మలేషియా ఆగ్నేయాసియాలో ఒక రాజ్యాంగబద్ధమైన సమాఖ్య రాజ్యం (దేశం). మలేషియాలో 13 రాష్ట్రాలు, మూడు సమాఖ్య ప్రాంతాలు ఉన్నాయి. మలేషియా మొత్తం భూభాగం విస్తీర్ణం 329.847 చదరపు కిలోమీటర్ల (127,350 చ.మై.) గా ఉండి, దక్షిణ చైనా సముద్రంచే మలేషియా ద్వీపకల్పం (పెన్స్యులర్ మలేషియా), మలేషియా బోర్నియో అను రెండు సమాన భాగాలుగా వేరు చేయబడింది. భూ సరిహద్దులు థాయ్‌లాండ్, ఇండోనేషియా, బ్రునై దేశాలు, సముద్ర సరిహద్దులు సింగపూర్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలు. రాజధాని నగరం కౌలాలంపూరు, పుత్రజయ సమాఖ్య ప్రభుత్వ కేంద్ర స్థానంగా ఉన్నాయి. 2010 లెక్కల ప్రకారం జనాభా ద్వీపకల్పంలో 2.26 కోట్లు, బోర్నియోలో 28,33 మిలియన్లు. ప్రస్తుత మలేషియాకు మూలాలు మలయ్ రాజ్యాలతో మొదలౌతుంది, మలయ్ రాజ్యాలు 18 వ శతాబ్దం నుండి బ్రిటిషు సామ్రాజ్యం అధీనంలోనికి మారాయి అప్పుడు ఈ ప్రాంతాన్ని స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ అని పిలిచేవారు. బ్రిటిషు వారు ద్వీపకల్ప మలేషియా భూభాగాలను మొదట 1946 లో మలయన్ యూనియన్ పేరుతో ఏకీకృతం చేసారు. తిరిగి 1948 లో మలయ సమాఖ్య పేరుతో పునర్వ్యవస్థీకరించారు. మలేషియా 1957 ఆగష్టు 31 న స్వాతంత్ర్యం పొందినది. 1963 సెప్టెంబరు 16 న సభ, సారవాక్, సింగపూరు ప్రాంతాలను మలయా సమాఖ్యలో కలుపుకొని, దేశం పేరును మలేషియాగా మార్చి రెండు సంవత్సరాల గడవకముందే 1965 లో సింగపూరును సమాఖ్య నుండి బహిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, మలేషియా GDP దాదాపు 50 సంవత్సరాలు సగటున 6.0% వృద్ధి తో, ఆసియాలోని అత్యుత్తమ ఆర్థిక రికార్డులలో ఒకటిగా ఉంది. ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయికంగా దాని సహజ వనరులపై ఆధారపడి ఉంది కాని వైజ్ఞానిక, పర్యటక, వాణిజ్య, వైద్య పర్యటక రంగాలు కూడా ఆర్ధిక వ్యవస్థకు దన్నుగానిలుస్తున్నాయి.

మలేషియా
Flag of మలేషియా మలేషియా యొక్క చిహ్నం
నినాదం
"బెర్సెకుటు బెర్తంబాహ్ ముటు"
"ఐకమత్యమే బలము"1
జాతీయగీతం

మలేషియా యొక్క స్థానం
మలేషియా యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
కౌలాలంపూరు3
3°08′N 101°42′E / 3.133°N 101.700°E / 3.133; 101.700
అధికార భాషలు మలయు2
ప్రజానామము మలేషియన్
ప్రభుత్వం ఫెడరల్ రాజ్యాంగ రాజరికం
 -  Yang di-Pertuan Agong Al-Sultan Abdullah Ri'ayatuddin
 -  ప్రధానమంత్రి Ismail Sabri Yakkob
స్వాతంత్ర్యం
 -  from the యునైటెడ్ కింగ్డం నుండి (మలయా మాత్రం)
ఆగష్టు 31 1957 
 -  Federation (with సబాహ్, సారవాక్ , సింగపూరు4)
సెప్టెంబరు 16 1963 
విస్తీర్ణం
 -  మొత్తం 329,847 కి.మీ² (67th)
127,355 చ.మై 
 -  జలాలు (%) 0.3
జనాభా
 -  జూన్ 2007 అంచనా 27,122,000 (45వది)
 -  2000 జన గణన 24,821,286 
 -  జన సాంద్రత 82 /కి.మీ² (109వది)
213 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $308.8 బిలియన్ (33)
 -  తలసరి $12,700 (59)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) 0.805 (high) (61వది)
కరెన్సీ రింగిత్ (RM) (MYR)
కాలాంశం MST (UTC+8)
 -  వేసవి (DST) లేదు (UTC+8)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .my
కాలింగ్ కోడ్ +605
1 Malaysian Flag and Crest from www.gov.my.
2 The current terminology as per government policy is Bahasa Malaysia (literally Malaysian language) ref but legislation continues to refer to the official language as Bahasa Melayu (literally Malay language).
3 పుత్రజయ is the primary seat of government.
4 Singapore became an independent country on 9 August 1965.
5 020 from Singapore

దేశంలో విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉండి, రాజకీయాల్లో గణనీయ పాత్రను పోషిస్తున్నాయి. వెస్ట్ మినిష్టర్ పార్లమెంటరీ వ్యవస్థ ఆధారంగా ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థ రూపొందించబడింది, న్యాయ వ్యవస్థకు ఇంగ్లీష్ కామన్ లా ఆధారంగా ఉంది. మత స్వేచ్ఛను రక్షిస్తూనే ఇస్లాం మతం జాతీయ మతంగా ప్రకటించబడింది. రాజ్యాధిపతిగా రాజు ( యాంగ్ డి-పెర్తుఆన్) ఉంటాడు, రాజుగా తొమ్మిది మలేషియా రాష్ట్రాల వంశపారంపర్య పాలకుల నుండి ఒకరిని ఎన్నుకొంటారు, ఇతని పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వం యొక్క అధికారిగా ప్రధాన మంత్రి ఉంటాడు.

యురేషియాఖండం దక్షిణ కొనలో, ఉష్ణమండలంలో తాన్జుంగ్ పియై అను ప్ర్రాంతం మలేషియాలో ఉంది. ఇది పెద్ద సంఖ్యలో వివిధ స్థానీయ జంతువులు, శిలీంధ్రాలు, మొక్కలు ఉండే వైవిధ్యమైన దేశం. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య, తూర్పు ఆసియా సమ్మిట్, ఇస్లామిక్ సహకార సంస్థ, ఆసియా పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ, కామన్వెల్త్ దేశాల సమాఖ్య, అలీనోద్యమము మొదలైన సంస్థలు, సమాఖ్యలకు వ్యవస్థాపక సభ్యదేశంగావుంది

పేరు వెనుక గాధ మార్చు

"మలయు" అనే పేరు "మలయ్", "ఊర్" అనే తమిళ పదములనుండి పరిణామం చెందిన శబ్దంగా భావిస్తారు. మలయ్ అంటే పర్వతము, ఊర్ అంటే తెలుగు, తమిళాలలో ఊరు లేదా నగరం అని అర్ధము. తరువాత 7 నుండి 13వ శతాబ్దం వరకు సుమత్రాలో కొనసాగిన సామ్రాజ్యాన్ని మలయు అని వ్యవహరించేవారు. ప్రాచీన భారతదేశపు వ్యాపారులు మలేషియాను "మలయాద్వీపం" అను పేరుతో వ్యవహరించేవారు.1826 సంవత్సరంలో ఫ్రెంచి నావికుడు జూల్స్ డ్యుమాంట్ డ్యుర్విల్లీ తన సముద్రయానంలో మలేషియా, మైక్రోనేషియా, మెలనేషియ అనే పేర్లతో పిలువబడే ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడు; 1831 సంవత్సరంలో "Société de Géographie "కు ఈ పేర్లను ప్రతిపాదించాడు. జూల్స్ డ్యుమాంట్ డ్యుర్విల్లీ మలేషియాను పూర్వం ఈస్టిండీస్ అని వ్యవహరించేవారని అభివర్ణించాడు. 1850 సంవత్సరంలో ఇంగ్లాండుకు చెందిన మావనజాతి చరిత్ర శాస్త్రవేత్త జార్జ్ శామ్యూల్ విండ్సర్ ఎర్ల్ ఇండియా ద్వీపాలు , తూర్పు ఆసియా జర్నల్ లో ఈ ఆగ్నేయ ఆసియా ద్వీపాలకు మేలయునేషియా , ఇండూనేషియా అను పేర్లను ప్రతిపాదించాడు. మలేషియా 31 ఆగష్టు 1957 న మలయ సమాఖ్య స్వాతంత్ర్యం పొందినది. 16 సెప్టెంబర్ 1963 న సభ, సారవాక్, సింగపూరు ప్రాంతాలు మలయా సమాఖ్యలో కలుపుకొని, దేశం పేరు మలేషియాగా మార్చబడింది.

చరిత్ర మార్చు

మాలేషియాలో 40,000 సంవత్సరాల పూర్వం ఆధునిక మానవుడు నివసించిన ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో నివసించిన మొదటి మానవులు " నెగ్రితోస్ " అని భావిస్తున్నరు. క్రీశ మొదటి శతాబ్దం నుండి ఇక్కడకు భారతదేశం, చైనా నుండి వ్యాపారస్తులు వలసవచ్చినట్లు అంచనా. వారు ఇక్కడ 2-3 శతాబ్దాలలో వాణిజ్య రేవులు, తీరప్రాంత నగరాలు నిర్మించారు. వారి రాకతో ఇక్కడి స్థానిక ప్రజలు వారి సంస్కృతి మీద భారతీయ, చైనా సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం చూపాయి. అలాగే మలాయ్ స్థానిక ప్రజలు హిందూ, బౌద్ధ మతం అవలంబించసాగారు. ఇక్కడ 4-5 శతాబ్ధాలకు చెందిన సంస్కృత వ్రాతపతులు లభించాయి. మలాయ్ ద్వీపకల్పం ఉత్తర భూభాగంలో 2వ శతాబ్దంలో లాంగ్‌కసుకా సామ్రాజ్యం స్థాపించబడి 15వ శతాబ్దం వరకు కొనసాగింది. 7-13వ శతాబ్ధాలలో దక్షిణ మలయా ద్వీపకల్పంలో శ్రీవిజయ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. శ్రీవిజయ సామ్రాజ్యం పతనం తరువాత మలేషియా ద్వీపకల్పం, మలేషియా ఆర్చిపెలెగోల మీద మజపాహిట్ సామ్రాజ్య ఆధిక్యం కొనసాగింది. 14వ శతాబ్దం నుండి మలేషియా ద్వీపకల్పంలో ఇస్లాం ప్రవేశించి వ్యాపించసాగింది. 15వ శతాబ్దంలో శ్రీవిజయ సామ్రాజ్యానికి చెందిన రాజకుమారుడు పరమేశ్వర మలక్క సుల్తానేట్ సామ్రాజ్యస్థాపన జరిగింది. మలక్క సుల్తానేటును మలేషియా ద్వీపకల్ప మొదటి స్వతంత్ర రాజ్యంగా భావించబడుతుంది. ఈ సమయంలో మలక్క ముఖ్యమైన వ్యాపారకూడలిగా ఉంటూ పరిసర భూభాగాన్ని వ్యాపారపరంగా ఆకర్షిస్తూ వచ్చింది. పరమేశ్వరా ముస్లిం మతం స్వీకరించి ముస్లిం మతాన్ని వేగంగా విస్తరింపజేసాడు.

