భారత స్వాతంత్ర్యానంతరం, మైసూరు ఒడియార్ మహారాజు తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశాడు. 1950 లో, మైసూరు రాష్ట్రంగా అవతరించడంతో, పూర్వపు మహారాజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి రాజప్రముఖ్ లేదా గవర్నరుగా నియమితుడయ్యాడు. విలీనం తర్వాత ఒడియార్ కుటుంబానికి ప్రభుత్వం 1975 వరకు భత్యం ఇచ్చింది. ఈ కుటుంబ సభ్యులు ఇప్పటికీ మైసూరులోని తమ వంశపారంపర్యమైన ప్యాలెస్ లోనే నివసిస్తున్నారు.

1956 నవంబరు 1 న కూర్గ్ రాజ్యాన్ని, చుట్టుపక్కల ఉన్న మద్రాసు, హైదరాబాదు , బొంబాయి లలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని మైసూరు రాష్ట్రం విస్తరించి ప్రస్తుత రూపు సంతరించుకుంది. ఆ రోజును రాజ్యోత్సవ దినంగా ఆచరిస్తారు. 1973 నవంబరు 1 న రాష్ట్రం పేరు కర్ణాటక గా మార్చబడింది.

పకృతి సిద్ధ ప్రదేశాలుసవరించు

కర్ణాటక అనేక జాతీయ వనాలకు ఆలవాలం. అందులో ముఖ్యమైనవి

ఇవే కాక అనేక వన్యప్రాణి సంరక్షణాలయాలు, అభయారణ్యాలు ఉన్నాయి.

రాజకీయ నాయకులుసవరించు

జిల్లాలుసవరించు

కర్ణాటక జిల్లాలు చూడండి

కర్ణాటక జిల్లాలుసవరించు

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 BK బాగల్‌కోట్ జిల్లా బాగల్‌కోట్ 18,90,826 6,583 288
2 BL బళ్ళారి బళ్లారి 25,32,383 8,439 300
3 BG బెల్గాం బెల్గాం 47,78,439 13,415 356
4 BR బెంగళూరు బెంగళూరు 9,87,257 2,239 441
5 BN బెంగుళూరు గ్రామీణ జిల్లా బెంగళూరు 95,88,910 2,190 4,378
6 BD బీదరు జిల్లా బీదరు 17,00,018 5,448 312
7 CJ చామరాజనగర్ చామరాజనగర్ 10,20,962 5,102 200
8 CK చిక్కబళ్ళాపూర్ జిల్లా చిక్‌బళ్లాపూర్ 12,54,377 4,208 298
9 CK చిక్‌మగళూరు చిక్‌మగళూరు 11,37,753 7,201 158
10 CT చిత్రదుర్గ చిత్రదుర్గ 16,60,378 8,437 197
11 DK దక్షిణ కన్నడ మంగళూరు 20,83,625 4,559 457
12 DA దావణగేరె దావణగేరె 19,46,905 5,926 329
13 DH ధార్వాడ్ ధార్వాడ్ 18,46,993 4,265 434
14 GA గదగ్ గదగ్ 10,65,235 4,651 229
15 GU గుల్బర్గా జిల్లా గుల్బర్గా 25,64,892 10,990 233
16 HS హసన్ హసన్ 17,76,221 6,814 261
17 HV హవేరి హవేరి 15,98,506 4,825 331
18 KD కొడగు మడికేరి 5,54,762 4,102 135
19 KL కోలారు జిల్లా కోలారు 15,40,231 4,012 384
20 KP కొప్పల్ కొప్పల్ 13,91,292 5,565 250
21 MA మండ్య మండ్య 18,08,680 4,961 365
22 MY మైసూరు జిల్లా మైసూరు 29,94,744 6,854 437
23 RA రాయచూరు రాయచూరు 19,24,773 6,839 228
24 RM రామనగర జిల్లా రామనగరం 10,82,739 3,573 303
25 SH షిమోగా షిమోగా 17,55,512 8,495 207
26 TU తుమకూరు తుమకూరు 26,81,449 10,598 253
27 UD ఉడుపి ఉడుపి 11,77,908 3,879 304
28 UK ఉత్తర కన్నడ కార్వార్ 13,53,299 10,291 132
29 BJ బిజాపూర్ బిజాపూర్ 21,75,102 10,517 207
30 YG యాద్గిరి జిల్లా యాద్గిర్ 11,72,985 5,225 224

విమానాశ్రయములుసవరించు

బెంగళూరు, మంగుళూరు, మైసూరు, బెల్గాం, హుబ్లీ

ఆనకట్టలుసవరించు

పుణ్యక్షేత్రాలుసవరించు

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Protected Areas of India: State-wise break up of Wildlife Sanctuaries" (PDF). Wildlife Institute of India. Government of India. Archived from the original (PDF) on 24 అక్టోబరు 2016. Retrieved 31 మే 2018.
  2. "Figures at a glance" (PDF). 2011 Provisional census data. Ministry of Home Affairs, Government of India. Archived (PDF) from the original on 24 అక్టోబరు 2011. Retrieved 17 సెప్టెంబరు 2011.
  3. "Karnataka Budget 2018-19" (PDF). Karnataka Finance Dept. Archived from the original (PDF) on 16 మార్చి 2018. Retrieved 31 మే 2018.
  4. 50th Report of the Commission for Linguistic Minorities in India (PDF). nclm.nic.in. p. 123. Archived from the original (PDF) on 8 July 2016.
  5. "Population and Literacy Rate of cities in Karnataka". Archived from the original on 7 జనవరి 2019. Retrieved 31 మే 2018.
  6. "Inequality- Adjusted Human Development Index for India's States". Archived from the original on 10 మే 2017.
  7. Shankar, Shiva (7 February 2018). "State flag may be a tricolour with Karnataka emblem on white". The Times of India. The Times Group.
  8. "Poem declared 'State song'". The Hindu. The Hindu Group. 11 January 2004.
  9. 9.0 9.1 9.2 9.3 Huq, Iteshamul, ed. (2015). "Introduction". A Handbook of Karnataka (PDF) (in ఇంగ్లీష్) (Fifth ed.). Karnataka Gazetteer Department. p. 48. Archived from the original (PDF) on 2018-05-23. Retrieved 2018-05-31.
  10. "Seven Indian villages where people speak in Sanskrit". 24 September 2017. Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.
  11. "Know about these 4 Indian villages where SANSKRIT is still their first language". Archived from the original on 6 January 2019. Retrieved 7 April 2019.
  12. "Five Indian villages where sanskrit is spoken". Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.
  13. See Lord Macaulay's life of Clive and James Talboys Wheeler: Early History of British India, London (1878) p.98.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కర్ణాటక&oldid=3914600" నుండి వెలికితీశారు