నీలగిరి జిల్లా

తమిళనాడు లోని జిల్లా
(నీలిగిరి నుండి దారిమార్పు చెందింది)

నీలగిరి జిల్లా, దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలోని జిల్లాలలో ఇది ఒకటి. నీలగిరి అనేది తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య సరిహద్దుల్లో విస్తరించి ఉన్న పర్వతాల శ్రేణికి పెట్టిన పేరు. నీలగిరి కొండలు పశ్చిమ కనుమలుగా అని పిలువబడే పెద్ద పర్వత శ్రేణిలో భాగం. వాటిలో ఎత్తైన ప్రదేశం దొడ్డబెట్ట పర్వతం, దాని ఎత్తు 2,637 మీటర్లు ఎత్తు ఉంది. జిల్లా ప్రధానంగా నీలగిరి పర్వతాల పరిధిలో ఉంది. పరిపాలనా ప్రధాన కార్యాలయం ఊటీ (ఊటకాముడ్ లేదా ఉదగమండలం) లో ఉంది.

Nilgiris district

நீலகிரி மாவட்டம்

Udagamangalam Mavattam
District
The Nilgiri Mountain Railway
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
CountryIndia
రాష్ట్రంతమిళనాడు
జిల్లాNilgiris
EstablishedFebruary 1882
ప్రధాన కార్యాలయంUdhagamandalam
BoroughsUdhagamandalam, Coonoor, Kundah, Kotagiri, Gudalur, Pandalur
ప్రభుత్వం
 • Collector & District MagistrateDr P Shankar IAS
విస్తీర్ణం
 • District5,352 km2 (2,066 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు
2,789 మీ (9,150 అ.)
జనాభా వివరాలు
(2011)[1]
 • District7,35,071
 • సాంద్రత421.97/km2 (1,092.9/sq mi)
 • మెట్రో ప్రాంతం
4,54,609
భాషలు
 • అధికారTamil
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
643001
టెలిఫోన్ కోడ్0423
ISO 3166 కోడ్[[ISO 3166-2:IN|]]
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుTN-43
Coastline0 కిలోమీటర్లు (0 మై.)
Largest cityUdhagamandalam
లింగ నిష్పత్తిM-49.6%/F-50.4% /
అక్షరాస్యత80.01%%
Legislature typeelected
Legislature Strength3
Precipitation3,520.8 మిల్లీమీటర్లు (138.61 అం.)
Avg. annual temperature−6 °C (21 °F)
Avg. summer temperature6 °C (43 °F)
Avg. winter temperature−12 °C (10 °F)
జాలస్థలిnilgiris.nic.in

జిల్లాకు పశ్చిమాన కేరళలోని మలప్పురం జిల్లా, దక్షిణాన కోయంబత్తూర్, పాలక్కాడ్, తూర్పున ఈరోడ్, ఉత్తరాన కర్ణాటకలోని చామరాజ్‌నగర్ జిల్లా, కేరళలోని వాయనాడ్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఇది తమిళనాడు, కేరళ, కర్ణాటక అనే మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్నందున, జిల్లాలో గణనీయమైన మలయాళీ, కన్నడిగ జనాభా నివసిస్తున్నారు.[2]

నీలగిరి జిల్లా బంగారు సహజ గనులకు ప్రసిద్ధి చెందింది. ఇది పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళలో కూడా విస్తరించి ఉన్న నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లోని ఇతర ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది.[3] 2009 ఆగస్టులో ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ రూపొందించిన తమిళనాడులోని (చెన్నై జిల్లా మినహా) సమగ్ర ఆర్థిక పర్యావరణ సూచిక ర్యాంకింగ్ జిల్లాల్లో నీలగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో టీ, కాఫీ తోటలు దాని ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనవి.నీలగిరి జిల్లాలో అన్ని రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లు నిషేధించబడ్డాయి: ఇది తమిళనాడులో మొదటి ప్లాస్టిక్ రహిత జిల్లా

