జంగం (కులం)

(జంగాలు నుండి దారిమార్పు చెందింది)

జంగం కులం ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా 'ఏ' గ్రూపులోని 9వ కులం. జంగాలు శైవ భిక్షగాళ్ళు. జంగాలలో మిండ జంగాలు, బుడిగె జంగాలు, గంట జంగాలు అనే ఉపకులాలున్నాయి. చేతిలో గంటనాధం చేస్తూ హర హర మహాదేవ శంభోశంకర అంటూ శంఖం ఊదుతూ ఇంటి ముందుకు వచ్చే జంగమయ్యలను చూసి సాక్షాత్తు భోళా శంకరుడే వచ్చినట్లుగా ఒకప్పుడు భక్త పారవశ్యంతో పరవశించేవారు. రామాయణ కాలంలో అరణ్యవాసంలో ఉన్న సీతాదేవిని ఎత్తుకపోవడానికి రావణుడు జంగందేవర వేషంలో వచ్చాడు కాబట్టే అతన్ని సీతాదేవి సాక్ష్యాత్తు శివుడే తన పర్ణశాల ముందుకు వచ్చాడని భావించి లక్ష్మణరేఖను సైతం దాటి వచ్చింది. పూర్వకాలంలో జంగందేవర ఇంటి వద్దకు రాకపోతే మంచి చెడు కార్యక్రమాలను ఏవైనా సరే ఎక్కడివక్కడి ఆగిపోవాల్సిందే. సమాజంలో ఆదరణ కరువు కావడంతో తమ కులవృత్తి పట్ల వారికే ఆసక్తి సన్నగిల్లింది. చనిపోయిన వారికి కర్మలు చేయడం వీరి ప్రధాన వృత్తి. బ్రాహ్మణులకు తప్ప మిగిలిన అన్ని కులాలకు వీరు కర్మకాండలు చేస్తారు. కర్మ చేసే రోజు వీరు గంట మోగిస్తూ శంఖం ఊదుతూ వెళ్ళి బావి వద్ద గాని, చెరువు వద్దగానీ పిండాలు పెడతారు.

భిక్ష కోసం వచ్చిన జంగమదేవర.


The Jangam , Shaiva order religious monks of India

చరిత్ర వివరాలు మార్చు

వివిధ కవులు జంగాల గురించి వారి రచనలలో ప్రస్తావించారు.

దాయాదుల్వలె గుబ్బచన్ను లొలయన్ ధావళ్య నేత్రాంబుజ
చ్ఛాయ ల్తాండవ మాడ గేరి పురుషస్వాంతమ్ముల న్మన్మథుం
డేయం జంగమువారి చంద్రముఖి విశ్వేశార్చనా వేళలన్
వాయంచెం గిరిగిండ్లు బాహు కుశల వ్యాపార పారీణతన్ -- శ్రీనాధుడు.(37)

  • "విసపు నాగులను సంక నెత్తుకొని జంగమదేవర (శివుడు) కాలనృత్యం చేస్తాడు."
  • "జంగము దేవర శివుడేను సుమ్మీ జంగము దేవర దేవదేవూడు జంగము దేవర నా దేవరన్నా" అని తెలిపిన గౌరిని జంగమదేవర అయిన శివునికిచ్చి పెళ్ళి జరిపిస్తారు.

అబ్బబ్బ కిందటే డప్పయ్య తీర్తాన
జోలె జంగమ కిస్తి సోలెడప్పు
సాతాని జియ్యరు సతికితే పోయిస్తి
కొల్లగా గుల్లెడు సల్ల బొట్టు
లంక సత్తెల వాడు పొంకాన పొగిడితే
మాలదాసరి కిస్తి మానెదూడ
లేదాలు వాగితే యెల్లుబొట్టయ్యకు
కొలకుండ దోసెడు కొర్రలిస్తి

మిండ జంగాలు మార్చు

వేశ్యా లోలురై వారి ఇండ్లలోనే విహరించిన కారణంగా వీరిని మిండ జంగములని వ్యవహరించే వారు. బసవేశ్వరుడు “కావళ్ళలో ముప్పూట ఓగిరములు పంపుతుండగా” పన్నెండు వేలమంది మిండ జంగములు వేశ్యల ఇండ్లలో ఉండి భోగించేవారని బసవ పురాణంలో ఉంది.

గంట జంగాలు మార్చు

గంట జంగాలు శైవ, వీర శైవ మతానికి చెందిన వీర ముష్టులూ, జంగాలూ, వారి వారి కళా రూపాలే కాకుండా ఒంటరిగా జంగం దేవర వేషంలో ఇంటింటికీ తిరిగి యాచిస్తారు. సాంబసదాశివ సాంబ సడాశివ, శంభో శంకరా అంటూ శంఖాన్ని పూరిస్తూ, నందిమకుంటంగా గల గంటను వాయిస్తూ, బసవ పురాణం లోని బసవేశ్వరుని సూక్తులను సోదాహరణంగా ఉదహరిస్తారు.

