పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి

పంజాగుట్ట హైదరాబాద్ నగరంలోని రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఒకటి. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద ముఫకంజా కాలేజి వైపు నుంచి నాగార్జున సర్కిల్‌ వైపు సులువుగా వెళ్లేలా ఈ స్టీల్ బ్రిడ్జిని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.

నిర్మాణం మార్చు

పంజాగుట్టలో రెండు లేన్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఫిబ్రవరి 2020లో చేపట్టారు. పంజాగుట్ట చట్నీస్ హోటల్ ముందు నుంచి శ్మశానవాటిక మీదుగా చౌరస్తా వరకు 110 మీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. మొత్తం రోడ్డు విస్తీర్ణం 140 మీటర్లు కాగా అందులో అప్రోచ్ రిటర్నింగ్ వాల్ 57 మీటర్లు, 9.6 మీటర్ల ఫ్లైఓవర్ మొత్తం 46 స్టీల్ గ్రీడర్స్ ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ రూ.17 కోట్లు మంజూరు చేసింది.[1]

ప్రారంభం మార్చు

పంజాగుట్ట స్టీల్ స్టీల్‌ బ్రిడ్జ్‌ను 21 జనవరి 2022న రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌, హైదరాబాద్ మేయర్​ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత రెడ్డి, కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.[2][3][4]

మూలాలు మార్చు

  1. Sakshi (19 January 2022). "పంజగుట్ట కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభానికి సర్వం సిద్ధం". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
  2. TV9 Telugu (18 January 2022). "గురువారం నుంచి అందుబాటులోకి రానున్న పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి! ..చిత్రాలు". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhrajyothy (21 January 2022). "అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
  4. Mana Telangana (18 January 2022). "గురువారం పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి ప్రారంభం..." Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.