పగడంవారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పగడంవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
పగడంవారిపాలెం is located in Andhra Pradesh
పగడంవారిపాలెం
పగడంవారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°02′N 80°40′E / 16.04°N 80.67°E / 16.04; 80.67
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 309
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం రాంభొట్లపాలెం గ్రామానికి శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

  1. శ్రీ బండ్లమ్మ తల్లి ఆలయo:- పగడంవారిపాలెం గ్రామదేవత శ్రీ బండ్లమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణం పూర్తి అయినది. ఈ సందర్భంగా 2014, ఫిబ్రవరి-7 (శుక్రవారం నాడు) అమ్మవారి విగ్రహానికి గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి మహిళలు, నీళ్ళు వారపోసి హారతులిచ్చారు. వేదపండితులు యగ్నక్రతువులు నిర్వహించారు. బండ్లమ్మ తల్లి దేవాలయ పునహ్ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2014, ఫిబ్రవరి-9 ఆదివారం నాడు, వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో అమ్మవారికి 2014, ఏప్రిల్-13 నుండి 17 వరకు, ఐదురోజులపాటు కొలువులు నిర్వహించెదరు. విగ్రహప్రతిష్ఠ జరిపిన రెండు నెలలలోపు, ఆనవాయితీ ప్రకారం కొలువులు నిర్వహించుచున్నారు.
  2. శ్రీ రామాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నివహించెదరు.
  3. శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఈ గ్రామములో పగడంవారి ఇలవేలుపు అయిన శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠను, 2016, ఏప్రిల్-2వ తేదీ శనివారంనాడు ఘనంగా నిర్వహించారు. హోమం, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఆలయంలోని అమ్మవారికి పూజలు చేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. మద్యాహ్నం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.

మూలాలు మార్చు