చరిత్రసవరించు

నీలగిరి కొండలలో స్థిరపడిన ప్రజల చరిత్ర అనేక శతాబ్దాలు నుండి ఉంది.దీనికి నీలగిరి అనే పేరు నీలి మబ్బులు ఈ కొండలను తరుచూ విస్తృతంగా ఆవరించుటవల్లగానీ, స్ట్రోబిలాంథెస్ పుష్పం లేదా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పొగమంచు కారణంగా ఈ పేరు పెట్టబడి ఉండవచ్చు. ఈ ప్రాంతాన్ని తోడా, కోట, కురుంబ, ఇరుల, బడగాస్‌కు చెందిన ఆదివాసీ ప్రజలు చాలా కాలంగా ఆక్రమించారు. ప్రత్యేకించి బలహీన గిరిజన సమూహాలు పివిటిజిలు, గిరిజన జిల్లాలోని ఆధిపత్య భూ యజమానులు. జిల్లాకు పశ్చిమాన ఉన్న దిగువ వాయనాడ్ పీఠభూమిలో కట్టునైక, పానియా అనే విభిన్న గిరిజన జనాభా ఉంది. సంస్కృతి, భాష, జన్యు పూర్వీకులలో సారూప్యత కలిగిన తోడలు, కోటలు మధ్య జిల్లాకు సెంట్రీలుగా నీలగిరి పీఠభూమి అంచులలో స్థిరపడ్డారు.బ్రిటీష్ ప్రభావంతో వారు కూరగాయలను పండించారు.తరువాత టీ తోటలు పెంపకం సాగుచేయటానికి మారారు.

నీలగిరి ప్రాంతం ఒక రాష్ట్రం లేదా అది ఏ పురాతన రాజ్యం లేదా సామ్రాజ్యంలో భాగమని ఇంతవరకు ఎక్కడా చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఎప్పటినుంచో గిరిజనుల భూమిగా కనిపిస్తుంది. తోడా పీఠభూమిలో చాలా వరకు చిన్న కుగ్రామాలు కలిగి ఉన్నాయి. తోడాకు దిగువ వైనాడ్ పీఠభూమి, సమీపంలోని బిలిగిరిరంగ కొండలలో కొన్ని కుగ్రామాలు మాత్రమే ఉన్నాయి. 21వ శతాబ్దం ప్రారంభం నుండి, బడగాల సంఖ్య దాదాపు 1,35,000 (జిల్లా జనాభాలో 18%) ఉన్నారు.

జనాభా గణనసవరించు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19011,12,882—    
19111,18,618+0.50%
19211,26,519+0.65%
19311,69,330+2.96%
19412,09,709+2.16%
19513,11,729+4.04%
19614,09,308+2.76%
19714,94,015+1.90%
19816,30,169+2.46%
19917,10,214+1.20%
20017,62,141+0.71%
20117,35,394−0.36%
ఆధారం:[4]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నీలగిరి జిల్లాలో 7,35,394 జనాభా ఉంది, ప్రతి 1,000 మంది పురుషులకు 1,042 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఇది జాతీయ సగటు 929 స్త్రీల కంటే చాలా ఎక్కువ. జనాభాలో 59.24% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. జనాభా మొత్తంలో 66,799 మంది ఆరు సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సుఉన్న వారు ఉన్నారు.వారిలో 33,648 పురుషులు ఉండగా, 33,151 మంది మహిళలు. షెడ్యూల్డ్ కులాలు వారు జనాభాలో 32.08% మంది ఉన్నారు. షెడ్యూల్డ్ తెగలు వారు 4.46% మంది ఉన్నారు. జిల్లా సగటు అక్షరాస్యత 77.46%, జాతీయ సగటు 72.99%తో పోలిస్తే ఎక్కువు. జిల్లాలో మొత్తం 197,653 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 3,49,974 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 14,592 మంది రైతులు, 71,738 మంది వ్యవసాయ కార్మికులు, 3,019 మంది గృహ పరిశ్రమలు, 2,29,575 మంది ఇతర కార్మికులు, 31,050 ఉపాంత కార్మికులు ఉన్నారు గత 140 సంవత్సరాలుగా ఈ జిల్లాలో తీవ్రంగా కృషి చేసిన మానవ శాస్త్రవేత్తలు ఇక్కడ నివసిస్తున్న 15 తెగలను గుర్తించారు. వాటి గురించి వ్రాతపూర్వక రికార్డులు లేనందున వాటి మూలాలు అనిశ్చితంగా ఉన్నాయి. పాల ఉత్పత్తులు వారి ఆహారంలో ఆధారం. వారు అధిక శుద్ధి చేసిన ఎరుపు, నలుపు, తెలుపు ఎంబ్రాయిడరీ శాలువాలు తయారుచేస్తారు. జిల్లా కురుంబ, ఇరుల, పనియా, కట్టునాయకన్ లేదా నాయకులకు నిలయం. .

మొత్తం నీలగిరి పీఠభూమి, పశ్చిమ, తూర్పు కనుమల మీదుగా (500మీ ఎంఎస్ఎల్ కంటే ఎత్తులో ఉన్న) మైదానాల పైన ఉన్న అన్ని కొండ ప్రాంతాలు, మైసూర్ పీఠభూమి కన్నడ మాట్లాడే ప్రాంతం కిందకు వచ్చాయి.[5][6] [7][8]

మతాల ప్రకారం జనాభాసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం, నీలగిరి జిల్లాలో 76.61% హిందువులు, 11.51% క్రైస్తవులు, 10.67% ముస్లింలు ఉన్నారు. కేరళ రాష్ట్రంలోని వాయనాడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల నుండి చాలా మంది ముస్లింలు, క్రైస్తవులు నీలగిరికి వలస వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల ఆధిపత్యం ఎక్కువ.

