నైషా ఖన్నా (జననం 2006 ఫిబ్రవరి 11) భారతీయ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ప్రధానంగా హిందీ సినిమాలలో నటించే ఆమె బాలనటిగా అరంగేట్రం చేసింది. ఆమె తొలి చిత్రం బ్రదర్స్ (2015) కాగా బార్ బార్ దేఖో (2016), కహానీ2, ఫిరంగి (2017), హిచ్కీ (2018), లవ్‌యాత్రి (2018), టోర్బాజ్ (2020) వంటి మరెన్నో చిత్రాలలో పలు పాత్రలు పోషించింది. సెప్టెంబరు 2023లో వచ్చిన జానే జాన్‌ చిత్రంలోనూ ఆమె నటించింది.[1]

నైషా ఖన్నా
జననం (2006-02-11) 2006 ఫిబ్రవరి 11 (వయసు 18)
జాతీయతభారతీయురాలు
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2015 - ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • రోహిత్ ఖన్నా (తండ్రి)
  • మహేక్ ఖన్నా (తల్లి)

ఇక ఆమె టెలీవిజన్ ధారావాహిక ఉత్తరన్ లో కెరీర్ మొదలుపెట్టింది. కహానీ 2: దుర్గా రాణి సింగ్ లో మిన్నీ పాత్రతో ఆమె ప్రసిద్ధిచెందింది. మైండ్ ది మల్హోత్రాస్, బటర్‌ఫ్లైస్, మిషన్ ఓవర్ మార్స్, దస్తాన్-ఇ-మొహబ్బత్: సలీం అనార్కలి వంటి టీవీ కార్యక్రమాలలోనూ నటించింది.[2]

మూలాలు మార్చు

  1. "Jaane Jaan Review: రివ్యూ: జానే జాన్‌.. కరీనా తొలి ఓటీటీ మూవీ మెప్పించిందా? | jaane jaan review in telugu". web.archive.org. 2023-09-23. Archived from the original on 2023-09-23. Retrieved 2023-09-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Naisha Khanna हाइट, Weight, उम्र, परिवार, Biography in Hindi - बायोग्राफी". web.archive.org. 2023-09-23. Archived from the original on 2023-09-23. Retrieved 2023-09-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)