బసవేశ్వరుడుగా వేషధారణను తీర్చి దిద్దు కుంటారు. వారిలో ఎంతో పూజ్యభావం గోచరిస్తుంది. పైనుంచి క్రిందికి అంగరఖాను తొడుగుతారు. తెల్లని తలగుడ్డనూ చుడతారు. మెడకు పొడవాటి అంగ వస్త్రాన్ని ధరింస్తారు. ముఖానికి గంభీరంగా విభూతి రేఖలను దిద్దుతారు. గంట వాయిస్తూ, శంఖం పూరిస్తూ వచ్చే గంట జంగాన్ని సాక్షాత్తు బసవేశ్వరుడని ఊహించి ఇంట్లో వారంతా భిక్షను వేస్తారు. భిక్షను స్వీకరిస్తూ మంత్రాన్ని ఉచ్చరిస్తూ విభూతి నిస్తారు. శంభో శంకర అంటూ, గంట చుట్టూ ఒక పుల్లను త్రిప్పుతూ ఓంకార నాదాన్నీ పలికిస్తారు. పిన్నలూ, పెద్దలూ అందరూ పూజ్య భావంతో విభూతిని స్వీకరిస్తారు. ఈ రకంగా గంట జంగాలు వీర శైవ మతాన్ని ప్రబోధించే ప్రచారకులుగా జీవిస్తూ ఊరూరా తిరుగుతూ వుంటారు. [1]


ముకెబర్ల జంగాలు మార్చు

హైరోసైరో-- బిట్రో నిట్రో
జగితగ -- బిట్రొ నిట్రో

అనే మకుటంగా గల బిట్రో నిట్రో పదం కంచు జాగంట పై హృదయాహ్లాదంగా వినిపింప బడుతుంది. ఈ పదాలను పాడే వారు ముకెబర్ల జంగాలు. ఈ ముకెబర్ల జంగా లనే తెగ వారు, కాకతీయ రాజ్య పరిపాలన కాలంలో వారి ఆస్థానంలో వంది మాగదులుగా వున్న శైవులు, ఈ జంగాలు తెలంగాణా లోనూ అటు శ్రీకాకుళం జిల్లా లోనూ చెదురుందురుగా వున్నారు. ముకెబర్ల జంగాలు బిట్రేశ్వరుడు నిట్టేశ్వరీ దేవి అనే దేవుళ్ళను ఈ నాటికీ పూజిస్తారు.

బిట్రేశ్వరుడంటే ఈశ్వరుడని, నిట్రేశ్వరి అంటె పార్వతి అని చెపుతారు. ముకెబర్ల జంగాలు, కాని శివ పార్వతులకు శైవ పురాణాల్లోగానీ, ఇతర ఇతిహాస గ్రంథాల్లోగానీ ఎక్కడా బిట్రేశ్వర, విట్టేశ్వరి పేర్లు వున్న ఉదాహరణ వాజ్మయములు లేవు. వారు శైవులవడం వల్లా వారి ఇలవేల్పు శివ పార్వతులను స్తుతిస్తూ ఎంతో పసందైన పాటలను పాడుతారు. వారు పాట ప్రారంభించ బోయే ముందు నాందీ ప్రస్తావనగా ఇష్ట దేవతల్ని ప్రార్థన చేస్తారు. [2]

జీవన విధానం మార్చు

గతంలో జంగాలకు కొన్ని గ్రామాలు మిరాశాలు ఉండేవి. కాని ప్రస్తుతం అవన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. భోళాశంకరుడి నిరాడంబరం, బవవేశ్వరుడి మత సామరస్యం పుణికిపుచ్చుకున్న జంగమ కులస్తుల జీవనశైలి విభిన్నంగా ఉంటుంది. భిక్షాటన వీరి సంప్రదాయం. వీరిలో కొందరు శివాలయాల్లో పౌరోహిత్యం చేస్తుండగా, మరికొందరు మఠాల్లో సేవ చేస్తుంటారు. ఎవరేది చేపట్టినా ధర్మప్రచారమే వీరి ప్రధాన ఆశయం. స్త్రీ, పురుషులనే తేడాలేకుండా అందరూ మెడలో లింగాన్ని ధరించి నుదుట వీభూదితో దర్శనమిస్తుంటారు. శాకాహారులైన వీరు మన రాష్ట్రంలో మెదక్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, కర్నూలు‌, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. నిఙామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్,జిల్లాలో కుడా నివసిస్తున్నారు. బలిజ లకు వీర శైవ లింగాయత్‌లకు గురువులు. వారి నుంచి బియ్యం, పప్పు, కూరగాయలు భిక్షగా తీసుకుంటారు. శివాలయాల్లో పౌరోహిత్యం చేసేవీరికి డొక్క నిండడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో శివాలయాలు ఉన్నా, ధూప దీప నైవేద్యాలకు నోచుకున్నవి అతితక్కువ. గ్రామీణప్రాంతాల్లో ఉండే దేవాలయాల్లో అర్చన చేస్తే గ్రామపెద్దలు నెలకు రెండు నుంచి మూడు వందల రూపాయలకు మించి ఇవ్వని పరిస్థితి. శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వేదపాఠశాలలో కూడా వీరు తమ పిల్లలను చదివిస్తున్నారు.ఇప్పటికి మేము ఉరికి దూరంగా ఉంటూ అంటరానివారిగా జీవిస్తున్నాము ఇట్లు తాటికొండ కుళ్లాయప్ప అనంతపురం జిల్లా కల్లూరు గ్రామం గార్లదిన్నె మండలం

ఇవీ చూడండి మార్చు

బుడిగె జంగాలు

వనరులు మార్చు