గురు హర్ క్రిషన్

గురు హర్ క్రిషన్ (మూస:IPA-pa; 1656 జూలై 23 – 1664 మార్చి 30) పదిమంది సిక్ఖు గురువుల్లో ఎనిమిదో వారు. 5 సంవత్సరాల వయసులో 1661 అక్టోబరు 7న ఆయన తండ్రి గురు హర్ రాయ్ తర్వాత గురువు అయ్యారు. సిక్ఖు మత చరిత్రలోకెల్లా అతి చిన్న వయసులో గురువు అయింది హర్ క్రిషన్.[1] ఆయనను బాల గురువు అని కూడా అంటూ ఉంటారు.[1] ఆయన ఎనిమిది సంవత్సరాల వయసులో ఢిల్లీలో అంటువ్యాధి కారణంగా మరణించారు. ఆయన తండ్రి మావ గారైన గురు తేజ్ బహదూర్ సిక్ఖులకు తర్వాతి గురువు అయ్యారు.[1] కేవలం 2 సంవత్సరాల, 5 నెలల, 24 రోజుల పాటు మాత్రమే గురువుగా పనిచేశారు.

గురు హర్ క్రిషన్
ਗੁਰੂ ਹਰਿਕ੍ਰਿਸ਼ਨ ਜੀ
గురు హర్ క్రిషన్ చిత్రం ca. 1745
గురు హర్ క్రిషన్ చిత్రం ca. 1745
జననంJuly 23, 1656 (1656-07-23)
మరణంMarch 30, 1664 (1664-03-31) (aged 7)
ఇతర పేర్లుఎనిమిదవ గురువు The Child Guru
క్రియాశీల సంవత్సరాలు1656–1664
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఢిల్లీలో రోగులకు సేవ చేయడం
అంతకు ముందు వారుగురు హర్ రాయ్
తరువాతివారుగురు తేజ్ బహదూర్
తల్లిదండ్రులుగురు హర్ రాయ్, మాతా క్రిషేన్

హర్ క్రిషన్ కిరాత్ పూర్ సాహిబ్, రూప్‌నగర్, పంజాబ్లో గురు హర్ రాయ్, కిషన్ దే (మాతా సులేఖ) దంపతులకు జన్మించారు.[2] అక్టోబరు 1661లో మరణించేందుకు ముందు గురు హర్ రాయ్ తన చిన్న కుమారుడు హర్ క్రిషన్ ను తర్వాతి గురువుగా ప్రతిపాదించారు. గురు హర్ రాయ్ తన పెద్ద కుమారుడు రామ్ రాయ్ ముఘల్ సామ్రాజ్యంతో రాజీపడుతున్నట్టు అనిపించడంతో చిన్న కుమారుడు హర్ క్రిషన్ ను ఎంచుకున్నారు.

చిత్ర మాలిక మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 HS Singha (2009), The Encyclopedia of Sikhism, Hemkunt Press, ISBN 978-8170103011, pages 96-97
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-26. Retrieved 2020-01-07.

బయటి లింకులు మార్చు