1511 లో పోర్చుగీస్ మలక్కా సామ్రాజ్యాన్ని జయించింది. తరువాత మలేషియాను 1641లో డచ్ స్వాధీనం చేసుకుంది. 1786లో మలేషియాలోకి బ్రిటిష్ సామ్రాజ్యం ప్రవేశించింది. తరువాత ఈస్టిండియా కంపెనీ సుల్తాన్ కెదాహ్ నుండి పెనాంగును లీజుకు తీసుకుంది. 1819 లో సింగపూరును స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం 1824 నాటికి మలయా మీద ఆధిపత్యం సాధించింది. నేరుగా ఒప్పందం ద్వారా సింగపూర్, లబుయన్ ద్వీపంలో కాలనీని స్థాపించారు. 20వ శతాబ్దం నాటికి పహాంగ్, సెలాంగర్, పెరక్, నెగెరి సెంబిలన్ రాష్ట్రాలు ఫెడరేటెడ్ మలాయ్ రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి. మలాయ్ పాలకులతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా మలాయ్ పాలకులకు బ్రిటిష్ పౌరులు సలహాదారుగా నియమించబడ్డారు. మిగిలిన 5 రాష్ట్రాలు ఫెడరేటెడ్ కాని రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి. 20 శతాబ్ధానికి ఈ రాష్ట్రాలు బ్రిటిష్ ఆధీనంలో లేనప్పటికీ ఇక్కడ కూడా బ్రిటిష్ సలహాదారులు అనుమతించబడ్డారు. 19వ శతాబ్దంలో ద్వీపకల్పంలో, బొర్నియో లలో అభివృద్ధి సధారణంగా ప్రత్యేకత కలిగి ఉంది. బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశం, చైనా దేశాల నుండి ఇక్కడకు కూలీల రాకను ప్రోత్సహించారు. 1878లో సులు సుల్తాన్ మొత్తం అధికారాలు బ్రిటిష్ పరం చేసేవరకు సబాహ్ బ్రిటిష్ వారి క్రౌన్ కాలనీగా ఉంటూ వచ్చింది తరువాత ఉత్తర బోర్నియోకి మారింది. 1842 లో బ్రూనై సుల్తాన్ జేంస్ బ్రూక్ చేత సరావాక్ వదులి వేయబడింది. అతడిని వెన్నంటి వచ్చిన రాజులు అది బ్రిటిష్ క్రౌన్ కాలనీగా మారేవరకు తెల్లరాజాలుగా 1946 వరకు స్వతంత్రంగా రాజ్యపాలన చేసారు.

రెండవ ప్రపంచ యుద్ధసమయంలో జపానీ సైన్యం మలయా మీద దండయాత్రచేసి మలయా, సరవాక్, సింగపూర్ లను ఆక్రమించుకున్నది. జపాన్ మాలయాను మూడు సంవత్సరాల కాలం పాలించింది. ఈ సమయంలో అధికమైన సంప్రదాయ సమస్యలు చివరకు జాతీయసమైక్యత అభివృద్ధికి దారితీసాయి. మిత్రసైన్యాలు మలయాను తిరిగి స్వాధీనం చేసుకున్న తరువాత స్వతంత్రరాజ్య స్థాపనకు ప్రజలలో మద్దతు అధికమైంది. యుద్ధనంతరం బ్రిటిష్ మలయాను రాజ్యపాలనను సమైక్యపరచి మలయాన్ యూనియన్ పేరిట ఒకేరాజ్యంగా చేయాలని ప్రణాళిక రూపిందించింది. అయినప్పటికీ మలయా ప్రజలు ఈ ప్రతిపాదనను బలంగా వ్యతిరేకించారు. సంప్రదాయక చైనీయులకు పౌరసత్వం ఇస్తున్న మలయా పాలకులను ఈ వ్యతిరేకత బలహీనపరచింది. 1946లో మలయాన్ యూనియన్ స్థాపించబడింది. సింగపూర్ తప్ప మిగిలిన మలయా ద్వీపకల్పంలో ఉన్న బ్రిటిష్ ఆధిపత్యం రద్దు చేసి బ్రిటిష్ సైనిక రక్షణతో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఫెడరేషన్ ఆఫ్ మలయా స్థాపించబడింది. ఈ సమయంలో మలయాన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద సప్రదాయక చైనీయులు తిరుగుబాటు చేసి గొరిల్లా యుద్ధంతో బ్రిటిష్ వారిని మాలయా నుండి తరిమివేయాలని ప్రయత్నించారు. మలయా తిరుగుబాటు 1948 నుండి 1960 వరకు కొనసాగింది. అలాగే ఈ తిరుగుబాటు దారుల మీద మలయాన్ కామంవెల్ట్ సైన్యాలు సాగించిన ఈ యుద్ధం దీర్ఘకాల వ్యతిరేక తిరుగుబాటు పోరాటంగా కామంవెల్త్ చరిత్రలో నిలిచిపోయింది. తరువాత మలయా ఫెడరేషన్, సబాహ్, సరవాక్, సింగపూర్ బ్రిటిష్ క్రౌన్ కాలనీలు ఒక ఒప్పందానికి వచ్చయి. ఫెడరేషన్ ప్రతిపాదించిన తేదీ 1963 ఆగస్ట్ 31 అయినప్పటికీ ఒప్పందం అమలుకు రావడానికి ఇండోనేషియా నేత సుకర్నో, సారావాక్ యునైటెడ్ పీపుల్స్ వ్యతిరేకంతో సెప్టెంబరు 16 వరకు ఆలస్యం జరిగింది.

ఫెడరేషన్ తీవ్రమైన ఘర్షణలు తీసుకురావడమే కాక 1965లో ఇండోనేషియా, సింగపూరులతో పోరాటం జాతి ఘర్షణలు రావడానికి కూడా కారణం అయింది. ఈ జాతి ఘర్షణలు పాతుకుపోయి 1969 మే 13 నాటికి అల్లర్లు చెలరేగాయి. అల్లర్ల తరువాత ప్రధానమంత్రి తన్ అబ్దుల్ రజాక్ వివాదాస్పదమైన కొత్త ఆర్ధికవిధానాలను ప్రవేశపెట్టాడు. ప్రధాన మంత్రి మహేందిర్ మొహమ్మద్ పాలనలో 1980 లో వేగవంతమైన ఆర్ధిక ప్రగతి నగరనిర్మాణం ప్రారంభం అయ్యాయి. పెట్రోనాస్ టవర్స్, ది నార్త్ సౌత్ ఎక్స్‌ప్రెస్ వే, ది న్యూ ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ ఆఫ్ పుత్రాలయా, మల్టీమీడియా సూపర్ కారిడార్ వంటి నిర్మాణాలు వాటిలో కొన్ని. అయినప్పటికీ 1990 ఆసియా ఆర్ధిక దిగ్బంధం సమయంలో కరెంసీ, స్టాక్, స్థిరాస్థి మార్కెట్ దాదాపు పడిపోయింది.

ప్రభుత్వ విధానాలు మార్చు

మలేషియా రాజ్యాంగ ఎన్నిక రాచరికం అనుసరిస్తుంది. మలేషియా ప్రభుత్వ విధానం బ్రిటిష్ కాలనియల్ పాలనా విధానాలలో ఒకటి అయిన వెస్ట్ మినిస్టరీ పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడైన " యాంగ్ డి-పెర్తుఆన్ అగాంగ్ "ను సాధారణంగా రాజుగా భావిస్తారు. మలేషియా రాష్ట్రాల 9 వారసత్వ పాలకుల నుండి 5 సంవత్సరాలకు ఒకసారి రాజును ఎన్నుకుంటారు. మిగిలిన 4 రాష్ట్రాలకు గౌరవ పాలకులుగా గవర్నర్లు నియమించబడతారు. వీరు రాజు ఎన్నికలో పాల్గొనరు. 2011 నుండి అబ్దుల్ హలీం ఆధ్వర్యంలో జరిగిన ఒప్పందం కారణంగా వారసత్వ పాలకులైన 9 మంది ఒకరి తరువాత ఒకరు రాజుగా ఎన్నుకొనబడతారు. 1994 లో రాజ్యాంగ విధానంలో మార్పులు చేసిన తరువాత రాజు ప్రభుత్వంలో గౌరవార్ధం నియమించబడతాడు. అప్పర్ హౌస్ నుండి మంత్రులను ఎన్నిక చేస్తారు.

రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కేంద్రప్రభుత్వానికి కొంత చట్టం అమలు చేసే అధికారాలు విభజించబడి ఉంటాయి. రెండు సభలు కలిగిన పార్లమెటు విధానంలో దిగువ సభలో ప్రజాప్రతినిధులు అప్పర్ సభలో సెనేట్ సభ్యులు పాల్గొంటారు. ఒక్కో నియోజక వర్గం నుండి ఒక్కొకరు అన్న విధానంలో 5 సంవత్సరాలకు ఒకసారి దిగువసభకు 222 మంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. 70 మంది సెనేట్ సభ్యులు 3 సంవత్సరాల కాలం పనిచెయ్యడానికి నియమించబడతారు. 26 మంది సెనేట్ సభ్యులు 13 రాష్ట్రప్రభుత్వాల శాసనసభల నుండి ఎన్నుకొనబడతారు. మిగిలిన 44 మంది సెనేట్ సభ్యులు ప్రధానమంత్రి సలహాతో రాజుచేత నియమించబడతారు. పార్లమెట్ మిశ్రిత పార్టీ విధానం అనుసరిస్తుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి మలేషియా బారిసన్ నేషనల్ అనబడే మిశ్రిత పార్టీ విధానం అనుసరిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే శాసనసభ విధానం అనుసరిస్తుంది. రాష్ట్ర శాసనసభకు ప్రతినిధులను నియోజక వర్గం నుండి ఎన్నుకొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వలను పాలనావ్యవహారాల బాధ్యత వహిస్తారు. అధిక సంఖ్యలో శాసనసభా సభ్యులు కలిగిన పార్టీ నుండి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రాలకు పాలకులుగా మలాయ్ వారసత్వ ప్రాతిపదికన నియమించబడతారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 21 సంవత్సరాలు నిండిన నమోదుచేయబడిన పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఓటింగ్ నిర్భంధం కాదు.

