టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్

టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉన్న మైసూరు సామ్రాజ్యం లో కట్టిన పురాతన కట్టడం. ఈ ప్యాలెస్ కి టిప్పు సుల్తాన్ వేసవి విడిదికి వచ్చేవాడు.[1]

టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్
ప్రవేశ ద్వారం
సాధారణ సమాచారం
నిర్మాణ శైలిఇండో - ఇస్లామిక్
పట్టణం లేదా నగరంబెంగళూరు
దేశంభారతదేశం
ప్రస్తుత వినియోగదారులుకర్ణాటక ప్రభుత్వం
నిర్మాణ ప్రారంభం1781
పూర్తి చేయబడినది1791

చరిత్ర మార్చు

హైదర్ అలీ 1781 లో ఈ కట్టడానికి నిర్మాణ పనులు మొదలు పెట్టాడు. ఈ కట్టడాన్ని పూర్తిగా టిప్పు సుల్తాన్ 1791 లో పూర్తి చేశాడు. ఈ కట్టడాన్ని పూర్తిగా కర్రలతో నిర్మించారు. ఈ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ కాలంలో దర్బార్ గా ఉండేది. టిప్పు సుల్తాన్ మరణతారం బ్రిటిష్ వాళ్ళు ఈ ప్యాలెస్ ను ఒక సచివాలయంగా వాడుకున్నారు.

మరిన్ని విశేషాలు మార్చు

ప్రస్తుతం ఈ ప్యాలెస్ ను కర్ణాటక ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించి పర్యవేక్షిస్తున్నది. ఈ ప్యాలెస్ లో క్రింది ఫ్లోర్ లో ఉన్న నాలుగు గదులను టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం గురించి తెలిసే విధంగా మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ లో ఉన్న ఉద్యనవనాన్ని కర్ణాటక రాష్ట్ర హార్టికల్చర్ శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి.

చిత్రమాలికలు మార్చు

మూలాలు మార్చు

  1. "Tipu Sultan Summer Palace". Trip2blr.Com. Archived from the original on 5 ఆగస్టు 2019. Retrieved 5 August 2019.