నక్కా వెంకటయ్య (N. Venkatayya) ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యునిగా పనిచేసాడు.[1]

నక్కా వెంకటయ్య
జననంజూన్ 19, 1909
నివాస ప్రాంతంమార్కాపురం
వృత్తిరాజకీయ నాయకుడు.
పదవి పేరుశాసనసభ్యుడు
పదవీ కాలం1952-1956
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు

జీవిత విశేషాలు మార్చు

నక్కా వెకటయ్య 1909 జూన్ 19న జన్మించాడు. అతను బి.ఎ. ఎ.ఐ.ఐ పట్టభద్రులు. తరువాత 4 సంవత్సరాల పటు కిర్లంపూడి చెక్కెర ఫ్యాక్టరీ జనరల్ మేనేజరుగా పనిచేసాడు. తరువాత సామర్లకోట చక్కెర ఫ్యాక్టరీలో 6 సంవత్సరాల పాటు కెమిస్టు గానూ, ఉయ్యూరు చక్కెర ప్యాక్టరీలో 8 యేండ్లు మెకిస్టుగా పనిచేసాడు. తరువాత ఆంధ్రా సిమెంటు కంపెనీ కన్‌సల్‌టింగ్ కెమిస్టు గా పంచదార పరిశ్రమలో చిరకాలం పనిచేశారు.

రాజకీయ జీవితం మార్చు

అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా ఎఱ్ఱగొండపాలెం నియోజకవర్గం నుండి ఆంధ్రరాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[2]. 1952 మద్రాసు శాసనసభ ఎన్నికలలో లోక్ పార్టీ అభ్యర్ధిగా మార్కాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. అతనికి పరిశ్రమలు, వాటి అభివృద్ధిపై ప్రత్యేక అభిమానం.

మూలాలు మార్చు

  1. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 6. Retrieved 9 June 2016.
  2. "Yerragondipalem 1955 Assembly MLA Election Andhra Pradesh | ENTRANCEINDIA" (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-10-09. Archived from the original on 2021-06-14. Retrieved 2021-06-14.