ప్రధానమంత్రి నాయకత్వంకోలోని మంత్రివర్గానికి ప్రభుత్వనిర్వహణ అధికారం ఉంటుంది. ప్రధానమంత్రి తప్పకుండా పార్లమెంట్ సభ్యుడై ఉండాలి. అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ సభ్యులున్న పార్టీ నుండి రాజు ప్రధానమంత్రిని ఎన్నిక చేస్తాడు. ఇరు సభా సభ్యుల నుండి ఎంపిక చేసిన వారుని కాబినెట్ మంత్రులను చేస్తారు. ప్రధానమంత్రి ప్రభుత్వానికి, పార్లమెంటుకు నాయకత్వం వహిస్తాడు. 2009లో నాజిబ్‌రజాక్ 6వ ప్రధాన మంత్రిగా ఎన్నికచేయబడ్డాడు.

మలేషియా చట్టవిధానం ఇంగ్లీష్ బేసిక్ ఆధారంగా రూపొందించబడింది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ జవాబుదారీ బాధ్యత కలిగి ఉంటుంది. న్యాయమూర్తి నియామకత్వం జవాబుదారి, పారదర్శకంగా ఉంటుంది. న్యాయవ్యవస్థలో ఉన్నత న్యాయస్థానం ఫెడరల్ కోర్ట్ తరువాత కోర్ట్ ఆఫ్ అప్పీల్, రెండు హై కోర్టులు ఉంటాయి. ఒకటి మలేషియా ద్వీపకల్పంలో మరొకటి తూర్పు మలేషియాలో ఉంటుంది. మలేషియాలో రాచరిక వ్యవస్థ వచ్చే ఫిర్యాదులు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానం ఉంటుంది. షరియా న్యాయస్థానాలు సివిల్ న్యాయస్థానాల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ కోర్టులు మలేషియన్ ముస్లిములకు షరియా చట్టం అనుసరించి తీర్పులు ఇస్తుంటుంది. ఇవి సెక్యులర్ న్యాయస్థానాలకు సమాంతరంగా పనిచేస్తుంటాయి. దేశాంతర్గత రక్షణ చట్టం విచారణ లేకుండా నిర్భంధించడాన్ని అనుమతిస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగం అమ్మకం వంటి విషయాలలో మరణశిక్ష విధించబడుతుంది.

మలేషియన్ రాజకీయాలలో జాతి ప్రధానపాత్ర వహిస్తుంది. రాజకీయ పార్టీలన్నీ జాతి ఆధారంగానే ఏర్పడతాయి. కొత్త ఆర్ధిక విధానాలు, భూమిపుతేరాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం, మలయన్లకు ప్రత్యేత ఇవ్వడం, అసలైన మలేషియా వారసులని భావించబడుతున్న స్థానిక గిరిజనులకు ప్రత్యేకత ఇవ్వడం వంటి చర్యలతో నేషనల్ డెవలప్మెంట్ పాలసీ ఒక అడుగు ముందుకు వేసింది. భూమిపుతేరాకు చెందని చైనా, భారతీయ వంశావళి వారికంటే మిగిలిన మలేషియన్లకు ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించింది. ఈ విధానాలలో భూపుతేరా ప్రజలకు ఉద్యోగాలు, విద్యావసతులు, ఉపకారవేతనాలు, వ్యాపారం, చౌకైన గృహవసతి, పొదుపు పధకాలు భాగం వహిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విధానాలు సంప్రదాయ ప్రజల మధ్య తీవ్రమైన అసహనానికి కారణం ఔతుంది. మలేషియా ప్రభుత్వం విధానాలు మతాతీత విధానలను ప్రతిఫలిస్తున్నాయా లేక ఇస్లాం విధానాలను ప్రతిఫలిస్తున్నాయా అన్న విషయం మీద వివాదాలు తలెత్తుతున్నాయి. పాన్-ఇస్లామిక్ పార్టీ రాష్ట్ర శాసనసభలో ఇస్లామిక్ చట్టాలను ప్రవేశపెట్టడాన్ని ఫెడరల్ ప్రభుత్వం నిలిపివేసింది.

సైన్యం విదేశీవిధానాలు మార్చు

ఆగ్నేషియా దేశాలు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ నిధివితరణ సభ్యత్వం కలిగిన మలేషియా నుండి ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి, ది ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కోపరేషన్, ది డెవలపింగ్ 8 కంట్రీస్, నాన్ అలైండ్ మూవ్మెంట్ మొదలైన సమావేశాలలో పాల్గొంటూ ఉంటారు. పూర్వ బ్రిటిష్ కాలనీగా 2005 లో కామంవెల్త్ దేశాల సమ్మేళనం మలేషియాలోని కోలాంపూరులో జరిగింది. మలేషియా విదేశీ విధానం పక్షపాతరహితం, అన్ని దేశాలతో శాతియుత విధానం వహిస్తూ ఉంటుంది. దక్షిణాసియా రక్షణ, స్థిరత్వానికి మలేషియా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ప్రాంతీయ దేశాలతో సంబాధాలను మరింత బలపరచడాన్ని కోరుతూ ఉంటుంది. చారిత్రకంగా మలేషియా ప్రభుత్వం తనను ఇస్లామిక్ దేశంగా పేర్కొటున్నది. అలాగే ఇతర ఇస్లామిక్ దేశాలతో సంబంధాలను బలపరుస్తూ ఉంది. మలేషియా దేశసార్వభౌమాధికారం, దేశీయ వ్యవహారాలను తన అధీనంలో ఉంచడానికి ముఖ్యత్వం ఇస్తుంది.

మలేషియా ప్రభుత్వం పొరుగుదేశాలతో భూభాగ వివాదాలను పరిష్కరించడానికి శక్తియుక్తులు ఉపయోగిస్తుంది. మలేషియా భూవివాదాల పరిస్కారానికి అనుసరిస్తున్న పలు విధానాలలో ప్రభుత్వం వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టిలోకి తీసుకువెళ్ళడం ఒకటి. 2002 లో దక్షిణ చైనా సముద్రంలో కాందక్ట్ ఆఫ్ పారిస్ ప్రకటనతో అనేక రాష్ట్రాల మధ్య తలెత్తిన స్పార్ట్లీ ద్వీపాల వివాదాలలోవెసులుబాటు కనిపించింది. 2008లో బ్రూనై, మలేషియా భూవివాదాలకు ముగింపు పలికి సముద్రజల సరిహద్దుల విషయంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. ఫిలిప్పైంతో ఉన్న సబాహ్ వివాదం పరిస్కరించబడలేదు. సింగపూర్ భూపునరుద్ధరణ విషయంలో ఇరు దేశాలనడుమ ఘర్ణణలు తలెత్తడానికి కారణమైనది. ఇండోనేషియా సముద్రజలాల సరిహద్దుల వివాదాలు ఇంకా సజీవంగా ఉన్నాయి.

మలేషియా ఇజ్రాయేలును ఎప్పుడూ దేశంగా గుర్తించలేదు. అలాగే మలేషియా ఇజ్రాయేలుతో ఎటువంటి దౌత్యసంబంధాలు ఏర్పరుచుకో లేదు. మలేషియా పాలస్తీనాకు బలమైన మద్దతుదాతుగా ఉంటూ వచ్చింది. అంతేకాక గాజా ఫ్లోటిల్లా దాడి సందర్భంలో ఇజ్రాయేలును అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు తీసుకువెళ్ళాలని పులుపు ఇచ్చింది. మలేషియన్ శాంతిస్థాపన దళాలను లెబనానుకు పంపింది. అలాగే ఐక్యరాజ్యసమితి శాంతిస్థాపన దళం ద్వారా అనేక శాంతిస్థాపన మిషన్లలో భాగస్వామ్యం వహిస్తుంది.

మలేషియన్ సైనికశక్తి మూడువిభాగాలుగా విభజింపబడుతుంది. అవి వరుసగా రాయల్ మఏషియన్ నేవీ, ది మలేషియన్ ఆర్మీ, రాయల్ మలేషియన్ ఎయిర్ ఫొర్స్. మలేషియాలో నిర్భంధ సైనికవిధానంలాఏదు, సైన్యంలో ప్రవాఏశించడానికి వయోపరిమితి 18. దేశ జి.డి.పిలో 1.9% సైన్యం కొరకు ఉపయోగించబడుతుంది. మలేషియా మానవశక్తిలో 1.23% సైనిక ఉద్యోగాలలో నియమించబడ్డారు. ప్రస్తుతం మలేషియా మూడు విభాగాల సైన్యాల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ప్రాంతీయ రక్షణ కొరకు " ది ఫైవ్ పవర్ డిఫెంస్ " స్థాపించబడింది. ఇది సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డం దేశాల సమష్టి సైన్యంగా రూపొందించబడి 40 సంవత్సరాల నుండి పనిచేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా సమష్టి శిక్షణ, సైనిక క్రీడలు ఇండోనేషియాలో నిర్వహించబడుతున్నాయి. మలేషియా, ఫిలిప్పైంస్ సమష్టి రక్షణదళం శిక్షణా, సైనిక క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి అంగీకరించాయి. అలాగే వారి జలభాగ రక్షణ, చట్టవ్యతిరేకమైన ప్రవేశం వంటి వివాద పరిష్కారల బాధ్యత వారికి అప్పగించాయి.

భౌగోళికం మార్చు

మలేషియా మొత్తం వైశాల్యం 3,29,847 చదరపు కిలోమీటర్లు. వైశాల్యపరంగా మలేషియా ప్రపంచదేశాలలో 67వ స్థానంలో ఉంది. మలేషియా పడమటి సరిహద్దులలో తాయ్‌లాండ్ ఉంది. తూర్పు సరిహద్దులలో ఇండోనేషియా, బ్రూనై దేశాలు ఉన్నాయి. మలేషియా ఇరుకైన కాజ్‌వే, వంతెనలతో సింగపూరుతో అనుసంధానమై ఊంది. మలేషియా సముద్రతీర సరిహద్దులో వియత్నాం, ఫిలిప్పైన్ ఉన్నాయి. భూసరిహద్దులలో అధిక భాగం పర్లిస్ నది, ది గోలోక్ నది, పగలయన్‌ కాలువ ఉన్నాయి. సముద్రతీర జలసరిహద్దులలో కొన్ని వివాదాలు ఉన్నాయి. మలేషియాను సరిహద్దుగా చేసుకుని బ్రూనై అవతరించింది. బ్రునైని సారవాక్ రాష్ట్రం రెండుభాగాలుగా విడదీస్తుంది. ఆసియా ప్రధానభూమి, మలాయ్ ఆర్చ్‌పిలాగోలలో ఉన్న ఒకేదేశం మలేషియా. ఆసియాఖండానికి చివరి దక్షిణ భూభాగం మలేషియా దక్షిణ రాష్ట్రమైన జోహర్‌లో ఉన్న తాన్‌జంగ్. సుమత్రా, మలేషియా ద్వీపకల్పం మధ్య ఉన్న మలక్క స్ట్రైట్ ప్రపంచ వాణిజ్యానికి అతిముఖ్య రహదారిగా ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 40% ఈ మార్గం ఆధారంలో జపుగుతుంది.

