నిమ్మల కిష్టప్ప

హిందూపురం నుండి లోక్ సభ సభ్యులు. తెలుగు దేశం పార్టీ.

నిమ్మల కిష్టప్ప ఆంధ్ర ప్రదేశ్, అనంత పురం జిల్లా., హిందూపురం పార్లమెంటరీ నియోజిక వర్గానిని తెలుగు దేశం పార్టీ తరుపున 15వ లోక్ సభకు ప్రాతినిథ్యము వహించాడు.

బాల్యము మార్చు

నిమ్మల కిష్టప్ప 25 నవంబరు 1956 న శ్రీ నిమ్మల రంగప్ప, నిమ్మల ఆదిలక్ష్మమ్మ దంపతులకు అనంతపురం జిల్లోలోని పెరుమాళ్ళ పల్లి అనే గ్రామంలో జన్మించారు.

విద్య మార్చు

నిమ్మల కిష్టప్ప కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో బి.కాం. చదివారు.

కుటుంబము మార్చు

ఇతనికి వరలక్ష్మి తో 22 మే నెల 1983 వ సంవత్సరంలో వివాహమైనది. వీరికి ఇద్దరు కుమారులు.

ఇతను సందర్శించిన దేశాలు మార్చు

ఆస్ట్రేలియా, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలను వీరు సందర్శించారు.

మూలాలు మార్చు

https://web.archive.org/web/20130201155751/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4529