చిర్ల జగ్గిరెడ్డి

చిర్ల జగ్గిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

చిర్ల జగ్గిరెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - ప్రస్తుతం
ముందు పాముల రాజేశ్వరి దేవి
నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 26 నవంబర్ 1970
గోపాలపురం గ్రామం, కొత్తపేట, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సోమసుందర రెడ్డి, రాధాదేవి
జీవిత భాగస్వామి లావణ్య
సంతానం సోమసుందరరెడ్డి, శ్రీనిధి రెడ్డి

జననం, విద్యాభాస్యం మార్చు

చిర్ల జగ్గిరెడ్డి 26 నవంబర్ 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట, గోపాలపురం గ్రామంలో జన్మించాడు. ఆయన బెంగుళూరులోని న్యూ పోర్ట్ యూనివర్సిటీ ఎంబీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

చిర్ల జగ్గిరెడ్డి తండ్రి చిర్ల సోమసుందర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తండ్రి 1983లో టీడీపీ, 1989లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. చిర్ల జగ్గిరెడ్డి 2001లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2004లో కాంగ్రెన్‌ పార్టీ తరపున కొత్తపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో ఎన్నికల్లో ఓడిపోయాడు.

చిర్ల జగ్గిరెడ్డి వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బండారు సత్యానంద రావుపై 4,038 ఓట్లతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.