మలేషియా రెండుభాగాల నద్య దక్షిణచైనా సముద్రం ఉంటుంది. ద్వీపకల్ప మలేషియా, తూరు మలేషియా భూభాలకు దీర్ఘమైన సముద్రతీరం ఉంటుంది. ఈ సముద్రతీరాల నుండి మైదానాలు ఆరంభమై క్రమంగా పర్వత ప్రాంతాలుగా మారుతూ ఉంటుంది. ద్వీపకల్ప మలేషియాలో 40% మలేషియన్ భూభాగం ఉంటుంది. ఈ భూభాగం ఉత్తరదక్షిణాలుగా 740 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. అలాగే అత్యధిక వెడల్పు 322 కిలోమీటర్లు ఉంటుంది. ఈ భూభాగాన్ని తితివాంగ్సా పర్వతాలు తూర్పుపడమరలుగా విడదీస్తాయి. ద్వపకల్ప మధ్యభాగంలో ఈ పర్వత శ్రేణిలో కొంతభాగం దిగువకు దిగి ఉంటుంది. ఈ పర్వతాలు దట్టమైన అరణ్యాలతో నిండి ఉంటుంది. ఈ పర్వతం ప్రధానంగా గ్రానైట్ శిలామయమై ఉంటుంది. అవి చాలా వరకు అరిగి ఉంటాయి ఈ పర్వతాలు కొన్ని మలేషియన్ నదులకు జన్మస్థానాలు. మలేషియన్ ద్వీపకల్ప సముద్రతీరాలు వెడల్పు సుమారు 50 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ద్వీపకల్ప సముద్రతీరం పొడవు 1,931 కిలోమీటర్లు. అయినప్పటికీ హార్బర్లు పడమటి తీరంలో మాత్రమే ఉంటాయి.

బోర్నియో ద్వీపంలో ఉన్న తూర్పు మలేషియా సముద్రతీరం పొడవు 2,607 కిలోమీటర్లు. ఈ భూభాగంలో సముద్రతీర భూభాగం, కొండలు, లోయలు, లోతట్టుగా ఉండే పర్వతాలు ఉంటాయి. పర్వశ్రేణులు సారవాక్ నుండి ఉత్తరదిశగా బారులు తీరి సబాహ్ రాష్ట్రాన్ని వేరుచేస్తూ ఉంటాయి. ఈ పర్వతశ్రేణులలో మలేషియాలోని అత్యంత ఎత్తు ఉన్న 4,95.2 మీటర్ల ఎత్తు ఉన్న కినబాలు పర్వతం ఉంటుంది. ప్రపంచ వారసత్వ సంరక్షణ సంస్థ అయిన " యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్"గా కినబాలు పర్వతంలో ఉన్న " కినబాలు నేషనల్ పార్క్ " సంరక్షించబడుతుంది. ఈ ఉన్నత పర్వతశ్రేణులు మలేషియా , ఇండోనేషియాలకు సరిహద్దుగా ఉన్నాయి. సారవాక్ రాష్ట్రంలో ఉన్న ములుగుహలు ప్రపంచంలో అత్యంత పొడవైన గుహల శ్రేణిగా భావించబడుతుంది. వీటిచుట్టూ ఉన్న భూభాగంలో అనేక ద్వీపాలు ఉన్నాయి. వీటిలో పరిమాణంలో పెద్ద ద్వీపం బంగ్గీ.

జీవవైవిధ్యం మార్చు

మలేషియా 1993 జూన్ 12 వ తేదీ రియో సమావేశంలో " బయోలాజికల్ డైవర్శిటీ " (జీవవైవిధ్యం) కి సంతకం చేసి 1994 జూన్ 24 సమావేశంలో భాగస్వామ్యం వహించింది. మలేషియా తరువాత జీవవైవిధ్యం ప్రణాళిక, కార్యరూప ప్రణాళిక రూపిందించింది. దేశంలో అత్యధిక జీవవైవిధ్యం, అధిక పరిమితిలో స్థనికత ఉంది. మలేషియాలో ప్రపంచంలో ఉన్న జీవజాతులలో 20% జీవజాలం ఉన్నట్లు అంచనా. బోర్నియో పర్వతారణ్యాలలో దేశంలోని అత్యధిక స్థానిక జీవజాలం మనుగడ సాగిస్తున్నది. దిగువ అరణ్యప్రాంతాలలో ప్రత్యేకమైన జీవజాలం మనుగడ సాగిస్తున్నది.

జంతుజాలం మార్చు

మలేషియా ద్వీపంలో 210 క్షీరదాలు, 620 కంటే అధికమైన పక్షిజాతులు ఉన్నట్లు నమోదైంది. బోర్నియో పర్వతాలలో స్థానిక పక్షిజాతులనేకం కనిపిస్తుంటాయి. మలేషియాలో 250 జాతుల ప్రాకే జంతువులు ఉన్నాయి. దేశంలో 150 జాతుల పాములు, 80 బల్లి జాతులు ఉన్నాయి. అలాగే వేలసంఖ్యలో కీటకాలు ఉన్నాయి. మలేషియా జలభాగం భూభాగం కంటే 1.5 పెద్దది. మలేషియా జభాగంలో జీవవైవిధ్యం అత్యధిక కలిగిన కోరల్ ట్రైయాంగిల్ ఒకటి. సిపడాన్ ద్వీపం చూట్టూ ఉన్న జలభాగం ప్రంపంచంలో జీవవైవిధ్యం అధికంగా ఉన్న ప్రదేశంగా భావించబడుతుంది. 600 రకాల కోరల్ (పగడం) జాతులున్న సులు సముద్రం జీవవైద్యానికి ప్రముఖ క్షేత్రమని భావించబడుతుంది.

శిలీంద్రాలు మార్చు

మొక్కలు మార్చు

మలేషియాలో మూడింట రెండుభాగాలు అరణ్యాలతో నిండి ఉంటుంది. కొన్ని అరణ్యాలు 13 కోట్ల సంవత్సరాల నాటివని వశ్వసిస్తున్నారు. మలేషియా తూర్పు దిక్కున దిగువభూమి అరణ్యాకు 760 మీటర్ల దిగువన వర్షాధార అరణ్యాలు ఉన్నాయి. ఈ అరణ్యాల అభివృద్ధికి ఇక్కడి తేమతోకూడిన వేడి వాతావరణం సహకరిస్తుంది. ఇక్కడ 14,500 రకాల పూలమొక్కలు, చెట్లు ఉన్నాయి. మలేషియాలో వర్ధాధార అరణ్యాలతో 1,425 చదరపు కిలోమీటర్ల మాన్‌గ్రోవ్స్ కూడా ఉన్నాయి. మలేషియాలో ద్వీపకల్పంలో 8,500 జాతుల లతలు ఉన్నాయి. తూర్పు మలేషియా అరణ్యాలలో 2,000 జాతుల చెట్లు ఉన్నాయి. ప్రతి హెక్టారుకు 240 జాతుల చెట్లు ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం కలిగిన ప్రదేశంగా ప్రసిద్ధిచెంది ఉంది.

సంరక్షణా వివాదాలు మార్చు

వ్యవసాయం కొరకు, కొయ్య కొరకు చెట్లు నరికివేసిన కారణంగా దేశంలోని వృక్షసంపద చాలావరకు నాశనం అయింది. సారవాక్ లోని వర్షారణ్యాలు 80% కనుమరుగైంది. చెట్ల నరికివేత కారణంగా తూర్పుమలేషియా వరదలతో తీవ్రంగా బాధపడింది. మలేషియా ద్వీపకల్పంలో వృక్షాలు 60% కనిపించకుండా పోయాయి. ప్రస్తుత రీతులో అరణ్యాల నరికివేత జరిగితే 2020 నాటికి మలేషియా అరణ్యాలు పూర్తిగా నాశనం కాగలవని భావిస్తున్నారు. జంతువులకు, శీలీంద్రాలకు, మొక్కల జీవనానికి అననుకూల వాతావరణం ఏర్పడింది. అడవులను నరికి తోటల పెంపకానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అరణ్యాలు నేషనల్ పార్కులకు పరిమితం అయింది. నివాసప్రదేశనాశనం సముద్రజీవుల జీవితశైలిని ఆపదకు గురి చేస్తున్నది. చట్టవిరోధమైన చేపలవేట చేపలవేటలో ఉపయోగించే డైనమైట్, పాయిజనింగ్ వంటివి సముద్రజీవుల క్షీణతకు కారణం ఔతుంది.

వ్యవసాయం, కొయ్య కొరకు అడవులను నరికివేయడం వృక్షసంపదకు నష్టం వాటిల్లడమే కాక దేశపర్యావరణం కలుషితమవడానికి కారణం అయింది. సారవాక్ లోని వర్షారణ్యాలు 80% నాశనం అయ్యయి. అరణ్యాలు నరికివేత వలన తూర్పు మలేషియా వరదలతో తీవ్రనష్టాలను చవిచూసింది. మలేషియా ద్వీపకల్ప అరణ్యాలలో 60% కనపించకుండా పోయాయి. ప్రస్తుత రీతిలో అరణ్యాల నరికివేత జరిగితే 2020 నాటికి అరణ్యాలు పూర్తిగా నాశనం కాగలవని భావిస్తున్నారు. అరణ్యల నరికివేసి తోటల పెంపకానికి ముఖ్యత్వం ఇవ్వడం జంతువులకు, శీలీంద్రాలు, మొక్కల జీవనశైలికి పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం మిగిలిఉన్న అరణ్యాలు నేషనల్ పార్కులకు మాత్రమే పరిమితమైంది. నివాసప్రాంతాల నాశనం సముద్రజీవులను ప్రమాదానికి గురిచేసింది. మరొక ప్రధాన సమస్య చట్టవిరుద్దంమైన చేపలవేట. చేపలవేటలో డైనమైట్ ఉపయోగం, పాయిజన్ ఉపయోగం పర్యావణానానికి పెనుముప్పును కలిగిస్తుంది. 1950 నుండి ప్రస్తుత కాలానికి లెదర్ బాక్ తాబేళ్ళ సంఖ్య ఇప్పటికే 98% క్షీణించింది. కొన్ని జంతువుల క్షీణతకు వేట ఒక కారణం ఔతుంది. అధికౌపయోగం, జంతువుల శరీరభాగాలు వాణిజ్య ఆదాయానికి ఉపయోగించడం సముద్రజీవుల నుండి పులులు అంతరించేదశకు చేరుకోవడానికి కారణమౌతున్నాయి. అనియంత్రిత పర్యాటక పరిశ్రమ అభివృద్ధి సముద్రజీవుల ఉనికిని ప్రమాదంలో పడివేసింది.

