చందర్లపాడు మండలం

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని మండలం

చందర్లపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం. దీని ప్రధాన కేంద్రం చందర్లపాడు OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°41′38″N 80°12′04″E / 16.694°N 80.201°E / 16.694; 80.201
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండల కేంద్రంచందర్లపాడు
Area
 • మొత్తం238 km2 (92 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం59,943
 • Density250/km2 (650/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి980


మండలం జనాభా మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధి లోని జనాభా మొత్తం 56,885 మంది ఉండగా, వారిలో పురుషులు 28,979 మంది, స్త్రీలు 27,906 మంది ఉన్నారు. మొత్తం 58.63%.పురుషులు అక్షరాస్యత 66.55% ఉండగా, స్త్రీలు అక్షరాస్యత 50.46% ఉంది.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. బొబ్బెల్లపాడు
  2. బ్రహ్మబొట్లపాలెం
  3. చందర్లపాడు
  4. చింతలపాడు
  5. ఏటూరు
  6. గుడిమెట్ల
  7. కాసరబాద
  8. కొడవటికల్లు
  9. కొనయపాలెం
  10. మనుగాలపల్లి
  11. ముప్పాళ
  12. పాటెంపాడు
  13. పొక్కునూరు
  14. పోపూరు
  15. పున్నవల్లి
  16. తోటరవులపాడు
  17. తుర్లపాడు
  18. ఉస్తేపల్లి
  19. వెలది కొత్తపాలెం
  20. విభరీతపాడు

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

  1. గుత్తావారిపాలెం
  2. పాత బెల్లంకొండవారిపాలెం
  3. లక్ష్మీపురం

జనాభా మార్చు

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక:
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. బొబ్బెల్లపాడు 315 1,261 623 638
2. బ్రహ్మబొట్లపాలెం 96 432 230 202
3. చందర్లపాడు 2,375 10,059 5,092 4,967
4. చింతలపాడు 1,024 4,499 2,323 2,176
5. ఏటూరు 679 2,810 1,427 1,383
6. గుడిమెట్ల 841 3,854 1,982 1,872
7. కాసరబాద 271 1,135 559 576
8. కొడవటికల్లు 833 3,641 1,877 1,764
9. కోనయిపాలెం 1,396 6,082 3,085 2,997
10. మునగాలపల్లి 282 1,272 621 651
11. ముప్పాళ 1,428 5,742 2,886 2,856
12. పాటెంపాడు 99 399 209 190
13. పొక్కునూరు 442 1,949 989 960
14. పోపూరు 164 619 313 306
15. పున్నవల్లి 182 789 395 394
16. తోటరావులపాడు 728 3,252 1,647 1,605
17. తుర్లపాడు 991 4,413 2,281 2,132
18. ఉస్తేపల్లి 151 631 319 312
19. వెలది కొత్తపాలెం 624 2,688 1,390 1,298
20. విభరీతపాడు 343 1,358 731 627

విశేషాలు మార్చు

  • చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామం మరియూ కంచికచర్ల మండలంలోని మొగులూరు గ్రామాల మధ్య, మునేరునదిపై, రు. 20 కోట్లతో, ఒక కాజ్ వే నిర్మించదానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ కాజ్ వే నిర్మాణంతో చందర్లపాడు. కంచికచర్ల మండలాల మధ్య వారధి ఏర్పడటంతోపాటు, రహదారి మార్గం దగ్గరవుతుంది. 810 మీటర్ల పొడవైన ఈ హైలెవెల్ కాజ్ వే మధ్యలో నీరు పారేటందుకు వీలుగా 120 ఖానాలు ఏర్పాటుచేసెదరు. ఏటూరు, మోగులూరులవైపు దీనికి అనుబంధంగా రహదారులు నిర్మించవలసి యున్నది. ఏటూరు వద్ద, మునేరు నది, ఒక కి.మీ. దూరంలో ఉన్న కృష్ణానదిలో కలుస్తుంది. నదికి తక్కువ దూరంలోనే కాజ్ వే ప్రతిపాదిత ప్రాంతం ఉండటంతో, ఈ మేరకు సాగునీరు, త్రాగునీరు సమస్య పరిష్కారం కాగలదు. ఈ రెండు మండలాలలో 50,000 జనాభాకు దీనివలన ప్రయోజనం కలుగుతుంది. చందర్లపాడు మండలంలోని ఏటూరు, చింతలపాదు, తోటరావులపాడు, విపరితలపాడు, పోపూరు, వెలది కొత్తపాలెం, చందర్లపాడు గ్రామాలకు మరియూ కంచికచర్ల మండలంలోని మోగులూరు, ఎస్-అమరవరం, వేములపల్లి, మున్నలూరు, కునికినపాడు, చెవిటికల్లు గ్రామాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది. ఈ గ్రామాల రైతులకు మునేరుకు ఇరువైపులా పొలాలున్నవి. దీనితో మునేరులో నుండి పొలాలకు వెళ్ళాలన్నా, ఎరువులు, ఇతరత్రా సామాగ్రి తీసికొని వెళ్ళాలన్నా, పండిన పంటను ఇంటికి చేర్చుకోవాలన్నా, ఇన్నేళ్ళుగా తీవ్ర ఇబ్బందులు పడుచున్నారు. వర్షాకాలంలో నెలలపాటు నది అవతలి గట్టుకు చేరటం సాధ్యంకాని పని. వారధి నిర్మించడం ద్వారా ప్రత్తి, వరి, సుబాబుల్, మిరప, పొగాకు పంటలను రైతులు నేరుగా ఇళ్ళకు చేర్చుకోవడానికి, విజయవాడ, కంచికచర్ల ప్రాంతాలలోని మార్కెట్లకు తరలించి విక్రయించుకొనడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కాజ్ వే నిర్మాణంతో ఈ రెండు మండలాల మధ్య 28 కి.మీ. దూరం తగ్గుతుంది. ఈ రెండు మండలాలలో మునేరు ఆధారంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలౌ సాగునీటి సమస్య ఉండదు. కాగ్ వే ప్రతిపాదిత స్థలంలో నీరి ఆగి ప్రవహించడంతో, భూగర్భ జలాలు పెరుగుతవి. దీనితో ఎత్తిపోతలకు భూగర్భ జలాల సమస్య తగ్గి, ఆయకట్టు భూములకు సాగునీటితోపాటు, త్రాగునీటి పథకాలకు ఇబ్బందులు ఉండవు.
  • చందర్లపాడు మండలంలోని ద్వారకానగర్ లో, పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలో, విజయనగరరాజుల కాలంనాటి ఒక పురాతన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ శిథిలాలు బయల్పడినవి. కృస్ణానది ఒడ్డున ఒక కొండమీద బయల్పడిన ఈ ఆలయానికి అవతల ఒడ్డున నవ్యాంధ్ర రాజధాని తుళ్ళూరు గ్రామం ఉంది.
  • చందర్లపాడు మండలంలోని మిగిలిన 650 మంది లబ్దిదారులకూ గ్యాస్ కనెక్షన్లు అందజేసి, మండలాన్ని పొగరహిత మండలంగా తీర్చిదిద్దినామని, 2017,జూన్-1న ప్రకటించినారు.

సమీప మండలాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు మార్చు