జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ

జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ (ఆంగ్లం:Nationalist Democratic Progressive Party NDPP) భారతదేశానికి చెందిన నాగాలాండ్‌లోని ప్రాంతీయ రాజకీయ పార్టీ. చింగ్వాంగ్ కొన్యాక్ ఈ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు.[1]

జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ
సెక్రటరీ జనరల్అబూ మెహతా
స్థాపకులునెయిఫియు రియో
స్థాపన తేదీ17 మే 2017 (7 సంవత్సరాల క్రితం) (2017-05-17)
ప్రధాన కార్యాలయంH/No:155 (1),4వ వార్డు, దిమాపూర్ నాగాలాండ్, భారతదేశం - 797103
రాజకీయ విధానంప్రాంతీయత
రంగు(లు)తెలుపు,ఎరుపు, నలుపు
ECI StatusState Party
కూటమిNDA (2018-present)
లోక్‌సభ స్థానాలు
1 / 543
రాజ్యసభ స్థానాలు
0 / 245
శాసన సభలో స్థానాలు
21 / 60
Website
http://ndpp.co.in/
నెయిఫియు రియో
నెయిఫియు రియో

నెయిఫియు రియో మద్దతు దారులు నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (నాగాలాండ్)ని స్థాపించారు. 2017 అక్టోబరులో ఈ పార్టీ పేరు జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీగా మార్చబడింది.

2018 నాగాలాండ్ శాసనసభ ఎన్నికలకు నాగ పీపుల్స్ ఫ్రంట్ భారతీయ జనతా పార్టీతో సంబంధాలు తెంచుకున్న తరువాత జనవరి 2018 లో మాజీ ముఖ్యమంత్రి నీఫియు రియో పార్టీలో చేరారు. అదే నెలలోనే 10 మంది ఎన్‌పిఎఫ్‌ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వైదొలిగి ఎన్‌డిపిపితో చర్చలు ప్రారంభించారు.

మూలాలు

మార్చు
  1. "India News, Nagaland News, Breaking News |". MorungExpress. Retrieved 2021-07-11.