మలేషియన్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆర్ధికప్రగతి సాధించడానికి కృషిచేస్తున్నది. అయినప్పటికీ కొన్ని పెద్ద సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు కూడా తలెత్యుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ దుష్ప్రభాలు, అడవుల నరికివేత కారణంగా పెరిగిన కాలుష్యం సంస్యలను ఎదుర్కొంటున్నది. ఫెడరల్ ప్రభుత్వం సంవత్సరానికి 10% కొయ్య పరికపాల వినియోగం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది. దేశంలో అరణ్యాల పరిరక్షనిమిత్తం తూర్పు మలేషియాలో 23, మలేషియా ద్వీపకల్పంలో 5 మొత్తం 28 నేహనల్ పార్కులు స్థాపించబడ్డాయి. సిపడాన్ దీవుల వంటి ప్రదేశాలలో పర్యాటకుల రాకను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. జంతువుల రవాణా పెద్ద సమస్యగా భావించబడుతుంది. మలేషియా ప్రభుత్వం బ్రూనై, ఇండోనేషియా ప్రభుత్వాలతో చర్చింది జంతువుల రవాణా తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.

ఆర్ధికం మార్చు

మలేషియా స్వేచ్ఛ విఫణి, కొత్తగా పారిశ్రామిక వాణిజ్యం కలిగిన దేశం. మలేషియా ప్రభుత్వం దేశం యొక్క స్థూలమైన ఆర్ధికప్రగతికి గుర్తించ తగిన పాత్ర వహించింది. ఆసియాలో ఉత్తమ ఆర్ధిక ప్రగతి సాధించినదేశాలలో మలేషియా ఒకటి. మలేషియా 1957 నుండి 2005 వరకు సంవత్సరానికి సరాసరి 6.5% జి.డిపి. అభివృద్ధి సాధించింది. 2011 లో జి.డి.పి అభివృద్ధి 45000 కోట్ల అమెరికన్ డాలర్లు. ఇది ఆదియా ఆర్ధిక ప్రగతిలో 3 వ స్థానం, ప్రపంచ ఆర్ధిక ప్రగతిలో 29వ స్థానం. 1991 లో మలేషియా ప్రధాని మహాదిర్ బిన్ మొహమ్మద్ తన భవిస్యత్దర్శన వివరణలో 2020 నాటికి మలేషియా పారిశ్రామిక రంగంలో స్వయంసమృద్ధి సాధించగలదన్న ఆశాభావం వ్యక్తపరిచాడు. ప్రభుత్వ మంత్రి అయిన " తాన్ స్రి నార్ మొహమ్మద్ " మలేషియా అభివృద్ధి చెందిన దేశానికి అవసరమైన సకలవసతులను కలిగి ఉన్నదని ఉద్ఘాటించాడు.

1970 లో గనులు, వ్యవసాయ ఆధారిత ఆర్ధికాభివృద్ధి విభిన్న రంగాలకు చెందిన ఆర్ధిక ప్రగతిగా రూపాంతరం చెందడం మొదలైంది. 1980 నుండి పాతిశ్రామిక ప్రగతి మలేషియా ఆర్ధికరంగాన్ని ముందుకు నడిపించింది. అధికమొత్తంలో పెట్టిన పెట్టుబడులు ఇందులో ప్రధాన పాత్రవహించాయి. 1997 ఆసియన్ ఆర్ధిక పతనం నుండి మలేషియా ఆర్ధిక రంగం పొరుగు దేశాలకంటే ముందే కోలుకుని ఆర్ధికపతనానికి ముందున్న తలసరి 14,800 అమెరికన్ డాలర్ల స్థాయికి చేరుకున్నది. వివిధ సంప్రదాయ ప్రజల మధ్య ఆర్ధిక అసమానతలు ఉన్నాయి. దేశజనాభాలో మూడవ వంతు ఉన్న చైనీయుల పెట్టుబడులలో 70% ప్రగతిని సాధించారు.

మలేషియాను ఆనుకుని ఉన్న మలక్కా స్ట్రెయిట్ అంతర్జాతీయ వాణిజ్యానికి అవసరమైన తోడ్పాటును అందిస్తుంది. మలేషియా సహజ, వ్యవసాయ వనరులను ఎగుమతి చేస్తుంది. మలేషియా ఎగుమతి చేస్తున్న విలువైన వనరులలో పెట్రోలు ప్రధానమైనది. ఒకప్పుడు మలేషియా టిన్, రబ్బర్, పాం ఆయిల్ ఏగుమతులలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అయినప్పటికీ మలేషియా ఆర్ధిక రంగం వాటి నుండి వేరు ఉత్పత్తులకు మారినా పాం ఆయిల్ ఎగుమతిలో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది.

మలేషియా విభిన్న రంగాల ఆర్ధికప్రగతి కొరకు చేసిన కృషి కారణంగా దిగుమతి వస్తువుల మీద ఆధాపపడడాన్ని తగ్గించు కున్నది. ప్రభుత్వం పర్యాటకరంగ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా పర్యాటకం దేశ ఆర్ధికవనరులలో 3వ స్థానం వహిస్తున్నది. పర్యాటకరంగం ద్వారా దేశానికి గుర్తించతగినంత విదేశీమారకం లభిస్తున్నది. అయినప్పటికీ పరిశ్రమలు అభివృద్ధి కారణంగా వాయు, జల కాలుష్యం అధికమైంది. దీనికి అరణ్యాల తరుగుదల మరొక కారణంగా మారింది.

మౌలిక నిర్మాణాలు మార్చు

అసియాలో అత్యంత అభివృద్ధి చేందిన దేశాలలో మలాఏషియా ఒకటి. మలేషియా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దక్షిణాసియా దేశాలలో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానం సింగపూర్‌కు దక్కుతుది. మలేషియా ఫిక్సెడ్ లైన్ చందాదారుల సంఖ్య 4.7 కోట్లు. అలాగే సెల్యులర్ చందాదారుల సంఖ్య 3 కోట్లు. దేశంలో 7 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది పోర్ట్‌క్లాంగ్. దేశంలో 200 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. వీటిలో టెక్నాలజీ పార్క్ మలేషియా, కులిమ్- హైటెక్ పార్క్ ప్రత్యేకత సంతరించుకున్నాయి. ప్రజలలో 95% ప్రజలకు మంచినీటి సరఫరా జరుగుతూ ఉంది. కాలనీరాజ్య కాలంలో ఆర్ధిక ప్రాముఖ్యత కలిగిన నగరాలు, రక్షణ అవసమైన ప్రాంతాలు అభివృద్ధి మీద మాత్రమే దృష్టి సారించబడింది. గ్రామప్రాంతాలు అభివృద్ధి కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయబడినప్పటికీ అవి ఇంకా వెనుకబడిన ప్రాంతాలుగానే పరిగణించబడుతున్నాయి. మలేషియా ద్వీపంలోని పడమటి తీరప్రాంతం ఇందులో ఒకటి. నగరప్రాంత టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ శక్తివంతంగా ఉన్నప్పటికీ గ్రామవాసులకు వసతుల కొరత ఉంది.

మలేషియా రహదారుల పొడవు 98,721 కిలో మీటర్లు. ఇదికాక దేశంలో అత్యంత పొడవైన 1,821 కిలోమీటర్ల పొడవున్న నార్త్-సౌత్ ఎక్స్‌ప్రెస్ వే అదనం. 800 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్ వే తాయ్ సరిహద్దుల నుండి సింగపూర్ వరకు ఉంటుంది. తూర్పు మలేషియా రహదార్లు మలేషియా ద్వీపకల్ప రహదార్లకంటే నాణ్యతలోను అభివృద్ధిలోను తక్కువ స్థాయిలో ఉంటాయి. మలేషియాలో 118 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో 38 విమానాశ్రయాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. మలేషియా అధికారిక విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ విమానసేవలందిస్తున్న మలేషియా ఎయిర్ లైన్ విమానాశ్రయం. ఈ విమానశ్రయం కార్గో సేవలు కూడా అందిస్తుంది.

మలేషియాలో రైల్వే మార్గాల పొడవు 1,849 కిలోమీటర్లు. కోలాలంపూర్ వంటి నగరాలలో లైట్ రైల్ ట్రాంస్ పోర్ట్ సిస్టం పనిచేస్తుంది. కోలాంపూర్ నుండి సింగపూర్ వరకు ఉన్న రైల్ మార్గం ది ఆసియన్ రైల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తుంది. ఈ మార్గాన్ని సింగపూర్ నుండి చైనా వరకు నిర్మించాలని యోచిస్తున్నారు.

మలేషియా సంప్రదాయక విద్యుత్తు చమురు, సహజవాయు ఆధారితమైనది. దేశం 13 గిగాబైట్ల విద్యుత్తును ఉత్పత్తుచేసే శక్తి కలిగి ఉంది. అయినప్పటికీ దేశంలోని సహజవాయువుల నిలువలు 33 సంవత్సరాకు సరిపోతుంది. చమురు నిలువలు 19 సంవత్సరాల విద్యుత్తు అవసరాలను తీర్చగలవు. విద్యుత్తు అవసరాలు అధికమౌతున్న కారణాన మలేషియా కొత్త వనరుల అభివృద్ధికి కృషిచేస్తుంది. 16% విద్యుత్తు హైడ్రోఎలెక్ట్రిక్ విధానంలో ఉత్పత్తి చేయబడుతుంది. మిగిలిన 84% విద్యుత్తు దర్మల్ విధానంలో ఉత్పత్తి చేయబడుతుంది. ది ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీని ప్రభుత్వ ఆధీన సంస్థ అయిన పెట్రోనాస్ అధిగమించింది. ది ఎనర్జీ కమిషన్ ఆఫ్ మలేషియా నియంత్రణలో విద్యుత్తు రంగం పనిచేస్తుంది.

