దాసు త్రివిక్రమరావు

న్యాయవాది, కార్మిక నేత, గ్రంథాలయోద్యమ వ్యాప్తికి కృషి చేసిన వ్యక్తి.

దాసు త్రివిక్రమరావు (1894 - 1950) న్యాయవాది, కార్మిక నేత, గ్రంథాలయోద్యమ వ్యాప్తికి కృషి చేసిన వ్యక్తి.

దాసు త్రివిక్రమరావు
దాసు త్రివిక్రమరావు
జననం(1894-09-06)1894 సెప్టెంబరు 6
India కొండముది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1960 జూలై 31(1960-07-31) (వయసు 65)
జాతీయతభారతీయుడు
ప్రసిద్ధిన్యాయవాది, కార్మికనేత, గ్రంథాలయోద్యమనేత
మతంహిందూ
భార్య / భర్తవరలక్ష్మి (1896-1921)
వరలక్ష్మి అలిమేలుమంగమ్మ (1909-1990)
పిల్లలుకుమార్తె: వెంకట సీత బాయి
కుమారులు: అచ్యుతం
కృష్ణమూర్తి
నారాయణరావు
కేశవరావు
తండ్రిదాసు కేశవరావు
తల్లిసరస్వతమ్మ

జీవిత విశేషాలు మార్చు

వీరు గుంటూరు జిల్లాలో, కొండముడి లో సెప్టెంబరు 6, 1894 న జన్మించి, విద్యాభ్యాసం చేసిన పిదప చెన్నై చేరారు. 1920 లో ఇంగ్లాండు వెళ్ళి బారిష్టరు పూర్తిచేశారు. వీరిని అందరు డి.టి. రావు గా పిలుస్తారు. ఈయన తండ్రి దాసు కేశవరావు ఆధునిక ముద్రణ సాంకేతిక పరిజ్ఞానాన్ని యంత్రాలను బెజవాడలో ఏర్పాటు చేశారు. తాతగారు మహాకవి దాసు శ్రీరాములు, కవయిత్రి వేమూరి (దాసు) శారదాంబ ఇతని మేనత్త.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఇంగ్లాండ్ గ్రేస్ ఇన్ అను న్యాయ సంస్థలో చేరి అక్కడ లండన్ టైమ్స్ భారతదేశం తరపున పనిచేస్తూ వి.వి.గిరి తో పరిచయం, స్నేహం పెంపొందాయి. వి.వి.గిరి అధ్యక్షులు గా ఉన్నప్పుడు భారతీయ రైల్వే మెన్ సమాఖ్య కి (Indian Railwaymen Federation) ఉపాధ్యక్ష్యులు గా పనిచేసాడు. భారత్ లో బ్రిటిష్ పరిపాలన ఉన్నంతవరకు న్యాయవాదిగా న్యాయస్థానం లో ఉండటానికి ఒప్పుకోలేదు. 1935లో మద్రాస్ ప్రెసిడెన్సీ ఆంధ్ర ప్రాంతంలో 'ఆంధ్ర వార్త' అను తెలుగు దినపత్రికను ఆరంభించారు. 1939 - 1942 మధ్యలో 'డైలీ న్యూస్' అను ఆంగ్ల దిన పత్రికను నడిపించారు. హైదరాబాద్ ప్రభుత్వానికి గనుల కు సలహాదారుగా, చమురు పరిశ్రమలకు వేతన సంఘానికి అధ్యక్షుడు గా, సింగరేణి కాలరీస్ ముఖ్య కార్మిక అధికారిగా ఉన్నత పదవులు నిర్వహించారు. [1]

హైదరాబాద్ లో 31 జులై 1960 న తన 65వ ఏట మరణించారు.

గ్రంథాలయోద్యమం మార్చు

విజయవాడలోని రామమోహన గ్రంథాలయం అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని 1934లో చెన్నైలో జరిగిన 19వ రాష్ట్ర గ్రంథాలయ మహాసభలకు అధ్యక్షత వహించారు. విజయవాడ కేంద్రంగా పనిచేసిన అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘానికి 1919 నుండి సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. దాసు త్రివిక్రమరావు డిసెంబరు 1934 నుండి మార్చ్ 1936 వరకు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు అధ్యక్షులుగా పని చేసారు.[2]

ఆ సంఘం ముద్రించిన ఇండియన్ లైబ్రరీ జర్నల్ అను ఆంగ్ల పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. 1928లో గ్రేట్ బ్రిటన్ లో జరిగిన ఆ దేశపు గ్రంథాలయ మహాసభకు భారత ప్రతినిధిగా హాజరయ్యారు.[3][4]

1933లో తిరుచిరాపల్లిలో జరిగిన ప్రథమ తమిళనాడు రూరల్ లైబ్రరీ సర్వీస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అదే సంవత్సరం కొల్కతా లో జరిగిన ఇండియన్ లైబ్రరీ కాన్ఫరెన్స్ కు హాజరై ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించారు.[3]


మూలాలు మార్చు

  1. Harinarayana Rao, Dasu (2018). Complete Story of Genealogy of Dasu Family. pp. 45–46.
  2. "Andhra Pradesh Library Association/Leaders". Andhra Pradesh Library Association. Archived from the original on 2023-03-12. Retrieved March 12, 2023.
  3. 3.0 3.1 "దాసు త్రివిక్రమరావు". గ్రంథాలయ సర్వస్వము. 7. January 1928. Retrieved 8 March 2015.
  4. "Indian Library Association/Founding Members". ndian Library Association. Retrieved March 12, 2023.{{cite web}}: CS1 maint: url-status (link)