మతాల ప్రకారం జిల్లా జనాభా
మతం శాతం
హిందూ
  
77.44%
క్రిష్టియన్లు
  
11.51%
ముస్లిం
  
10.67%
మత వివరాలు తెలపనివారు
  
0.38%

జిల్లా పరిపాలనసవరించు

నీలగిరి జిల్లా 1868 నుండి ప్రభుత్వం నియమించిన కలెక్టర్ నేతృత్వంలో పరిపాలన సాగుతుంది.జిల్లా మొదటి పరిపాలనా నిర్వహకుడు జేమ్స్ డబ్ల్యు. బ్రీక్స్, అతను ఆ సమయంలో కమిషనర్ అని వ్యవహరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మందికి పైగా ఈ పదవిలో ఉన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలపై పర్యవేక్షించే అధికారం కలిగిఉంటారు.

స్థానిక సంస్థలుసవరించు

వీటిని ఉదగమండలం, కూనూరు, కోటగిరి, గూడలూరు అనే నాలుగు పంచాయతీ యూనియన్లుగా విభజించారు..జిల్లాలో ఊటీ, కూనూర్, గూడలూర్, నెల్లియాలం అనే నాలుగు పురపాలక సంఘాలు వెల్లింగ్టన్ కంటోన్మెంట్, అరువంకాడు అనే రెండు టౌన్‌షిప్ లు ఉన్నాయి.

రెవెన్యూ విభాగాలుసవరించు

జిల్లాలో ఉదగమండలం (ఊటీ/ఊటకమండ్), కుందా, కూనూర్, కోటగిరి, గూడలూర్, పందలూరు అనే ఆరు తాలూకాలు, 56 రెవెన్యూ గ్రామాలు, 15 రెవెన్యూ ఫిర్కాలు ఉన్నాయి.

ఊదకమండలం, కూనూరు, గూడలూరు అనే మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. స్థానిక సమస్యల కోసం, నీలగిరిలో 35 గ్రామ పంచాయతీలు, 11 పట్టణ పంచాయతీలు కూడా ఉన్నాయి.[9]

కూనూరు రెవెన్యూ డివిజన్సవరించు

  • కోటగిరి తాలూకా
  • కూనూర్ తాలూకా

ఉదగమండలం రెవెన్యూ డివిజన్సవరించు

  • ఉదగమండలం తాలూకా
  • కుందా తాలూకా

గూడలూరు రెవెన్యూ డివిజన్సవరించు

  • గూడలూరు తాలూకా
  • పందలూరు తాలూకా

బ్లాక్‌లు, రెవెన్యూ తాలూకాలుసవరించు

  • కోటగిరి బ్లాక్ కోటగిరి తాలూకాను కలిగి ఉంది.
  • కూనూర్ బ్లాక్ కూనూర్ తాలూకాను కలిగి ఉంది.
  • ఉదగమండలం బ్లాక్‌లో ఉదగమండలం, కుంద తాలూకాలు ఉన్నాయి.
  • గూడలూర్ బ్లాక్ గూడలూర్, పందలూరు తాలూకాలను కలిగి ఉంది.

మూలాలుసవరించు

  1. "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
  2. District Census Handbook, The Nilgiris (PDF). Chennai: Directorate of Census Operations, Tamil Nadu.
  3. Premkumar, Rohan (10 March 2018). "The clandestine gold diggers of the Nilgiris". The Hindu. Retrieved 4 June 2021.
  4. Decadal Variation In Population Since 1901
  5. ఇంపీరియల్ గెజిటీర్ భారతదేశం, v. 9, p. 301. DSAL. p. 301.
  6. Francis, W. (1988). Gazetteer of South India. మిట్టల్ పబ్లికేషన్స్. p. 183.
  7. ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియా ప్రొవిన్షియల్ సిరీస్ మద్రాస్ (in ఇంగ్లీష్). సూపరింటెండెంట్ గవర్నమెంట్, కలకత్తా. 1908. p. 183.
  8. Frowde, హెన్రీ (1908). ది ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియా వాల్యూం Ix బొమ్‌జూర్-సెంట్రల్ ఇండియా. p. 301.
  9. "Home: District of The Nilgiris, Tamilnadu, India". Archived from the original on 2011-09-27. Retrieved 2023-02-01.

వెలుపలి లింకులుసవరించు