విజ్ఞాన శాస్త్రం , సాంకేతికం మార్చు

మలేషియా నైన్స్ విధానాలను మినిస్ట్రీ అఫ్ నైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ శాఖ నియంత్రిస్తుంది. సెమీకండక్టర్ డివైసెస్, ఎలెక్ట్రికల్ వస్తువులు, ఇఫర్మేషన్ ఆండ్ కమ్యూనికేషన్ సాంకేతిక ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రపంచదేశాలలో మలేషియా ఒకటి. 1996 లో మలేషియా మొదటి ఉపగ్రహ ప్రయోగం చేసింది. మీశాట్ శాటిలైట్ సిస్టంస్ ఎస్.డి. ఎన్. బి.హెచ్.డి (ముందుగా ఈ సంస్థ బినారియాంగ్ శాటిలైట్ సిస్టంస్ ఎస్.డి.ఎన్. బి.హెచ్.డి) అనే ప్రైవేట్ సంస్థ బోయింగ్ శాటిలైట్ సిస్టం నుండి మీశాట్-1, మీశాట్-2, మీశాట్-3, మీశాట్-3ఎ. మలేషియా ప్రభుత్వం వీటిని వరుసగా 2006, 2009 లో రోదసీలో ప్రవేశపెట్టింది. మలేషియా స్వయంగా టియుంగ్‌శాట్-1 పేరుతో రిమోట్ సెంసింగ్ శాటిలైటును విజయవంతంగా రూపొందించింది. ఈ శాటిలైట్ రూపకల్పనకు మలేషియా ఆస్ట్రో టెక్నాలజీ ఎస్.డి.ఎన్ బి.హెచ్.డి (ఏ.టి.ఎస్.డి) (మలేషియా), సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ (యునైటెడ్ కింగ్‌డం) సహకారంతో రూపొందించింది. 2000 లో ఈ శాటిలైటును భూమి దిగువ కక్ష్యలో బైకనుర్ కాస్మోడ్రోం (కజకిస్థాం) వద్ద ప్రవేశపెట్టారు. మలేషియా రెండవ సెంసిటివ్ ఉపగ్రహం " రజాక్ శాట్ "ను 2009 జూలై 14 న రోదసీలో ప్రవేశపెట్టారు. రజాక్‌శాట్-2 ఉపగ్రహం 2015న రోదసీలో ప్రవేశపెట్టాలని ప్రణాళిక వేయబడింది. 2002 లో తన స్వంత రోదసీ పరిశోధనను ఆరంభించింది. 2006 న రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ తో జరుగిన పలు బిలియన్ల వ్యాపారానికి బదులుగా రష్యా ప్రభుత్వం ఒక మలేషియన్ పౌరుడిని అంతర్జాతీయ రోదసీ కేంద్రానికి పంపింది. 1970లో మలేషియా స్వీయ రక్షణ సామర్థ్యం సాధించడానికి కొన్ని సైనిక వసతులను ప్రైవేటీకరణ చేసింది. ఇందు వలన మలేషియా స్వయం రక్షణశక్తిని సాధించడానికి తోడ్పడింది. ప్రభుత్వం ఈ పరిశ్రమలకు నిరంతర సహకారం అందిస్తూ మార్కెటింగ్ ఏక్టివిటీ, పోటీ తత్వం ప్రోత్సహిస్తుంది.

గణాంకాలు మార్చు

2010 గణాంకాలను అనుసరించి మలేషియా జనసంఖ్య 2,83,34,135. మలేషియా జనసాంద్రతలో ప్రపంచంలో ద్వితీయస్థానంలో ఉంది. మలేషియాలో పలు సంప్రదాయాల ప్రజలు నివసిస్తున్నారు. మలేషియాలో మలయా ప్రజల శాతం 50.4%, భూమిపుతేరా ప్రజల శాతం 11%, ఉన్నతు. మలయా ప్రజలు మలయా సంప్రదాయాలు , సంకృతిని అవలంభిస్తున్న ముస్లిం మతానికి చెందినవారు. వారు రాజకీయంగా ఆధిక్యత కలిగి ఉన్నారు. భూమిపుతేరా ప్రజలు మలయాకు చెందని స్థానిక హోదా కలిగి ఉన్నారు. తాయ్స్, ఖేమర్లు, చాంస్ , స్థానిక సబాహ్, సారవాక్ ప్రజలు మలేషియన్ ప్రజలలో భాగమే. సారవక్‌లో సగానికి పైగా సబాహ్‌లో మూడింట రెండు వంతుల ప్రజలు మలాయాకు చెందని భూమిపుతేరా ప్రజలు ఉన్నారు. మలేషియా ద్వీపకల్పంలో స్వల్పంగా ఉన్న ఆదివాసులను ఔరాంగ్ అస్లి అని అంటారు.

భూమిపుతేరా అంతస్తు పొందని ఇఅతర అల్పసంఖ్యాకుల శాతం 23.7%. చైనా వారసత్వ ప్రజలు, భారతీయ వారసత్వ ప్రజల శాతం 7.1%, చైనీయులు చారిత్రకంగా వాణిజ్య ఆర్ధిక రంగాలలో ఆధిక్యత కలిగి ఉన్నారు. పెనాంగ్‌లో చైనీయులు బహుళ సంఖ్యలో ఉన్నారు. 19వ శతాబ్దంలో మలేషియాకు భారతీయుల వలస ప్రారంభం అయింది. భారతీయ ప్రజలలో అత్యధికులు తమిళులు. మలేషియాలో పుట్టినంత మాత్రాన మలేషియన్ పౌరసత్వం లభించదు. అయినప్పటికీ మలేషియా వెలుపలి దేశాలలో నివసిస్తున్న భార్యాభర్తలకు పుట్టిన పిల్లలకు మలేషియా పౌరసత్వం లభిస్తుంది. రెడు దేశాల పౌరసత్వానికి దేశంలో అనుమతి లేదు. మలేషియన్ ద్వీపకల్పంకంటే మలేషియన్ బోర్నియో, సారవాక్ , సబాహ్ రాష్ట్రాలలో పౌరుల వలసవిధానంలో నిబంధనలు మారుతుంటాయి. మలేషియాలోని ప్రతిపౌరుడికి 12 సంవత్సరాల తరువాత " మైకాడ్ " అనే బయోమెట్రిక్ స్మార్ట్ చిప్ గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ గుర్తింపు కార్డును పౌరులందరూ అన్ని సమయాలలో దగ్గర ఉంచుకోవాలి.

విద్యావిధానం మార్చు

మలేషియా విద్యాబిధానంలో కిండర్‌గార్డెన్ తప్పనిసరి కాకపోయినా తరువాత ఆరుసంవత్సరాల చదువుమాత్రం తప్పనిసరిగా అభ్యసించాలి. తరువాత ఐదు సంవత్సరాల విద్యను కొనసాగించడం పౌరుల స్వేచ్ఛను అనుసరించి ఉంటుంది. ప్రాథమిక విద్యాపాఠశాలలు రెండువిధాలుగా పనిచేస్తుంటాయి. నేషనల్ ప్రైమరీ పాఠశాలలలో విద్య మలాయ్ భాషలో బోధించబడుతుంది. ప్రాంతీయ పాఠశాలలలో చైనా భాష లేక తమిళ భాషలలో విద్యాబోధ చేయబడుతుంది. ఐదు సంవత్సరాల మాధ్యమిక విద్యావిధానంలో చివరి సంవత్సరం విద్యార్థులు " మఏషియన్ సర్టిఫికేట్ ఆఫ్ ఎజ్యుకేషన్ ఎగ్జామినేషన్ " పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులు కావలసిన అవసరం ఉంది. 1999 లో మెట్రిక్యులేషన్ పరీక్షావిధానం ప్రవేశపెట్టిన తరువాత విద్యార్థులు 12 మాసాల విద్యను మెట్రిక్యులేషన్ కాలేజ్ పూర్తిచేసిన తరువాత విద్యార్థులు ప్రాంతీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశించడానికి అర్హులు ఔతారు. అయినప్పటికీ భూమిపుతేరా సంతతికి చేరని వారికి మెట్రిక్యులేషన్ కాలేజ్‌లలో 10% స్థానాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఇతరవివరాలు మార్చు

2009లో మలేషియాలో 1000 మంది జననాలలకు 6 శిశుమరణాలు ఉన్నాయి. మలేషియాలో మెడికల్ పర్యాటకం (వైద్యపర్యాటకం) అభివృద్ధిచేసి 2009నాటికి వ్యక్తి ఆయుహ్ప్రమాణం 75 సంవత్సరాలకు ఎదురుచూసారు. మలేషియాలో ఆరోగ్యసంరక్షణ కొరకు ప్రభుత్వరంగ సాంఘికాభివృద్ధి నిధిలో 5% నిధిని వ్యయం చేస్తున్నారు. మలేషియా మొత్తం 2.8 కోట్ల జనాభాలో మలేషియా ద్వీపకల్పంలో నివసించే ప్రజల సంఖ్య 2 కోట్లు. మలేషియాలో నగరాలలో నివసించే వారి శాతం 70%. మలేషియా రాజధాని నగరమైన కోలాలంపూర్ నగరమే దేశంలో అతి పెద్ద నగరం. అలాగే ఈ నగరం దేశానికి ఆర్ధిక, వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతుంది. 1999లో దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల కొరకు నిర్మించబడిన నగరం పుత్రజయ. పరిశ్రమలలో పనిచేస్తున్న శ్రామికుల రాక తీవ్రమైన సమయంలో కోలాలంపూర్ రద్దీని తగ్గించడానికి ఫెడరల్ ప్రభుత్వ న్యాయశాఖ, ప్రభుత్వనిర్వహణా శాఖ కార్యాలయాలు పుత్రజయా నగరానికి తరలించబడ్డాయి. సబాహ్ నగరంలోని కార్మికులు కాక దేశంలో 30 లక్షల వలస కార్మికులు పనిచేస్తున్నారని అంచనా. మలేషియా జనసంఖ్యలో ఇది దాదాపు 10% ఉంటుంది. దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న కార్మికుల సఖ్య 20 లక్షలు. మలేషియా 1,71,500 శరణార్ధులకు, ఆశ్రయం కోరిన వారికి ఆతిథ్యం ఇస్తుంది. సుమారు 78,000 మంది బర్మాదేశానికి చెందినవారు. 72,400 మంది ఫిలిప్పైన్ దేశానికి చెందినవారు. 17,700 మంది ఇండోనేషియా దేశానికి చెందినవారు.

మతం మార్చు

మలేషియా దేశం ఇస్లాం మతాన్ని దేశీయమతంగా నిర్ణయిచినా పౌరులకు మతస్వాతంత్ర్యం ఇచ్చింది. 2010 గణాంకాలను అనుసరించి జనసంఖ్యలో 61.3 % ఇస్లాం మతావలంబీకులు, 9.2% క్రైస్తవ మతావలంబీకులు, 6.3% హిందూ మతావలంబీకులు, 1.3% కాంఫంక్షనిజం చెందిన వారని అంచనా. తాయిజం, ఇతర చైనా మతావలంబీకులు 0.7%, ఇతర మతావలంబీకులు లేక నాస్థుకుల గురించిన మిగిలిన 1.4% ప్రజల సమాచారం అందుబాటులో లేదు.

