డబ్బెవరికి చేదు

డబ్బెవరికి చేదు తారకనామ మూవీస్ పతాకంపై ఎస్.రామలింగరాజు నిర్మించి, రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన 1987 తెలుగు కామెడీ చిత్రం .[1] ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, సీత ప్రధాన పాత్రలు ధరించగా, వాసూ రావు సంగీతం సమకూర్చాడు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో నటి సీతకు తొలి సినిమా.[2][3]

డబ్బెవరికి చేదు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం చంద్రమోహన్ ,
రాజేంద్ర ప్రసాద్,
సులోచన
సంగీతం వాసూరావు
నిర్మాణ సంస్థ తారకనామ మూవీస్
భాష తెలుగు

కథ సవరించు

ఈ చిత్రం ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక గొప్ప భూస్వామి విశ్వనాథం (సుత్తి వీరభద్రరావు) కు ముగ్గురు కుమార్తెలు దేవి (మనోచిత్ర), స్వర్ణ (సులక్షణ), మమత (సీత); ఒక కుమారుడు మనోహర్ (ఈశ్వరరావు). మొదటి ఇద్దరు కుమార్తెలకు పెళ్ళిళ్ళయ్యాయి. పెద్ద అల్లుడు గోవర్ధనం (శరత్ బాబు), రెండవ అల్లుడు లక్ష్మీకాంత్ (చంద్ర మోహన్) లు మామగారి ఆస్తిపై కన్నేసి ఆయనపై లేని ఆప్యాయత కనబరుస్తూంటారు. విశ్వనాథం బావమరిది (సుత్తి వేలు -ఇతన్ని విశ్వనాథం అసలు పేరు తప్పించి రకరకాల ఇతర పేర్లతో పిలుస్తూంటాడు) మాత్రం వీళ్ళిద్దరూ ఆప్యాయత నటిస్తున్నారని అంటూంటాడు గానీ విశ్వనాథం ఒప్పుకోడు. ఇంతలో, విశ్వనాథం చిన్ననాటి స్నేహితుడు ఉదయ భాస్కరం, తన కుమారుడు వాళ్ళూరు వస్తున్నాడని ఉత్తరం రాస్తాడు. కానీ, ఆ సమయంలో అక్కడికి వచ్చిన విద్యాసాగర్ (రాజేంద్ర ప్రసాద్) అనే జర్నలిస్టునే తన స్నేహితుడి కుమారుడుగా పొరబడి ఆతిథ్యం ఇస్తారు. ఇక, విద్యాసాగర్, మమతలు ప్రేమలో పడతారు. కొంత సమయం తరువాత, మమత ఇంటిని వదిలి, బయటికి పోయి, విద్యాసాగర్ను పెళ్ళి చేసుకున్నప్పుడు నిజం తెలుస్తుంది. ఇంతలో, విశ్వనాథం, అతని బావ ఒక తీర్థయాత్ర కోసం తరలి వెళతారు. వారు ప్రయాణిస్తున్న బస్సు ఒక ప్రమాదంలో చిక్కుకుంటుంది. దీనిలో విశ్వనాథం మరణిస్తాడు. ఆ తరువాత, విశ్బనాథం రాసిన చిత్రమైన వీలునామా బయటికి వస్తుంది. దీనిలో విశ్వనాథం కున్న 50 లక్షల ఫిక్స్‌డు డిపాజిట్టు మొత్తం విడాకులు తీసుకునే కుమార్తెకు వెళ్తుంది. ఇక, 3 జంటలు విడాకులు తీసుకోవడమనే కామెడీ మొదలౌతుంది. చివరికి, విశ్వనాథం సజీవంగా ఉన్నాడనీ, అతని పిల్లల అభిమానాలు నిజమైనవా కావా అనేది తెలుసుకోవడానికి అతడు నాటకం ఆడినట్లూ తెలుస్తుంది. చివరగా, అందరూ అతనికి క్షమాపణలు చెబుతారు. విశ్వనాథం తన కుమార్తెలు అల్లుళ్ళకు మళ్ళీ పెళ్ళిళ్ళు చెయ్యడంతో సినిమా ముగుస్తుంది.

నటవర్గం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

  • కళ: సోమనాథ్, భాస్కర రావు
  • నృత్యాలు: ఆంథోనీ, రాజు, నంబిరాజు
  • సాహిత్యం: ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, కోసరాజు, సీతారామ శాస్త్రి
  • నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీలా, వాణ జయరామ్, ఎస్పీ సైలాజా, వి.
  • కథ: మల్లాడి వెంకట కృష్ణ మూర్తి
  • సంభాషణలు: దివాకర్ బాబు
  • సంగీతం: సలూరి వాసు రావు
  • కూర్పు: డి.రాజగోపాల్
  • ఛాయాగ్రహణం: బి. కోటేశ్వర రావు
  • పబ్లిసిటీ డిజైనర్: లంక భాస్కర్
  • నిర్మాత: ఎస్.రామలింగరాజు
  • స్క్రీన్ ప్లే- దర్శకుడు: రేలంగి నరసింహారావు
  • బ్యానర్: తారకనమ సినిమాలు

సంగీతం సవరించు

వాసూ రావు సంగీతం అందించాడు. లాహరి మ్యూజిక్ కంపెనీ వారు పాటలను విడుదల చేసారు. పంచదార చిలకా పాట బ్లాక్ బస్టర్.[4]

క్ర. సం పాట సాహిత్యం గాయనీ గాయకులు నిడివి
1 "పంచదార చిలకా" ఆచార్య ఆత్రేయ ఎస్పీ బాలు, పి.సుశీలా 5:03
2 "నువ్వుంటే విహారం" Kosaraju వాణి జైరాం 3:47
3 "తగునా ఔరా నీకిది తగునా" సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్పీ బాలూ, రామకృష్ణ 4:00
4 "ఎత్తుకు పై ఎత్తు వే" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు, మాధవ్‌పెడ్డి రమేష్, పి.సుశీలా, ఎస్పీ సైలాజా 4:11
5 "డబ్బెవరికి చేదు" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు 4:26

మూలాలు సవరించు

  1. "Dabbevariki Chedu (Cast & Crew)". Spicy Onion.
  2. "Dabbevariki Chedu (Review)". The Cine Bay.
  3. Eenadu (13 May 2023). "డబ్బులిచ్చే వరకూ డబ్బాలపైనే కూర్చొన్నారు". Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
  4. "Dabbevariki Chedu (Songs)". Cineradham. Archived from the original on 2017-08-18. Retrieved 2020-08-03.