ధృతరాష్ట్రుడు
మహాభారతంలో పాత్ర
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ధృతరాష్ట్రుడు, మహాభారతంలో కౌరవులకు తండ్రి. ఈయన పుట్టుకనే అంధుడు. విచిత్రవీర్యుడి మొదటి భార్యయైన అంబికకు జన్మించిన వాడు. వ్యాసుని యోగ దృష్టి చేత జన్మించాడు. ఈయన గాంధారిని పెళ్ళాడాడు. దుర్యోధనుడు,, దుశ్శాసనుడు ఈయనకు మొదటి ఇరువురు పుత్రులు.
జననంసవరించు
విచిత్ర వీర్యుడు మరణించాక, ఆయన తల్లియైన సత్యవతి తన మొదటి కొడుకైన వ్యాసుని కోసం కబురు పెట్టింది. తల్లి కోరిక మేరకు, వంశాన్ని నిలబెట్టడానికి తన యోగ శక్తితో విచిత్ర వీర్యుని ఇరువురు భార్యలకు సంతానం కలిగిస్తాడు. వ్యాసుడు అంబికను చూడడానికి వెళ్ళినపుడు, ఆయన తేజాన్ని చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది. కాబట్టి ఆమెకు ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా జన్మించాడు. దాంతో రెండవ భార్యయైన అంబాలికకు జన్మించిన పాండురాజు హస్తినాపురాన్ని పరిపాలించాడు.