మలేషియా చట్టాలను అనుసరించి మలాయ్ సంప్రదాయక జాతికి చెందిన వారందరూ ముస్లిములుగా భావించబడుతున్నారు. 2010 గణాంకాలను అనుసరించి చైనీయులలో 83.6% బుద్ధ మతావలంబీకులు. తాయిజం మతావలంబీకుల శాతం 11.1%. పెనాంగ్ వంటి ప్రదేశాలలో స్వల్పసంఖ్యలో హూయి- ముస్లిములు ఉన్నారు. భారతీయులలో 86.2% ప్రజలు హిందూ మతావలంబీకులు, 6% ప్రజలు క్రైస్తవ మతావలంబీకులు, ముస్లిములు 4.1%. మలాయ్‌కు చెందని భూమిపుతేరా ప్రజలలో క్రైస్తవమతం 46.5%, మిగిలిన వారిలో 40.4% ప్రజలు ముస్లిములు. ముస్లిములు వారి మతపరమైన సమస్యలను షరియా న్యాయస్థానాలకు బద్ధులై ఉంటారు. ఇస్లాం న్యాయాధిపతులు ఇస్లాం చట్ట పాఠశాల అయిన షాహి-ఇ సూత్రాలను అనుసరించాలని భావిస్తారు. షరియా న్యాయస్థానాలలో వివాహం, వారసత్వం, వివాహరద్దు, స్వధర్మత్యాగం, మతమార్పిడి, ఇతరుల ఆధీనంలో ఉండడం వంటి సమస్యల పరిష్కారాలకు పరిమితమై ఉంటాయి. షరియా న్యాయస్థాన పరిధిలో సివిల్, క్రిమినల్ నేరాలు పరిష్కరించబడవు. సుప్రీం కోర్ట్ ఆదేశానుసారం సివిల్ కోర్టులలో ఇస్లాం మతసంబంధ సమస్యలను విచారించదు.

భాషలు మార్చు

మలేషియా అధికారిక భాష మలేషియన్ . ప్రామాణికం చేబడిన మలయాభాషయే మలేషియన్. వాస్తవంగా చారిత్రకమైన అధికారభాష ఆంగ్లభాషే అయినా 1969 జాతి కలవరం తరువాత మలయాభాష అధికారికభాషగా మార్చబడింది. ఆంగ్లం అధికంగా నాట్లాడుతున్న రెండవ భాష అయింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో సైన్స్, గణితం ఆంగ్లభాషలో బోధించబడుతుంది. బ్రిటిష్ ఇంగ్లీష్ ఆధారిత ఆంగ్లభాష మలేషియన్ ఆంగ్లభాషగా గుర్తించబడుతుంది. వ్యాపారంలో మంగ్లీష్ భాషతో ఆంగ్లభాషను కూడా ఉపయోగిస్తుంటారు. మంగ్లీష్ భాష అధికంగా మలేయాభాషను ఉపయోగిస్తూ ఆంగ్లభాష, చైనీస్ భాష, తమిళ్ భాషలను చేర్చి సామాన్యులు మాట్లాడే మిశ్రిత భాషను మంగ్లీష్ అంటారు. మలాయ్ కాక ఇతరభాషల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించదు. మాలాయ్ భాతో ఆంగ్లభాషను చేర్చి వ్రాయసే ప్రజలకు అపరాధ రుసుం విధించబడుతుంది. మలేషియస్లో అనేక ఇతర భాషలను మాట్లాడుతుంటారు. దేశంలో మొత్తం 137 భాషలు సజీవంగా ఉన్నాయి. మలేషియా ద్వీపకల్పంలో 41 భాషలు వాడకంలో ఉన్నాయి. తూర్పుమలేషియాలో వారి స్వంతభాషలున్నాయి అయినప్పటికీ అవి మలాయ్ కంటే ప్రత్యేత కలిగి ఉంటాయి. సారవాక్‌లో గిరిజనుల ప్రధానభాష ఐ.బి.ఎన్, సబాహ్ స్థానికుల ప్రధాన భాష డుసునిక్. చైనీస్ మలేషియన్లు ప్రారంభం నుండి దక్షిణ చైనా భాషలను మాట్లాడుతుంటారు. దేశంలో సాధారణ భాషలు కాంటొనెస్, మాండరిన్, హొక్కియన్, హక్క, హైనానెస్, ఫుజు. మలేషియన్ భారతీయులలో అధికులైన తమిళులు మాత్రం తమిళ భాషను మాట్లాడుతుంటారు. ఇతర దక్షిణాసియా భాషలు కూడా మలేషియాలో అధికంగా మాట్లాడుతుంటారు వీటిలో తాయ్ భాష కూడా ఒకటి. స్వల్పంగా కాకేషియన్ వంశావళి ప్రజలు క్ర్రియోల్ భాధలను మాట్లాడుతుంటారు. పోర్చ్‌గీస్ ఆధారిత మలక్కాన్ క్రోయెల్, స్పానిష్ ఆధారిత చవాకానో భాష.

సంస్కృతి మార్చు

మలేషియా విభిన్న సంస్కృతి, విభిన్న సంప్రదాయ, విభిన్న భాషా సమ్మేళిత ప్రజలు కలిగిన దేశం. మలేషియాలో ఒకప్పుడు నివసించిన ప్రస్తుతం తరలించబడిన పురాతన గిరిజన జాతుల సంస్కృతి మూలకేంద్రంగా చెప్పుకోవచ్చు. మలయాళో విదేశీ వ్యాపారులు ప్రవేశించిన తరువాత చైనీయులు, భారతీయ సంస్కృతి ప్రభావం ప్రస్తుత మలేషియాలో గుర్తించతగినంతగా కనిపిస్తుంది. పర్షియన్, అరబిక్, బ్రిటిష్ వంటి ఇతర సంస్కృతులు కూడా మలేషియా సంస్కృతిలో ఒక భాగమే. ప్రభుత్వ నిర్మాణంలో ఉన్న సాంఘిక సమైక్యత కారణంగా అల్పసంఖ్యాక సంప్రదాయ ప్రజలు అధికసంఖ్యాక సప్రదాయ ప్రజలు సమైక్యత సాధ్యమైంది.

మలేషియా సంస్కృతిలో ప్రభావశీలమైన స్థాయిలో భారతీయ సంస్కృతి, మతం, నైతిక, ఆర్థికాది వ్యవహారాల్లో భారతదేశపు ప్రభావం కనిపిస్తోంది. ప్రాచీన హిందువులు పశ్చిమంలో ఆఫ్రికా ఖండపు మొడగాస్కర్ దీవి నుంచి మొదలుకొని తూర్పున మలేషియా మీదుగా జావా, సుమత్రా ద్వీపాల వరకూ వ్యాపారం విస్తరించారు. మతం, నైతికత, ఆర్థికం, జ్యోతిష్యం, గణితం మొదలైన విషయాల్లో వారి సాంకేతిక పదాలు సంస్కృత పదాల్లోనే ఉపయోగిస్తుంటారు. హిందూమతస్తులు ఇక్కడ విస్తరించి ఉన్నారు. అనేక విధాలుగా హిందూనాగరికతను అనుభవించారు.[1]

1971లో ప్రభుత్వం మలేషియన్ సంస్కృతి నిర్వచనంతో " జాతీయ సంస్కృతిక విధానం " తయారుచేసింది. ఈ విధానంలో ఈ భూభాగంలో నివసించిన పురాతన స్థానికుల సంస్కృతి ఆధారంగా మలేషియన్ సంస్కృతి ఉండాలని అలాగే ఇతర సంస్కృతాల నుండి తగిన విధానలను కలుపుకోవాలని, ఇస్లాం తప్పక సంస్కృతిలో ప్రధాన పాత్ర వహించాలని స్పష్టమౌతుంది. అలాగే ఈ విధానాలలో మలయా భాష కూడా ఇతరభాషలలో ఒకటిగా ఉండాలని ప్రతిపాదించింది. మలయాపూర్వీకతకు చెందని ప్రజలలో ప్రభుత్వ జ్యోక్యం కొంత అసహనం సృష్టించింది. ప్రభుత్వ జోక్యం తమ సాంస్కృతిక స్వాతంత్ర్యాన్ని తగ్గిస్తుందని భావించారు. భారతీయులు, చైనీయ అసోసేషన్లు ఇది అప్రజాస్వామికమని సూచిస్తూ ప్రభుత్వానికి మెమొరాండం సమర్పించింది.

మలయా, పొరుగు దేశాలతో ఉన్న కొన్ని సాంస్కృతిక వివాదాలు తొలగిపోయాయి. ప్రత్యేకంగా ఇండోనేషియాతో ఉన్న విభేదాలు తొలగాయి. రెండు దేశాల సంస్కృతి ఒకేలా ఉంటుంది. ఇరుదేశాలు సాంస్కృతిక, సంప్రదాయక అంశాలను పరస్పరం పంచుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ ఆహార విధానాలు, జాతీయగీతం వంటి విధానాలలో వివాదాలు తలెత్తాయి. ఇండోనేషియన్లకు వారి సంప్రదాయ రక్షణలో తీవ్రమైన భావాలుంటాయి. సాంస్కృతిక విభేదాలను తొలగించడానికి ఇరుదేశాలు సమావేశాలు జరిపాయి. విభిన్న సంస్కృతులను కలుపుకునిపోయే విధానాలను అనుసరిస్తున్న మలేషియా సాంస్కృతిక భావాలు తేలికైనవిగా ఉంటాయి.

ఫైన్ ఆర్ట్స్ మార్చు

మలేషియన్ సంప్రదాయ కళలో చెక్కడం, నేత, వెండి వస్తువులులు తయారీలపై కేంద్రీకృతమై ఉంటుంది. సంప్రదాయ కళారీతులలో చేతితో గ్రామప్రాంతాలలో తయారు చేయబడుతున్న చేతితో అల్లిన బుట్టలు, మలాయ్ వెండి వస్తువులు, అలంకరించిన ఖడ్గాలవంటి సాధారణ కళావస్తువులు, వక్కల డబ్బాలు నేసిన బతిక్, సాంగ్‌కెట్ (జరీ వస్త్రాలు) మలేషియన్ సంప్రదాయక కళావస్తువులలో భాగాలే. తూర్పు మలేషియా స్థానికులు తయారుచేస్తున్న కొయ్య మాస్కులు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కో సంప్రదాయక సమూహానికి ఒక్కో ప్రత్యేక కళారీతి వారసత్వంగా ఉంది. అయినా ఈ కళారీతులలో స్వల్పంగా ఒకదాని ప్రభావం మరొకదాని మీద ఉంటుంది. భారతీయ చారిత్రక ప్రభావం కారణంగా మలాయ్ కళారీతుల మీద ఉత్తరభారతీయ కళాప్రభావం ఉంది.

