ధరంపాల్

భారతీయ చరిత్రకారుడు

ధరంపాల్ (1922 - 2006) భారతదేశానికి చెందిన గాంధేయ వాది, స్వాతంత్ర సమర యోధుడు, చరిత్రకారుడు, తత్వవేత్త. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో జన్మించాడు. అతను భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన ఎలా ఉందో తెలుసుకుంటూ దాదాపు 30 సంవత్సరాలు గడిపాడు. ఈ సమయంలో అతను సేకరించిన వాస్తవాలను డాక్యుమెంట్‌ల రూపంలో ముద్రించి పెట్టుకున్నాడు. ధరంపాల్ భారతదేశంలో సైన్స్ చరిత్ర, నాటి సమాజం, ప్రజల గురించి చాలా రచనలు చేశాడు.[1][2]

ధరంపాల్
ఎడమవైపు ధరంపాల్, కుడివైపు రాజీవ్ దీక్షిత్.
జననం(1922-02-19)1922 ఫిబ్రవరి 19
ముజఫర్‌నగర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
మరణం2006 అక్టోబరు 24(2006-10-24) (వయసు 84)
జాతీయతభారతీయుడు
మతంహిందూ

పదవులు మార్చు

2001 లో, భారత ప్రభుత్వం ధరంపాల్ ను పశువుల జాతీయ కమిషన్ ఛైర్మన్ గా, రాష్ట్ర మంత్రిగా నియమించింది.

పూర్వ వలసరాజ్యపు భారతీయ విద్యావ్యవస్థపై అవగాహనను మార్చడంలో ధరంపాల్ కీలక పాత్ర పోషించాడు.[3][4]

రచనలు మార్చు

భారతదేశం వలస పాలనలో భారతీయ విద్య, వ్యవసాయం, సాంకేతికత, కళలపై ప్రభుత్వం డాక్యుమెంటేషన్ ఆధారంగా ధరంపాల్ ప్రాథమిక రచనలు రూపొందించాడు.

ఆయన రాసిన ప్రధాన పుస్తకాలు-[5]

  • పద్దెనిమిదవ శతాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీ
  • బ్యూటిఫుల్ ట్రీ
  • భారతీయ మానస్త్వత్వ చిత్రణ,
  • స్వధర్మ ఆఫ్ ఇండియా
  • పౌర అవిధేయత, భారతీయ సంప్రదాయం
  • భారతదేశ వైఖరి, అపకీర్తి.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-07. Retrieved 2021-10-07.
  2. "Introducing Dharampal - Center For Indic Studies". 7 June 2020. Archived from the original on 7 June 2020.
  3. "The Beautiful Tree". www.goodreads.com.
  4. Kakkar, Ankur (19 February 2019). "Remembering Dharampal's Seminal Contribution".
  5. https://www.goodreads.com/book/show/22019037-understanding-gandhi%7Ctitle=Understandinghttps://timesofindia.indiatimes.com/india/National-commission-on-Cattle-to-be-set-up/articleshow_new/1136006699.cms%7Ctitle=National
"https://te.wikipedia.org/w/index.php?title=ధరంపాల్&oldid=3938946" నుండి వెలికితీశారు