చౌర పరమేశ్వరన్

కేరళ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, హేతువాది, సంస్కర్త, అనువాద

చౌర పరమేశ్వరన్, కేరళ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, హేతువాది, సంస్కర్త, అనువాదకుడు. ఇతడిని చౌరా గాంధీ అని కూడా పిలుస్తారు.[1] 1921లో పాలక్కాడ్‌లో జరిగిన అఖిల-కేరళ రాజకీయ సమావేశంలో పాల్గొన్నాడు.[2] 1924లో వైకం సత్యాగ్రహం, 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. స్వాతంత్ర్యం తరువాత జర్నలిస్ట్‌గా పనిచేసి, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడాడు.

చౌర పరమేశ్వరన్
జననం(1884-06-15)1884 జూన్ 15
మరణండిసెంబరు 1968(1968-12-00) (వయసు 84)
అలువా, కేరళ
జాతీయతభారతీయుడు
విద్యగ్రాడ్యూయేట్
విద్యాసంస్థమద్రాసు విశ్వవిద్యాలయం
వృత్తిపాత్రికేయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది, సంస్కర్త, అనువాదకుడు

జననం మార్చు

పరమేశ్వరన్ 1884, జూన్ 15న కేరళ రాష్ట్రంలోకి ఎర్నాకుళం జిల్లాలో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాడ్యూయేట్ పూర్తిచేశాడు.

చౌర పరమేశ్వరన్ అవార్డు మార్చు

కేరళ ప్రెస్ అకాడమీ పరమేశ్వరన్ గౌరవార్థంగా 1992లో చౌరా పరమేశ్వరన్ అవార్డును స్థాపించింది. కొచ్చిలోని చోవర పరమేశ్వరన్ మెమోరియల్ కమిటీ ఈ అవార్డును ఏర్పాటు చేసింది.[3][4]

మరణం మార్చు

పరమేశ్వరన్ తన 84 ఏళ్ళ వయసులో 1968, డిసెంబరు 20న కేరళలోని అలువాలో మరణించాడు.[5]

మూలాలు మార్చు

  1. "School students to add new shade to I-Day fete". The New Indian Express.
  2. Shaji, K. a (4 April 2017). "Congress rewinds to 1921 Ottappalam meet". The Hindu.
  3. "Governor cautions media against unethical practices". The Hindu. 14 December 2019.
  4. "Endowments & Awards | Kerala Media Academy". archive.keralamediaacademy.org. Archived from the original on 2020-02-21. Retrieved 2021-09-29.
  5. "ചൊവ്വര പരമേശ്വരന്റെ ചരമവാര്‍ഷികദിനം". 20 December 2018.