మలాయ్ సంప్రదాయక సంగీతం, కళలు మలేషియా లోని కేలత్తాన్ - పట్టాని ప్రాంతాలకు చెందినది. ఈ కళలు భారతదేశం, చైనా, తాయ్‌లాండ్, ఇండోనేషియా ప్రభావితమై ఉంటాయి. ఈ సంగీతానికి ఆధారంగా సంగీతసాధనాలు మీటబడుతుంటాయి. సంగీతసాధనాలలో జండాంగ్ (డ్రం) కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మలేషియన్లు 14 రకాల సంప్రదాయక డ్రంలను ఉపయోగిస్తారు. డ్రం, ఇతర సంగీతసాధనాలు సహజసిద్ధంగా లభించే వస్తువులతో తయారు చేస్తారు. మలయా ప్రజలు సంగీతం సంప్రదాయకంగా కథను చెప్పడానికి, జీవితచక్రంలో జరిగే ప్రత్యేక సందర్భాలలో, పంటచేతికి వచ్చే కాలంలో ఒకభాగంగా ప్రదర్శించబడుతుంది. ఈ సంగీతం ఒకప్పుడు దూరంలో ఉన్నవారుకి సంకేతం అందించడానికి ఉపయోగించేవారు. వివాహసమయాలలో, మరణానంతర సంప్రదాయాలలో అగంగ్, కులింతాంగ్ బృంద సంగీతాలు చోటుచేసుకుంటాయి. పొరొగు భూభాలైన ఫిలిప్పైంస్, ఇండోనేషియాలోని కలిమంతన్, బ్రూనై ఈ బృందసంగీతాలు సహజమే.

మలేషియాకు శక్తివంతమైన గాత్రసంగీత సప్రదాయం ఉంది. లిపి అక్షరాలు వ్రాత ఈ భూగంలో ప్రవేశించడానికి ముందే గాత్రసంగీతం జీవం పోసుకున్నది. ఒక్కో సుల్తానేటుకు వారి స్వంత సాహిత్యం ఉంది. అలాగే గతంలో జరిగిన సంఘటనల ఆధారిత కథలు, ఇస్లాం నుండి వచ్చిన కథలు లిపిరూపంలోకి రాక మునుపు శబ్ధరూపంగా చెప్పబడేవి. మొదటి మలయ్ సాహిత్యం అరబిక్ భాషలో వ్రాయబడింది. 1303లో తెరెంగను రాయి మీద చెక్కబడిన శలాశాసనం మొదటి మలాయ్ శిలాశాసనంగా భావిస్తున్నారు. భారతీయ, చైనా సాహిత్యం మలేషియాలో అత్యధికులచే చదవబడుతున్నది. భారతీయ, చైనా మాట్లాడే ప్రజల సంఖ్య క్రమక్రమంగా అధికరిస్తూనే ఉంది. 19వ శతాబ్దం నుండి సాహిత్యం దేశంలోనే ముద్రించబడుతుంది. సాధారణంగా ముద్రించబడే సాహిత్యంలో ఆంగ్లభాష కూడా ఒకటి. 1971లో మలయా ప్రభుత్వం దేశీయ భాధలను నిర్వచించే చర్యలను చేపట్టింది. మలయా భాషలో ముద్రించబడుతున్న సాహిత్యం " లిట్రేచర్ ఆఫ్ మలయా "గా గౌరవించబడుతుంది. ఇతర భూమిపుత్రా భాషా సాహిత్యం " రీజనల్ లిటరేచర్ " అంటారు. ఇతర భాషా సాహిత్యాన్ని " సెక్టోరియల్ లిటరేచర్ " అంటారు. మలాయ్ కవిత్వం అత్యధికంగా అభివృద్ధి చెందింది. కవిత్వాన్ని మలయాళో పలు రూపాలలో వాడుతుంటారు. ది హికయత్ రూపం ప్రజాదరణ పొందింది. పంటన్ కవిత్వం మలయా నుండి ఇతర భాషలకు విస్తరించింది.

ఆహారం మార్చు

మలేషియా ఆహారసంప్రదాయంలో అక్కడి విభిన్న ప్రజలసంప్రదాయం ప్రతిబింబింస్తుంది. దేశంలోని విభిన్న సంప్రదాయాలు పొరుగు ప్రాంతాల సంప్రదాయాలు ఆహారసంస్కృతి మీద తగినంత ప్రభావం చూపుతుంది. అధిక ప్రభావం మలాయ్, చైనా, భారతదేశం, తాయ్, జాపాన్, సుమత్రా దేశప్రజల ఆహారసంస్కృతి ప్రతిబింబిస్తుంది. దేశంలో ఆహారసంప్రదాయంలో అధికంగా ఆసియన్ ఆహారసంప్రదాయంలో భాగమైన స్పైసీనెస్ ఒక భాగంగా ఉంటుంది. ఆహారాల తయారీ సింగపూర్, బ్రూనై ఆహారాలను పోలి ఉంటుంది. అలాగే ఫిలిప్పైన్ ఆహార పద్ధతులు మలయా ఆహార విధానాలలో ఒక భాగమే. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఆహారవిధానం కనిపిస్తుంది. తరచుగా మలేషియా ఆహారపదార్ధాలు స్థానిక ఆహారాలకు వ్యత్యాసంగా ఉంటుంది.

ఒక్కోసారి ఆహారశాలలో వారి సం ప్రదాయ ఆహారాలు కనిపించవు. ఉదాహరణగా మలేషియాలోని రెస్టారెంట్లలో మలయా ఆహారపదార్ధాలను విక్రయిస్తుంటారు. ఒక సంప్రదాయక ఆహారాన్ని ఇతర ఆహారసంప్రదాయ శైలిలో కూడా తయారు చేస్తుంటారు. అంటే అధికంగా మలేషియన్ ఆహారవిధానం వివిధ సంప్రదాయ సమ్మిళిత ఆహారవిధానంగా రూపుదిద్దుకుని మలేషియా ఆహారానికి ఒక ప్రత్యేకతను ఇచ్చింది. పలు మలేషియన్ ఆహారాలలో బియ్యం అధికంగా ఉపయోగిస్తారు. ప్రాంతీయ ఆహారాలలో మిరపకాయలు అధికంగా వాడబడినా ఆహారపదార్ధాలు మాత్రం అంత కారంగా ఉండవు.

మాధ్యమం మార్చు

మలేషియాలోని ప్రధాన వార్తాపత్రికలు, ప్రభుత్వం, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న రాజకీయ పార్టీలకు చెందినవే. కొన్ని ప్రధాన ప్రతిపక్షాలు కూడా వారి స్వంత వార్తా పత్రికలను నడుపుతున్నారు. మాధ్యమం అనుసరిస్తున్న విధానాలు దేశాన్ని రెండు భాగాలుగా విడదీస్తాయి. దేశంలో చైనా, మలయు, ఆంగ్లం, తమిళ దినపత్రికలు లభిస్తున్నాయి. మాధ్యమం తరచుగా ఇండోనేషియా, మలేషియా మధ్య తలెత్తుతున్న వివాదాలను విమర్శిస్తుంది. మలేషియన్లు ఇండోనేషియన్లను తక్కువచేయడం కూడా మాధ్యంమం విమర్శించే విషయాలలో ఒకటి.

దేశంలో మాధ్యమానికి స్వల్పమైన స్వాతంత్ర్యం ఉంది. వార్తా పత్రికలు ప్రభుత్వానికి కొంత సమాధానం చెప్పవలసిన పరిస్థితి కూడా ఉంది. 2007లో ఎన్నికల ముందు పత్రికలను నియత్రించడానికి ప్రయత్నించింది. ప్రభుత్వ ప్రతినిధులు మొత్తం ప్రైవేటు టెలివిజను, రేడియోలకు ప్రతిపక్షాల ఉపన్యాసాలను పరిశీలించి ప్రసారం చేయాలని సూచించింది. డెమోక్రటిక్ ఏక్షన్ పార్టీ దీనిని ఎదిరిస్తూ ఉద్యమం చేసింది. ప్రింటింగ్ ప్రెస్, ప్రచురణల చట్టం భావప్రకటనా స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నాయన్న భావం కనిపిస్తుంది.

పండుగలు, సెలవు దినాలు మార్చు

మలేషియాలో సంవత్సరం పొడవునా పలు పండుగలు, పలు సెలవు దినాలు ఉండడం గమనించవచ్చు. కొన్ని ప్రభుత్వం మంజూరు చేసే సెలవు దినాలు, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రత్యేక సెలవు దినాలు. ఇతర పండుగలు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలకు చెందినవి. ప్రధాన సాంప్రదాయక ప్రజలు అతిముఖ్యమైన పండుగను సెలవుదినంగా ప్రకటిస్తారు. అత్యంత ప్రధానమైన ప్రభుత్వ సెలవు దినం ఆగష్టు 31 వ తేదీ హరీ మర్డెకా (స్వతంత్ర దినం). 1957న స్వాతంత్ర్యం లభించినదానిని గుర్తుచేసుకుంటూ ఈ వేడుక జరుపుకుంటారు. మలేషియా దినం సెప్టెంబరు 16. ఫెడరేషనుగా ఏర్పడిన 1963 సెప్టెంబరు 16 గుర్తుగా జరుపుకుంటారు.

రాష్ట్రీయ మతమైన ముస్లిం సెలవుదినాలకు ప్రత్యేకత ఉంది. హరిరాయ పుయాషా (హరి రాయ ఐదిల్ ఫిత్రి) హరి రాయ హజీ ( హరిరాయ ఐదిలాధా), మైలీ దర్ రసూల్ (ప్రవక్త పుట్టిన రోజు),, ఇతర పండుగలు. మలేషియన్ చైనీయులు చైనా కొత్త సంవత్సరం, ఇతర చైనా సాంప్రదాయ పండుగలు. మలేషియా హిందువులు దీపావళి, తైపూజం పండుగలకు దేశం మొత్తం నుండి బాటూ గుహలకు తీర్ధయాత్రగా వెళుతుంటారు. మలేషియా క్రైస్తవులు ఇతర క్రైస్తవులు జరుపునేలా క్రిస్ట్‌మస్, ఈస్టర్ పండుగలను జరుపుకుంటారు. అలాగే హార్వెస్ట్ ఫెస్టివల్ అయిన గవాయి పండుగను కూడా జరుపుకుంటారు. ఓపెన్ హౌస్ మలేషియన్లు అన్ని పండుగలలో పాలుపంచుకుంటారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Retrieved 9 December 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=మలేషియా&oldid=3851016" నుండి వెలికితీశారు