చెళ్ళపిళ్ళ సీతారామమూర్తి

తెలుగు రచయిత

చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి (జననం 1908 నవంబరు 13) ఒక భారతీయ రచయిత.

చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి తూర్పు గోదావరి జిల్లా లోని పెద్దాపురంలో 1908 లో జన్మించాడు.[1] అతను ప్రారంభ విద్యను ఎ.ఇ.ఎల్.ఎం. ఉన్నత పాఠశాలలోనూ, ఇంటర్మీడియట్ విద్యను 1924-26 సమయంలో పిఠాపురం రాజావారి కళాశాలలో పూర్తి చేసాడు. అతను 1928 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బిఎ పట్టభద్రుడయ్యాడు. నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు .

అతను 1963 లో కడప లోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుండి ఆంగ్లంలో అధ్యాపకునిగా పదవీ విరమణ చెందాడు. పదవీ విరమణ తరువాత, కాకినాడలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకునిగా తిరిగి నియమించబడ్డాడు. అతను 1964 లో ఒంగోలు లోని సిఎస్ఆర్ శర్మ కాలేజీలో అధ్యాపకునిగానూ, ఇంగ్లీష్ విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1970 లో కాకినాడలోని ఆదర్శ కళాశాల ఫౌండేషన్ ప్రిన్సిపాల్ గా నియమితుడయ్యాడు, అక్కడ అతను రెండు సంవత్సరాలు పనిచేశాడు.

అతను ప్రఖ్యాత వేద పండితుడు శ్రీభాష్యం అప్పలచార్యలును తన ఆధ్యాత్మిక గురువుగా భావించాడు. "శ్రీబాష్యం నా మనస్సును మత సాహిత్యం వైపు మళ్లించాడు , అతను నాకు 12 సంవత్సరాలు చిన్నవాడు అయినప్పటికీ నేను అతనిని నా గురువుగా , 'పథ నిర్దేశకుని' గా భావిస్తాను" అని ఆయన అన్నాడు. 'తిరుప్పావై' పై తెలుగులో శ్రీబాష్యం చేసిన ఉపన్యాసాల నోట్స్ తీసుకున్నాడు. తరువాత అతను 'తిరుప్పావై' ను ఆంగ్లంలోకి అనువదించాడు. దీనిని ఆంగ్ల అనువాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రచురించాయి. శ్రీబాష్యం ' వాల్మీకి రామాయణం ' గురించి రాసిన తెలుగు ఉపన్యాసాలను ఆంగ్లంలో అందించాడు.

శ్రీ చెళ్ళపిళ్ళ సీతా రామమూర్తి, శ్రీమతి సూర్యకాంతం బంగారు పతకాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎంఏ పరీక్షల్లో 'షేక్‌స్పియర్' పేపర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి అందజేస్తారు.

సాహిత్య రచనలు మార్చు

ప్రస్తావనలు మార్చు

  1. "Fulfilment is his reward". The Hindu. 16 December 2002. Retrieved 5 June 2018.