దొమ్మేటి వెంకటేశ్వరులు

దొమ్మేటి వెంకటేశ్వరులు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యుడు. అతను 2004 నుంచి 2009 వరకు ఆయన తాళ్లరేవు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పనిచేశాడు[1]. గతంలో తూర్పుగోదావరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పని చేశాడు. గతంలో అతను జనసేన పార్టీలో పని చేశాడు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర సమయంలో. వెంకటేశ్వరరావు కలిసి తన మద్దతును ప్రకటించి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.[2]

జీవిత విశేషాలు మార్చు

అతను తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామానికి చెందినవాడు. అతను 1959 ఫిబ్రవరి 15న జన్మించాడు.

అతను 2023 మే 29న కాకినాడ ఆసుపత్రిలో మృతి చెందాడు. అతనికి భార్య,కుమారుడు,కుమార్తె ఉన్నారు.

మూలాలు మార్చు

  1. "Andhra Pradesh Assembly Election Results in 2004". Elections in India. Retrieved 2023-05-31.
  2. "Tallarevu Ex MLA Dommeti Venkateswarlu Rao Passed Away". Vaartha (in ఇంగ్లీష్). 2023-05-30. Retrieved 2023-05-31.

బాహ్య లంకెలు మార్చు