చర్చ:ఖడ్గతిక్కన

తాజా వ్యాఖ్య: కాటమరాజు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



ఖడ్గతిక్కన వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • కాటంరాజు కథ విపులంగా ఒక విభాగంలో రాయాలి.
  • ఖడ్గ తిక్కన వంశవృక్షాన్ని గీయాలి.
  • దశకుమార చరితం నుండి ఖడ్గతిక్కనను గురించిన పద్యాలు ఒకటి లేదా రెండు ఉదహరించాలి
  • గుర్రంపైన వ్యక్తి శిల్పం యొక్క ఫోటో, సోమశిల వద్దనున సోమేశ్వరుని దేవాలయమంటపం ఎదురుగా ఉన్న వీరుని విగ్రహం ఫోటో సంపాదించగలిగితే బాగుంటుంది
  • ఖడ్గ తిక్కన రేఖాచిత్రం
  • ఈ వ్యాసంలో పేర్కొన్న గ్రామాలను నిర్ధారించుకోవాలి

కొన్ని సందేహాలు:

  1. రాజు: రెండవ మనుమసిద్ధి కదా?
  2. ఖడ్గతిక్కనను చిన్నబుచ్చి రెచ్చగొట్టేది తల్లి, భార్యే.., తండ్రి కాదేమో!
  3. అసలు ఈ అవమానం కథ నిజమా? కథేనా? ఒకవేళ కథే అయితే ఆ సంగతిని రాయాలి. __చదువరి (చర్చరచనలు) 12:16, 6 జూన్ 2007 (UTC)Reply
మూడవ మనుమసిద్ది అన్నది నిర్ధారితము. నేనూ తల్లి, భార్య అని విన్నాను. కానీ ఆ అవమానం కథ జరిగిందో లేదో అనుమానాస్పదమే!! ఈ ఘట్టం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఏది నిజమో? ఈయనకు బంధువైన కవి తిక్కన దీని గురించి ఏమైనా ప్రస్తావించాడో లేదో చూడాలి --వైఙాసత్య 12:29, 6 జూన్ 2007 (UTC)Reply
ఈ పుస్తకం 131,132 పేజీల్లో రెండో మనుమసిద్ధి అని అన్నారు! __చదువరి (చర్చరచనలు) 12:39, 6 జూన్ 2007 (UTC)Reply
అయితే ఇలా విరుద్ధ అభిప్రాయాలు ఎందుకున్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తా --వైఙాసత్య 13:27, 6 జూన్ 2007 (UTC)Reply

కాటమరాజు మార్చు

కాటమరాజు పైన చదువరి లింకు ఇచ్చిన పుస్తకంలోనూ,నేను చూస్తున్న పుస్తకములోనూ ఎర్రగడ్డపాడు పాలకుడనే ఉంది మరి(యలమంచిలి సంస్థానాధీశుడు??) --వైఙాసత్య 13:34, 6 జూన్ 2007 (UTC)Reply

ఔను, అది ఎర్రగడ్డపాడు అని ఇచ్చారు. అయితే అది ఎర్రగుడిపాడు కాదు గదా!? శ్రీకాళహస్తి మండలంలో ఒక ఎర్రగుడిపాడు ఉందని వికీపీడియా చెబుతోంది.:) __చదువరి (చర్చరచనలు) 13:38, 6 జూన్ 2007 (UTC)Reply
కాదనుకుంటా. ఇది కనిగిరి ప్రాంతంలోనిదని en:Telugu Cholas లో రాసి ఉంది --వైఙాసత్య 13:52, 6 జూన్ 2007 (UTC)Reply

మనోహర్ చెనికల:

యలమంచిలి కాటమరాజు పూర్వీకులు పాలింఛిన ప్రాంతం. కాటమరాజు తండ్రి అయిన పెద్దిరాజు తో పాటు ఆయన చిన్నాన్న ,పెదనాన్న లయిన సింహాద్రిరాజు, ఎరనూకరాజు, నలనూకరాజు పోలురాజాదులు మరణించిన తర్వాత వారి బావ అయిన పల్లికొండయ్య వారిని తీసుకొచ్చి పంపాద్రిలో నిలుపాడని గాధాకారుల కధనం.

ఆ తర్వాత దొనకొండని రాజధానిగా ఛేసుకుని అయితమరాజు పాలించాడని తాళపత్రాల వల్ల తెలుస్తోంది.

Return to "ఖడ్గతిక్కన" page.